fans are waiting for mega multistarer movie
Mega Family : మెగా మనం ఎప్పుడు..ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ..అంటూ గత కొన్నేళ్ళుగా మెగా అభిమానులే కాదు కామన్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. అంతక ముందు మల్టీస్టారర్ సినిమాల మాదిరిగా మెగా హీరోలు ఏ ఇద్దరు కలిసి నటించినా చూసేందుకు ఎంతో ఆతృతగా ఉన్న అభిమానులు అక్కినేని ఫ్యామిలీ కలిసి నటించిన మనం సినిమా తర్వాత మాత్రం మెగా హీరోలందరు కలిసి ఆ తరహా సినిమా చేస్తే చూడాలని ఆతృతగా ఉన్నారు. దర్శకుడు విక్రమ్ కె కుమార్ అక్కినేని నాగేశ్వర రావు, ఆయన తనయుడు నాగార్జున, మనవళ్ళు నాగ చైతన్య, అఖిల్లతో మనం సినిమా చేసిపెట్టు జీవితాంతం నిలిచిపోయేలా మంచి బహుమతి ని ఇచ్చాడు.
ఈ విషయంలో అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఆయనకు ఎంతో రుణపడి ఉంటామని పలు సందర్భాలలో నాగార్జున స్వయంగా చెప్పుకొచ్చారు. ఇక ఇది ఏఎన్ఆర్ ఆఖరి సినిమా కావడం విశేషం. ఎన్నేళ్ళ తర్వాత చూసుకున్నా అక్కినేని ఫ్యామిలికి ఇది ఒక మరపురాణి తీపి జ్ఞాపకంగా అనిపిస్తుందనడంలో అస్సలు సందేహాలు అవసరం లేదు. అందుకే, అంతకంటే ఎక్కువ మంది హీరోలున్న మెగా ఫ్యామిలీ నుంచి కూడా అభిమానులతో పాటు అందరూ అలాంటి సినిమా కావాలని కోరుకుంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే మెగాస్టార్ తలుచుకుంటే ఇదేమీ అంత పెద్ద విషయం కాదు.
fans are waiting for mega multistarer movie
ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే రాజమౌళి లాంటి అగ్ర దర్శకులు సినిమా తీయడానికి రెడీ అవుతారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వారు కథ తయారీకి సిద్ధమవుతారు. సాయి మాధవ్ బుర్రా వంటి వారు అద్భుతమైన సంభాషణలు ఇవ్వడానికి ఉత్సాహంగా ఉంటారు. ఇక ఎంత బడ్జెట్ అయినా లెక్క చేయకుండా సినిమా నిర్మించడానికి అల్లు అరవింద్ దగ్గర్నుంచి చరణ్, పవన్ కళ్యాణ్, నాగబాబులకు ఉన్న సొంత నిర్మాణలే సంస్థలే చాలా ఎక్కువ. ఇలా ప్రతీ ఒక్కరు మెగా మనం ప్లాన్ చేస్తే ఆ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేస్తారనడంలో సందేహాలు ఉండవు. మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, నాగబాబు, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్..నిహారిక..ఇలా ఈ మెగా మనం లో నటించడానికి స్క్రీన్ స్పేస్ ఉంది. కానీ, అంత గొప్ప కథ సెట్ అవడమే కావాలి. మరి ఇది ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందో గానీ.. ప్రతీ ఒక్కరిలోనూ మెగా ఫ్యామిలీ హీరోలందరూ కలిసి నటించే సినిమా కోసం చాలా ఏళ్ళుగా ఎదురుచూస్తున్నారు.
Esha Gupta : బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్ అయ్యింది. గతంలో టీమిండియా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…
Manchu Vishnu : టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…
రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…
Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…
RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…
Wife : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…
Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…
This website uses cookies.