
KCR
Etela Rajender : ఈటల రాజేందర్.. ప్రస్తుతం తెలంగాణలో ఈయన గురించే హాట్ టాపిక్. ఈటల రాజేందర్ తెలంగాణ ఆరోగ్య మంత్రి మాత్రమే కాదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నిఖార్సయిన నాయకుడు. మొదటి నుంచి సీఎం కేసీఆర్ వెంట ఉండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు ఈటల రాజేందర్. అందుకే… ఈటల రాజేందర్ కు తెలంగాణలో చాలా పాపులారిటీ ఉంది. అయితే… టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అయినా ఇప్పటి వరకు ఎన్నడూ ఈటల రాజేందర్ పై ఎటువంటి ఆరోపణలు రాలేదు. ఏనాడూ ఈటల అవినీతి పరుడు అన్నట్టుగా ఎటువంటి పని జరగలేదు.
etela rajender to resign for his ministry and three are in queue
కానీ.. అనూహ్యంగా కొన్ని మీడియా చానెళ్లలో ఈటల రాజేందర్ భూకబ్జా చేశారంటూ కథనాలు ప్రసారం అయ్యాయి. 100 ఎకరాలను ఈటల కబ్జా చేశారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే… ఇదంతా ఓవైపు ఉంటే.. గత కొన్ని రోజుల నుంచి మంత్రి ఈటల టీఆర్ఎస్ హైకమాండ్ తో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. ఇటీవల కూడా కేసీఆర్ తో ఈటల భేటీ అయినప్పటికీ వీళ్ల మధ్య ఏం జరిగిందనేది తెలియట్లేదు. తాజాగా కొందరు రైతులు సీఎం కేసీఆర్ కు లేఖ రాశారని తెలిసింది. ఈటల రాజేందర్ భూకబ్జా చేశారని.. తమ భూముల్లో రోడ్లు వేయిస్తున్నారని సీఎంకు రైతులు లేఖ రాయడంతో… వెంటనే విచారణకు కేసీఆర్ ఆదేశించారు. ఆ తర్వాత వెంటనే మీడియాలో ఈటల భూకబ్జా చేశారని కథనాలు ప్రసారం అయ్యాయి.
తనపై భూకబ్జా ఆరోపణలు రావడంతో వెంటనే మంత్రి ఈటల ప్రెస్ మీట్ పెట్టి… తనపై కావాలని ప్రీ ప్లాన్ చేసి ఇరికించారని తెలిపారు. తనపై ఊరికే ఆరోపణలు చేయడం కాదు… విచారణ చేయించి.. తాను తప్పు చేశానని నిరూపిస్తే.. వెంటనే ముక్కు నేలకు రాస్తా అని సవాల్ విసిరారు. అయితే.. తనపై ఇలాంటి ఆరోపణలు రావడంతో… మంత్రి ఈటల తన మంత్రి పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. సీఎం కేసీఆర్ ఒక్క మంత్రి ఈటలను మాత్రమే టార్గెట్ చేయలేదట. మంత్రి ఈటలతో పాటు మరో ముగ్గురు మంత్రులను కూడా టార్గెట్ చేశారట. వాళ్లకు కూడా త్వరలో ఉద్వాసన పలకనున్నట్టు తెలుస్తోంది.
మరో ముగ్గురు మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ లకు త్వరలో జరిగే మంత్రి వర్గ విస్తరణలో ఉద్వాసన పలికే అవకాశం ఉందని… తీన్మార్ మల్లన్న తన క్యూన్యూస్ చానెల్ లో వెల్లడించారు. ముందు ఈటలకు పొగబెట్టి ఆ తర్వాత గంగుల కమలాకర్, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లను మంత్రి పదవి నుంచి తప్పిస్తారని చెబుతున్నారు. ఒక్క మల్లారెడ్డి తప్పితే.. మిగితా ముగ్గురు మంత్రులు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులను కావాలనే సీఎం కేసీఆర్ టార్గెట్ చేశారని మల్లన్న చెప్పుకొచ్చారు. ఎన్నికలు ముగియగానే.. కావాలని ముందస్తు ప్రణాళికతో ఈటలపై బాణం విసిరారని… మరో 2 ఏళ్ల వరకు ఎన్నికలు లేనందున.. సీఎం కేసీఆర్ తన పనిని మొదలు పెట్టారని అంటున్నారు. చూద్దాం మరి.. ఇంకా భవిష్యత్తులో ఏం జరుగుతుందో?
India vs West Indies T20 World Cup 2026 ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 ICC…
BABA Vanga prediction : ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ iran israel War మధ్య జరుగుతున్న భీకర యుద్ధం చూస్తుంటే…
Redmi A7 Pro : స్మార్ట్ఫోన్ మార్కెట్లో బడ్జెట్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని షావోమీ తన కొత్త మోడల్ రెడ్మి…
Third World War : ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో జరుగుతున్న దాడులు చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం ముంగిట మనం…
Balakrishna : నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఒక రేంజ్ లో స్పీడ్ పెంచారు. దాదాపు అరవై ఏళ్ల వయసులో కూడా…
US Iran War : ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇరాన్…
Ali Khamenei : ఇరాన్ దేశం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అక్కడి కఠినమైన నిబంధనలు మరియు అగ్రరాజ్యం అమెరికాతో…
New Ration Cards : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం…
Railway RRB exam dates 2026 changes : భారత రైల్వే శాఖలో పారామెడికల్ పోస్టుల భర్తీకి సంబంధించి కీలక…
New Rules for 1st March : ప్రతి నెల మాదిరిగానే మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా పలు కొత్త…
PM Kisan : దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్లకు పైగా రైతులు ప్రస్తుతం ఒకే ప్రశ్నతో ఎదురుచూస్తున్నారు. పీఎం కిసాన్ 22వ…
This website uses cookies.