
kishan reddy
Etela Rajender : ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలన్నీ రాత్రికి రాత్రే మారిపోతున్నాయి. దానికి కారణం ఈటల రాజేందర్. ప్రస్తుతం ఈటల రాజేందర్ కార్నర్ అయిపోయారు. ఎక్కడ చూసినా ఆయన గురించే చర్చ. తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన వ్యక్తి ఆయన. దశాబ్దాల నుంచి తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ పై, టీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. భూకబ్జా ఆరోపణలతో సీఎం కేసీఆర్.. ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. దీంతో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీతో తెగదెంపులు చేసుకున్నారు.
తన ఎమ్మెల్యే పదవికి అయితే రాజీనామా చేయలేదు కానీ.. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలకు చెందిన సీనియర్ నేతలను ఈటల కలుస్తున్నారు. వాళ్లతో భేటీ అవుతున్నారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోనూ ఆయన భేటీ అయ్యారని వార్తలు వచ్చాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలతోనూ ఈటల భేటీ అయ్యారని వార్తలు వచ్చాయి. అయితే.. తనతో ఈటల ఇప్పటి వరకు భేటీ కాలేదని.. కలవాలని కబురు పంపిన మాట మాత్రం వాస్తవమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
etela rajender versus kishan reddy trs bjp telangana
మేమిద్దరం గతంలో కలిసి పనిచేశాం. ఆయన నన్ను కలవాలని అనుకుంటే దాంట్లో తప్పేంటి? ఈటలను మంత్రి వర్గం నుంచి తొలగించాక.. ఇప్పటి వరకు ఈటలను నేను కలవలేదు. భవిష్యత్తులో కలిస్తే కలవొచ్చు. ఈటల ఒకవేళ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే.. హుజూరాబాద్ లో ఉపఎన్నిక వస్తే.. అక్కడ బీజేపీ అభ్యర్థిని బరిలోకి దింపాలా? వద్దా? అనే విషయాన్ని అధిష్టానం నిర్ణయిస్తుంది. ఇంకా దానిపై పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.. అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడంతో.. తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి.
ఉపఎన్నిక వస్తే.. అభ్యర్థిని బరిలోకి దింపాలా? వద్దా? అని ఆలోచిస్తాం అని కిషన్ రెడ్డ అంటున్నారంటే… ఇక్కడ ఏదో జరుగుతోంది.. వీళ్ల మధ్య ఏదో ఉంది. ఈటల ఉపఎన్నిక బరిలో దిగితే.. ప్రతిపక్ష పార్టీలయిన కాంగ్రెస్, బీజేపీలు తమ పార్టీల అభ్యర్థులను బరిలోకి దింపొద్దని.. తాను ఇండిపెండెంట్ గా హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తానని.. దయచేసి.. ఈ ఉపఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని.. ఈటల కాంగ్రెస్, బీజేపీ నేతలను రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అందుకే.. కిషన్ రెడ్డి అలా వ్యాఖ్యానించారు అనే వార్తలు వస్తున్నాయి. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఒక్క టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అభ్యర్థిని బరిలోకి దింపితే.. తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను బరిలోకి దింపకపోతే.. గెలుపు తనదే అవుతుందని.. అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి సరైన గుణపాఠం చెప్పినట్టు అవుతుందని ఈటల ఆయా పార్టీలతో ఒప్పందం చేసుకున్నారని తెలుస్తుంది. మరి.. అది నిజమా? అబద్ధమా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…
Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…
Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…
Maruti Mini Brezza 2026 Review : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి Maruti Suzuki మరోసారి మార్కెట్లో…
Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…
This website uses cookies.