YS Jagan : వైయస్‌ఆర్ పింఛన్ కానుక.. ప్రతి అవ్వ తాత గుండెల్లో వైయస్‌ జగన్‌

Advertisement
Advertisement

YS Jagan : వైయస్‌ రాజశేఖర్ రెడ్డి సీఎం కాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి తక్కువ మందికి.. అది కూడా నెలకు 75 రూపాయల చొప్పున పింఛన్ ఇచ్చేవారు. ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చారో.. ఇక అప్పటి నుంచి పేద వృద్దులు, దివ్యాంగులకు ఇస్తున్న పింఛన్ ను రూ. 200కు పెంచారు. ఆ నిర్ణయం అప్పట్లో ఒక సంచలనంగా నిలిచింది. 200 రూపాయలకు పింఛన్ పెంచడంతో పాటు.. కొత్తగా మరో 23 లక్షల మందికి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం మంజూరు చేసి ఆపన్నహస్తం అందించారు. వృద్దులకు.. వితంతువులకు మరియు దివ్యాంగులందరికి కూడా పింఛన్ అందాలనే ఉద్దేశ్యంతో అప్పటి ప్రభుత్వం నిబంధనలు సులభతరం చేయడం జరిగింది.

Advertisement

ఇక అప్పటి నుంచి పింఛన్ అనగానే రాజశేఖర్ రెడ్డి గుర్తుకు వచ్చేవారు. తండ్రికి తగ్గ తనయుడిగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి పేదలకు ఆపన్నహస్తం అందించి… వారి గుండెల్లో నిలుస్తున్నారు. రాష్ట్రంలోని అర్హులు అయిన ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ ను అందిస్తున్న ఘనత కేవలం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డికి మాత్రమే దక్కుతుంది. ఇటీవల కాలంలో పెరిగిన ఖర్చులు.. వృద్దుల అవసరాల దృష్ట్యా నెలకు 2500 రూపాయలను వైయస్‌ఆర్ పింఛన్ కానుక పేరుతో నేరుగా ఇంటింటికి వెళ్లి మరీ వృద్దులు, ఒంటరి మహిళలు తదితర అర్హులకు అందజేస్తున్నారు.

Advertisement

CM YS Jagan Distributes YSR PENSION KANUKA Rs 2500

YS Jagan : వైయస్‌ఆర్ పింఛన్ కానుకకు నో పాలిటిక్స్..

ప్రతి నెల రూ.1543.17 కోట్లను పింఛన్ కోసం జగన్ ప్రభుత్వం కేటాయిస్తోంది. మే నెల ప్రారంభం కాకముందే ప్రభుత్వ ఖజానా నుండి పింఛన్ డబ్బును విడుదల చేయడం జరిగింది. ఒక్కరోజు కూడా ఆలస్యం లేకుండా ఒకటవ తారీకునే పింఛన్ ను ఇస్తున్న ఘనత దేశంలో కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుంది. నవరత్నాల హామీ లో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మొత్తంను భారీగా పెంచడంతో పాటు.. గతంలో ఉన్న కఠిన నిబంధనలను తొలగించి అర్హులు అయిన ప్రతి ఒక్కరికి కూడా పింఛన్‌ ఇచ్చేందుకు జగన్ సర్కార్ సిద్దం అయ్యింది.

గత ప్రభుత్వంలో పార్టీ కార్యకర్తలు మరియు ఇతర సమీకరణాలు చూసి మరీ పింఛన్ ను ఇచ్చేవారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే అర్హులు అయిన వారికి కాకుండా అనర్హులకు పింఛన్ లు ఇచ్చిన ఘనత కూడా గత ప్రభుత్వాలదనే ఆరోపణలు లేకపోలేదు. కానీ.. ఇప్పుడు అర్హులు అయిన ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ ఇవ్వడంతో పాటు అత్యంత పారదర్శంగా పింఛన్ అర్హులను ఎంపిక చేస్తున్నారు. ఎక్కడా రహస్యం లేదు.. ఎక్కడ కూడా గోప్యత అనేది లేకుండా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా గ్రామ వాలంటీర్‌ లు వెళ్లి మరీ పింఛన్ ను అవ్వలు, తాతలు, ఇతర అర్హులందరికీ అందిస్తున్నారు.

