Home » News » Congress Focus On Jubilee Hills Bypoll Cm Revanth Key Meeting
News

Jubilee Hills Bypoll | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ దృష్టి.. అభ్యర్థి ఎంపికపై సీఎం రేవంత్ సమీక్ష

Authored By
Sam C
The Telugu News | Published on: September 15, 2025, 8:00 pm
Advertisement

Jubilee Hills Bypoll | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై అధికార కాంగ్రెస్ పార్టీ పూర్తి ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో పార్టీ అగ్రనేతలు సమీక్ష సమావేశం నిర్వహించారు. అభ్యర్థి ఎంపిక నుంచి అభివృద్ధి పనులపై వ్యూహాత్మకంగా చర్చలు సాగినట్లు సమాచారం.

Advertisement

#image_title

ప‌క్కా స్కెచ్‌తో..

Advertisement

ఈ సమీక్ష సమావేశానికి టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, ఎన్నికల ఇంఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ప్రగతిపై వివరాలు తెలియజేసిన మంత్రులకు, అభ్యర్థుల విజయావకాశాలపై జరిగిన సర్వే రిపోర్టును మహేశ్ గౌడ్ సీఎంకు సమర్పించారు.

జూబ్లీహిల్స్ టికెట్ కోసం ఇప్పటివరకు ముగ్గురు ప్రధాన నేతల పేర్లు వినిపిస్తున్నాయి.నవీన్ కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్ (గత జీహెచ్ఎంసీ మేయర్), అంజన్ కుమార్ యాదవ్ (మాజీ ఎంపీ). సర్వే రిపోర్టు ఆధారంగా వీరిలో ఎవరికే అధిక అవకాశాలు ఉన్నాయో సీఎం రేవంత్ నేతృత్వంలో పార్టీ పరిశీలిస్తోంది. అభ్యర్థి ఎంపికలో తుది నిర్ణయం తీసుకునే ముందు పార్టీ జీతగాళ్ల అభిప్రాయం, బూత్ స్థాయిలో హేతుబద్ధ విశ్లేషణ, సామాజిక సమీకరణాలు వంటి అంశాలపై దృష్టిసారించనున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి