Doctor Preethi death mystery
Doctor Preethi : వరంగల్ లోని కాకతీయ వైద్య కళాశాలకు చెందిన ప్రీతి మత్తు ఇంజక్షన్ తీసుకొని సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈనెల 22న మత్తు ఇంజక్షన్ తీసుకున్న ప్రీతి ఐదు రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఆదివారం మృతి చెందారు. దీంతో ప్రీతి మరణం పై షాకింగ్ విషయాలు బయటకి వస్తున్నాయి. ప్రీతి సీనియర్ విద్యార్థి సైఫ్ అనే వ్యక్తి వేధింపులు తట్టుకోలేక ప్రీతి ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు విలపించారు. ప్రీతి చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సోమవారం ప్రీతి సొంత ఊరులో అంత్యక్రియలు జరిగాయి. ఇప్పటికే ప్రీతి కేసులో అనేక ట్విస్టులు బయటికి వచ్చాయి. అయితే ప్రస్తుతం ప్రీతి కేసులో మరొక వార్త వినిపిస్తోంది.
Doctor Preethi death mystery
వైద్య విద్యలో సీటు వచ్చిన సమయంలో అడ్మిషన్ బాండ్ 50 లక్షల అగ్రిమెంట్ పై సంతకం చేయాల్సి ఉంటుంది. అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఏవైనా కారణాలతో మధ్యలో డ్రాప్ అయితే ఆ 50 లక్షలు కాలేజీకి చెల్లించాల్సి ఉంటుంది. గతేడాది యూనివర్సిటీ మెడికల్ పీజీ సీటు మధ్యలో వదులుకుంటే 20 లక్షలు కట్టాల్సి ఉంటుందనే నిబంధన ఉండేది. అయితే చాలామంది వైద్య విద్యార్థులు మధ్యలోనే డ్రాప్ ఐపోతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏడాది మొత్తాన్ని 50 లక్షలు పెంచింది. దీంతో చాలామంది విద్యార్థులు కాలేజీ వదిలి వెళ్ళేందుకు ధైర్యం చేయట్లేదని కొందరు అంటున్నారు. అలాగే వేధింపులు, ర్యాగింగ్ ఇతరత్రా సమస్యలు ఉన్న పీజీ పూర్తి చేస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి.
ఇదే విషయం ప్రీతికి జరిగిందని అంటున్నారు. సైఫ్ నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో సీటు వదిలేయమని ప్రీతి తండ్రి నరేందర్ చెప్పారు. ఆ సమయంలో ప్రీతి చాలా వేదనకు గురైందని సమాచారం. 50 లక్షలు యూనివర్సిటీకి చెల్లించాల్సి ఉంటుంది కదా అన్ని డబ్బులు ఎలా ఇవ్వగలం అని ఆమె చివరి మాటల్లో చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణం తోనే ప్రీతి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే వేధింపులు, ర్యాగింగ్ లపై చర్యలు తీసుకోవాలని వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రభుత్వం కొత్త అడ్మిషన్ బాండ్ నిబంధనలు తీసుకురావాలని లేదా విద్యార్థులకు న్యాయం జరిగేలా చేయాలని తల్లిదండ్రులు అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.