Categories: News

Dallas : డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద “గాంధీ శాంతి నడక – 2024”

Advertisement
Advertisement

Dallas : డాలస్, టెక్సాస్: ఇర్వింగ్ నగరంలో మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద  ఐఎఎన్టి నిర్వహణలో “గాంధీ శాంతి నడక – 2024”  పేరిట ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో వందలాది ప్రవాసభారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఐఎఎన్టి అధ్యక్షులు రాజీవ్ కామత్, మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎం.జి.ఎం.ఎన్.టి) కార్యదర్శి రావు కల్వాల అతిథులకు స్వాగతం పలికారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మహాత్మాగాంధీ స్మారకస్థలి నిర్మాణంలో సహకరించిన తోటి కార్యవర్గ సభ్యులకు, ప్రజలకు, సంస్థలకు, దాతలకు, ఇర్వింగ్ నగర అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఇర్వింగ్ నగరమేయర్ రిక్ స్టాఫర్ మాట్లాడుతూ “నేను ఎక్కడకు వెళ్ళినా, విదేశాలలో సైతం మీది మహత్మాగాంధీ విగ్రహం నెలకొనియున్న ఇర్వింగ్ నగరమేనా అని అడుగుతున్నప్పుడు ఆశ్చర్యంతోపాటు గర్వం కలుగుతోందన్నారు. కేవలం మహత్మాగాంధీ విగ్రహ నిర్మాణమేగాక, ఈ 18 ఎకరాల సువిశాలమైన పార్క్ సుందరీకరణలో కూడా భాగమైన ఎం.జి.ఎం. ఎన్.టి నాయకత్వానికి, ప్రజలకు ధన్యవాదాలు అన్నారు.”

Advertisement

హ్యుస్టన్ నగరంనుంచి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కాన్సుల్ జెనరల్ ఆఫ్ ఇండియా డి.సి మంజునాథ్ మాట్లాడుతూ “మహాత్మాగాంధీ ఆలోచనలు, ఆశయాలు సర్వత్రా అన్నివేళలా సజీవంగా ఉంటాయి. శాంతి, సౌభ్రాతృత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహత్మాగాంధీ విగ్రహాన్ని ఇర్వింగ్ నగరంలో స్థాపించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అందరికీ హృదయపూర్వక అభినందనలు” అన్నారు. ఈ వేడుకలలో ప్రత్యేకఅతిథులుగా హాజరైన – ఈ మహత్మాగాంధీ విగ్రహశిల్పి బుర్రా శివ వరప్రసాద్ విజయవాడనుండి, ప్రముఖ చిత్రకారుడు జిగర్ సోని గుజరాత్ నుండి, కాపెల్ సిటీ కౌన్సిల్ మెంబర్ల గా ఎన్నికైన భారత సంతతికి చెందిన బిజు మాత్యు, రమేశ్ ప్రేమ్ కుమార్ లను, గాంధీ మెమోరియల్ గవర్నెన్స్ బోర్డు సభ్యులు రాజేంద్ర వంకావాల, రాంకీ చేబ్రోలు, వినోద్ ఉప్పు, లోకేష్ నాయుడులను డా. ప్రసాద్ తోటకూర, ముఖ్య అతిథులు, కార్యవర్గ సభ్యులు అందరూ కలసి ఘనంగా సన్మానించారు.

Advertisement

Dallas : డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద “గాంధీ శాంతి నడక – 2024”

దశమ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దాతలపేర్లతో కూడిన శిలాఫలకాన్ని కాన్సుల్ జెనరల్ ఆఫ్ ఇండియా డి. సి మంజునాథ్ ఆవిష్కరించారు. “గాంధీ శాంతి నడక – 2024” ను ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టాఫర్ ప్రారంభించే ముందు శాంతికి సంకేతంగా 10 తెల్లటి పావురాలను అందరి హర్ష ధ్వానాలు, కేరింతలమధ్య గాలిలోకి విడుదలజేశారు. నడక పూర్తయిన తర్వాత, మహాత్మాగాంధీ విగ్రహానికి అందరూ పుష్పాంజలి ఘటించి అల్పాహారం ఆరగించి, ఫోటోలు తీసుకుంటూ ఆనందంగా గడిపారు.

ఈనాడు దినపత్రిక (ఆంధ్రప్రదేశ్, న్యూ ఢిల్లీ, కర్ణాటక) సంపాదకులు ఎం. నాగేశ్వరరావు మహాత్మాగాంధీ స్మారక స్థలిని సందర్శించి చాలా అద్భుతంగా ఉందని మెచ్చుకుంటూ ