Rohit Sharma Virat Kohli : టీమిండియా 17 ఏళ్ల కల ఎట్టకేలకి నెరవేరింది. 2007లో టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న టీమిండియా ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత కప్ గెలుచుకుంది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 7 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ విజయం సాధించిన ఆనందంతో పాటు టీ20 ఇంటర్నేషనల్కు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులకు 440 వోల్ట్ల షాక్ ఇచ్చారు విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ. ఇప్పుడు ఈ ఇద్దరు దిగ్గజాలు భారత్ తరపున ఏ టీ20 మ్యాచ్ ఆడరు. ఇటువంటి పరిస్థితిలో, విరాట్, రోహిత్ తదుపరి మ్యాచ్ ఎప్పుడు ఆడతారు అనే ప్రశ్న చాలా మంది అభిమానుల మనస్సులో ఉంటుంది.విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ 20లకి రిటైర్మెంట్ ప్రకటించడంతో వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో ఆడుతున్నప్పుడు అభిమానులను అలరిస్తారని తెలిసిందే. ఈ నెలలో భారత జట్టు శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది.
రెండు దేశాల మధ్య 3 వన్డే మ్యాచ్ల అనధికారిక సిరీస్ జరగనుంది. విరాట్, రోహిత్ లాంటి అనుభవజ్ఞులైన వెటరన్లు ఈ సిరీస్లో జట్టులోకి తీసుకోరని, యువ ఆటగాళ్లకే బీసీసీఐ అవకాశం ఇస్తుందని అంటున్నారు. ఇక సెప్టెంబర్లో భారత జట్టు బంగ్లాదేశ్లో పర్యటించనుంది. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్లో 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ సెప్టెంబర్ 19 నుంచి జరగనుంది. ఈ సిరీస్ ద్వారా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మరోసారి జట్టులోకి చేరుకోనున్నారు. టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్కు చేరుకోవాలనే తన వాదనను బలోపేతం చేయడానికి, ఈ రెండు మ్యాచ్లను గెలవాలనే ఉద్దేశంతో టీమిండియా తరపున రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లని బరిలోకి దింపబోతున్నట్టు తెలుస్తుంది.జులై నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు టీమిండియా 17 మ్యాచ్లు (8 టీ20, 9 టెస్టులు) ఆడనుండడం గమనార్హం. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీమిండియా కష్టాల్లో పడింది.
బార్బడోస్లో తుఫాన్ బీభత్సం చేస్తోంది. దీని కారణంగా టీమిండియాలోని ప్రతి సభ్యుడు ఇప్పటికీ అక్కడే చిక్కుకుపోయారు. బార్బడోస్లో తుఫాన్ కారణంగా, విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోయింది. విమానాశ్రయాలు కూడా మూసివేశారు. ఎయిర్పోర్టు ఎప్పుడు తెరుచుకుంటుంది అనేది ఇంకా ఎవరికీ తెలియదు. అయితే ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ తన జట్టును ఈ తుఫాన్ నుంచి బయటపడేసేందుకు ప్లాన్ వేసింది. ఛార్టర్డ్ ఫ్లైట్ ద్వారా టీమ్ ఇండియాను భారత్కు రప్పించేందుకు జై షా ప్లాన్ చేసినట్లు సమాచారం.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.