Etela Rajender : నిన్న భట్టి విక్రమార్క.. ఇవాళ మరో సీనియర్ నేతతో ఈటల భేటీ.. కాంగ్రెస్ లో చేరిక ఖాయం అయినట్టే?

Advertisement
Published by
Advertisement

Etela Rajender : ఈటల రాజేందర్ గురించే ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా హాట్ టాపిక్. ఓవైపు కరోనా తీవ్రంగా విజృంభిస్తున్నా.. కరోనా కన్నా ఎక్కువగా ఈటల గురించే తెలంగాణ ప్రజలు చర్చిస్తున్నారు. ఆయన్ను ఏకాకిని చేయడం.. మంత్రివర్గం నుంచి తీసేయడం.. భూకబ్జా ఆరోపణలు చేయడం అన్నీ ఒక్కసారిగా కన్నుమూసి తెరిచేలోగా జరిగిపోయాయి. దీంతో ఈటల వర్గంతో పాటు అంతా ఆశ్చర్యపోయారు. అసలు.. తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది అంటూ అందరూ ముక్కున వేలేసుకున్నారు. చివరకు ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించడం.. అంతకుముందే.. ఆయన వైద్యారోగ్య శాఖను సీఎం కేసీఆర్ బదిలీ చేసుకోవడం.. అన్నీ గమనించిన తెలంగాణ ప్రజలు.. ఈటలపై టీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ ఫోకస్ పెట్టిందని అర్థమయింది. అయితే.. ప్రస్తుతం ఈటల హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి.. ఆయన టీఆర్ఎస్ పార్టీకి, పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? లేక వేరే పార్టీలో చేరుతారా? లేదంటే కొత్త పార్టీ పెడతారా? అనే మీమాంశలో అందరూ ఉన్నారు.

Advertisement

etela rajender meets congress leader srinivas

ఈటల రాజేందర్.. బీజేపీలో చేరుతున్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి. ఆయన కేంద్ర మంత్ర కిషన్ రెడ్డి, బండి సంజయ్ తోనూ భేటీ అయ్యారంటూ వార్తలు వచ్చినా.. వాటిలో నిజం కనిపించలేదు. అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. ఆ తర్వాత ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెడుతున్నారని.. ఆయన అనుచరులు కొత్త పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారని వార్తలు వచ్చినా.. అవి కూడా గాసిప్స్ గానే మిగిలిపోయాయి. అయితే.. గత రెండు రోజుల నుంచి ఈటల చేస్తున్న పని చూస్తుంటే.. ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి.

Advertisement

Etela Rajender : కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీనివాస్ తో ఈటల భేటీ

నిన్న మే 11న ఈటల రాజేందర్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో భేటీ అయిన విషయం తెలిసిందే. వాళ్లిద్దరూ సీక్రెట్ గా బేటీ అయ్యారు. హైదరాబాద్ లోని భట్టీ ఇంట్లో.. ఈటల భేటీ అయ్యారు. దీంతో ఈటల రాజేందర్.. ఖచ్చితంగా కాంగ్రెస్ లో చేరుతారు.. అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం… ఈటల రాజేందర్.. డీఎస్ తనయుడు, బీజేపీ ఎంపీ అరవింద్ తో భేటీ అయ్యారు ఈటల.

etela rajender meets congress leader srinivas

తాజాగా… రాజ్యసభ ఎంపీ డీ శ్రీనివాస్ తో ఈటల భేటీ అయ్యారు. వీళ్లు ఇద్దరూ కలిసి దాదాపు గంటన్నర పాటు చర్చించినట్టు తెలుస్తోంది. భవిష్యత్తు రాజకీయాలపై ఇద్దరూ చర్చించినట్టు తెలుస్తోంది. అయితే.. అసలు.. ఈటల నిన్న భట్టితో ఏం మాట్లాడారు.. ఇవాళ డీశ్రీనివాస్ తో ఏం మాట్లాడారు అనే దానిపై స్పష్టత లేరు. డీ శ్రీనివాస్ మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ తన సొంత పార్టీ కాంగ్రెస్ కే మద్దతు పలుకుతున్నారు. ఇలా వరుసగా.. కాంగ్రెస్ నేతలతో ఈటల రాజేందర్ భేటీ అవుతుండటంతో ఈటల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని.. అందుకే.. ఈ సంప్రదింపులు అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే ఈటల నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సిందే.

Advertisement
Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Recent Posts

Russia : డాలర్ దిశగా రష్యా కొత్త అడుగు : భారత్‌పై ఎలాంటి ప్రభావం పడనుంది ..?

Russia : గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ వాణిజ్యాన్ని ఆధిపత్యం చేస్తున్న అమెరికన్ డాలర్‌కు ప్రత్యామ్నాయ వ్యవస్థను నిర్మించాలని రష్యా…

34 minutes ago

Mad For Each Other Couple Show : బిగ్ బాస్ ని మించిన షో .. కపుల్స్ అందరూ రిసార్ట్ లో.. Contestants లిస్టు ఇదిగో

Mad For Each Other Couple Show : బిగ్‌బాస్ షోకి ఉండే క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు…

2 hours ago

Half-day schools : విద్యార్థులు, ఉపాధ్యాయులకు శుభవార్త .. ఫిబ్రవరి 19 నుంచి కొత్త టైమింగ్స్ .. !

Half-day schools : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ముస్లిం విద్యార్థులు, ఉపాధ్యాయులకు శుభవార్త తెలియజేసింది.…

3 hours ago

Pratyusha Death Case : నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు .. 24 ఏళ్ల క్రితం ఏం జరిగింది..?

Pratyusha Death Case : టాలీవుడ్‌లో విషాదానికి ప్రతీకగా నిలిచిన నటి ప్రత్యూష మృతి కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం…

3 hours ago

T20 World Cup 2026 : విజయం మధ్య వైరల్ ఘర్షణ .. మరోసారి గొడవపడిన కుల్దీప్, సూర్యకుమార్.. ఎందుకో తెలుసా ?

T20 World Cup 2026  : టీ20 ప్రపంచ కప్‌లో భారత్ మరోసారి పాకిస్థాన్‌పై ఆధిపత్యం చాటింది. ఫిబ్రవరి 15న…

4 hours ago

YS Jagan : 2024 లో జగన్ ఓటమి వెనక రహస్యం లీక్ .. పోలింగ్ పూర్తయిన రాత్రి ఏం జరిగింది ..?

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల ఫలితాలు వచ్చి చాలా రోజులు అవుతున్నా ఆ ఓటింగ్ జరిగిన తీరు…

5 hours ago

Income Tax Rules : ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కీలక మార్పులు : ఏప్రిల్ 1 నుంచి కొత్త ఫారమ్ వ్యవస్థ .. కొత్త రూల్స్

Income Tax Rules : దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ముఖ్యమైన అప్‌డేట్ వెలువడింది. దశాబ్దాలుగా ఉపయోగంలో ఉన్న ఫారమ్…

6 hours ago

NCC Jobs : మహిళలకు అద్భుత అవకాశం .. NCCలో అప్లికేషన్ ఫీజు లేకుండా జాబ్

NCC Jobs : భారత సైన్యంలో అధికారిణిగా సేవ చేయాలని ఆశిస్తున్న మహిళలకు శుభవార్త. ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న…

7 hours ago