
KCR
Etela Rajender : ఈటల రాజేందర్.. ప్రస్తుతం తెలంగాణలో ఈయన గురించే హాట్ టాపిక్. ఈటల రాజేందర్ తెలంగాణ ఆరోగ్య మంత్రి మాత్రమే కాదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నిఖార్సయిన నాయకుడు. మొదటి నుంచి సీఎం కేసీఆర్ వెంట ఉండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు ఈటల రాజేందర్. అందుకే… ఈటల రాజేందర్ కు తెలంగాణలో చాలా పాపులారిటీ ఉంది. అయితే… టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అయినా ఇప్పటి వరకు ఎన్నడూ ఈటల రాజేందర్ పై ఎటువంటి ఆరోపణలు రాలేదు. ఏనాడూ ఈటల అవినీతి పరుడు అన్నట్టుగా ఎటువంటి పని జరగలేదు.
etela rajender to resign for his ministry and three are in queue
కానీ.. అనూహ్యంగా కొన్ని మీడియా చానెళ్లలో ఈటల రాజేందర్ భూకబ్జా చేశారంటూ కథనాలు ప్రసారం అయ్యాయి. 100 ఎకరాలను ఈటల కబ్జా చేశారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే… ఇదంతా ఓవైపు ఉంటే.. గత కొన్ని రోజుల నుంచి మంత్రి ఈటల టీఆర్ఎస్ హైకమాండ్ తో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. ఇటీవల కూడా కేసీఆర్ తో ఈటల భేటీ అయినప్పటికీ వీళ్ల మధ్య ఏం జరిగిందనేది తెలియట్లేదు. తాజాగా కొందరు రైతులు సీఎం కేసీఆర్ కు లేఖ రాశారని తెలిసింది. ఈటల రాజేందర్ భూకబ్జా చేశారని.. తమ భూముల్లో రోడ్లు వేయిస్తున్నారని సీఎంకు రైతులు లేఖ రాయడంతో… వెంటనే విచారణకు కేసీఆర్ ఆదేశించారు. ఆ తర్వాత వెంటనే మీడియాలో ఈటల భూకబ్జా చేశారని కథనాలు ప్రసారం అయ్యాయి.
తనపై భూకబ్జా ఆరోపణలు రావడంతో వెంటనే మంత్రి ఈటల ప్రెస్ మీట్ పెట్టి… తనపై కావాలని ప్రీ ప్లాన్ చేసి ఇరికించారని తెలిపారు. తనపై ఊరికే ఆరోపణలు చేయడం కాదు… విచారణ చేయించి.. తాను తప్పు చేశానని నిరూపిస్తే.. వెంటనే ముక్కు నేలకు రాస్తా అని సవాల్ విసిరారు. అయితే.. తనపై ఇలాంటి ఆరోపణలు రావడంతో… మంత్రి ఈటల తన మంత్రి పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. సీఎం కేసీఆర్ ఒక్క మంత్రి ఈటలను మాత్రమే టార్గెట్ చేయలేదట. మంత్రి ఈటలతో పాటు మరో ముగ్గురు మంత్రులను కూడా టార్గెట్ చేశారట. వాళ్లకు కూడా త్వరలో ఉద్వాసన పలకనున్నట్టు తెలుస్తోంది.
మరో ముగ్గురు మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ లకు త్వరలో జరిగే మంత్రి వర్గ విస్తరణలో ఉద్వాసన పలికే అవకాశం ఉందని… తీన్మార్ మల్లన్న తన క్యూన్యూస్ చానెల్ లో వెల్లడించారు. ముందు ఈటలకు పొగబెట్టి ఆ తర్వాత గంగుల కమలాకర్, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లను మంత్రి పదవి నుంచి తప్పిస్తారని చెబుతున్నారు. ఒక్క మల్లారెడ్డి తప్పితే.. మిగితా ముగ్గురు మంత్రులు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులను కావాలనే సీఎం కేసీఆర్ టార్గెట్ చేశారని మల్లన్న చెప్పుకొచ్చారు. ఎన్నికలు ముగియగానే.. కావాలని ముందస్తు ప్రణాళికతో ఈటలపై బాణం విసిరారని… మరో 2 ఏళ్ల వరకు ఎన్నికలు లేనందున.. సీఎం కేసీఆర్ తన పనిని మొదలు పెట్టారని అంటున్నారు. చూద్దాం మరి.. ఇంకా భవిష్యత్తులో ఏం జరుగుతుందో?
Gold : భారతీయుల జీవితంలో బంగారం అనేది కేవలం ఒక లోహం కాదు అది సంప్రదాయం, భద్రత, భవిష్యత్తుకు సంకేతం.…
Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు…
Palapandlu : ఎండాకాలం రాగానే మార్కెట్లో కొన్ని ప్రత్యేకమైన అడవి పండ్లు ఎక్కువగా కనిపిస్తాయి. వాటిలో ముఖ్యంగా “పాల పండ్లు”…
Lemon Juice : ఎండాకాలం ప్రారంభమైతే చాలు దాహం వేధించడం మొదలవుతుంది. అలాంటి వేళలో మనకు వెంటనే గుర్తొచ్చేది చల్లని…
Coconut Water : దేశవ్యాప్తంగా ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మధ్యాహ్నం వేళ…
AP Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి. అధికారం ఎవరిది అన్న విషయంపై ఎప్పుడూ ఉత్కంఠ కొనసాగుతూనే…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన లండన్ ప్రయాణం అవుతుండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో…
Telangana BJP : తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ బలం పుంజుకోలేకపోవడానికి ప్రధాన కారణం గతంలో జరిగిన నియోజకవర్గాల…
Mahasena Rajesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకటే పేరు మారుమోగిపోతోంది. అదే మహాసేన రాజేష్. సోషల్ మీడియాలో తనదైన…
Modi : మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో వీగిపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఎన్డీఏ ప్రభుత్వం…
Viral video : తెలుగు బుల్లితెర ప్రపంచంలో ప్రేక్షకులను అలరించేందుకు ఛానెళ్లు కొత్త కాన్సెప్ట్లతో ముందుకు వస్తున్నాయి. కామెడీ, కుకింగ్,…
Dwakra Group : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి పలు సంక్షేమ పథకాలను అమలు…
This website uses cookies.