CM YS Jagan Distributes YSR PENSION KANUKA Rs 2500

YS Jagan : ప్రతి ఒక్క అవ్వ తాత గుండెల్లో జగన్‌…

కేవలం వయసు పైబడిన వాళ్లకు మాత్రమే కాకుండా దివ్యాంగులు మరియు దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి.. తోడు లేని ఒంటరి మహిళకు ఇలా అర్హులైన ప్రతీ ఒక్కరికీ పింఛన్ ఇస్తూ జగన్ సర్కార్ అభయహస్తం అందిస్తోంది. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కూడా పింఛన్ అనేది ఆపకుండా ఇస్తూ.. ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచేలా జగన్ ప్రభుత్వం పని చేస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పింఛన్ పథకం రాబోయే ఎన్నికల్లో జగన్‌ పార్టీని మరోసారి అద్బుతమైన విజయం దిశగా తీసుకు వెళ్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పింఛన్ తీసుకుంటున్న ప్రతి ఒక్క అవ్వ.. తాత.. అక్క.. తమ్ముడు కూడా జగన్ ను తమ గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారు.

పేదల సంక్షేమమే ధ్యేయంగా.. వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆలస్యం లేకుండా పెద్దమొత్తంలో పింఛన్ అందిస్తున్న జగన్ సర్కార్ ను అర్హులు, అర్హుల కుటుంబసభ్యులతో పాటు ఎంతో మంది దైవంగా భావిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వైయస్‌ఆర్‌ పింఛన్ కానుక ఉందంటూ జాతీయ స్థాయి రాజకీయ నాయకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పింఛన్‌ అనేది మరింతగా పెంచేందుకు కూడా జగన్‌ ప్రభుత్వం భవిష్యత్తులో ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. వృద్ధాప్యంలో ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశ్యంతో సీఎం జగన్‌ ఇస్తున్న పింఛన్ అర్హులకు ఎంతో తోడ్పాటును అందిస్తుంది అంటూ క్షేత్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.

Advertisement

Recent Posts

Jyotishyam : బాబా వంగా జ్యోతిష్య శాస్త్రం అంచనా ప్రకారం… ముంచుకొస్తున్న ప్రపంచ వినాశనం… క్షణం క్షణం భయం…?

Jyotishyam : శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుని జరిగే సంఘటనలను చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి గాంచింది.. బాబా…

10 minutes ago

Rajitha Parameshwar Reddy : ఉప్పల్ భ‌ర‌త్‌న‌గ‌ర్ మాల‌బ‌స్తీలో రూ.1.70 కోట్ల‌తో అభివృద్ధి పనులు.. : ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌ రెడ్డి

Rajitha Parameshwar Reddy : ఉప్ప‌ల్ డివిజ‌న్ Uppal Division స‌మ‌గ్రాభివృద్ధికి కృషి చేస్తున్న‌ట్టుగా కార్పొరేట‌ర్ మందుముల ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి  Rajitha…

8 hours ago

Raashii Khanna : మైమ‌రిపించే అందాల‌తో మంత్ర ముగ్ధుల్ని చేస్తున్న రాశీ ఖ‌న్నా.. ఫొటోలు వైర‌ల్

Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖ‌న్నా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…

9 hours ago

Boy Saved 39 Acres : ఒక్క లెటర్ తో 39 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా కాకుండ సేవ్ చేసిన బాలుడు..!

Boy Saved 39 Acres : హైదరాబాద్‌లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…

10 hours ago

Vitamin D : దాంపత్య జీవితానికి ఈ విటమిన్ లోపిస్తే… అందులో సామర్థ్యం తగ్గుతుందట… ఇక అంతే సంగతులు…?

Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…

11 hours ago

Saree Viral Video : ఓహ్..ఈ టైపు చీరలు కూడా వచ్చాయా..? దేవుడా..?

Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…

12 hours ago

Raj Tarun – Lavanya : రాజ్ తరుణ్- లావణ్య కేసులో సంచలన ట్విస్ట్..!

Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…

13 hours ago

Chandrababu : చంద్రబాబు జన్మదిన వేడుకలు .. వేలిముద్రలతో చంద్రబాబు చిత్రం.. కుప్పం మహిళల మజాకా..!

Chandrababu  : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…

14 hours ago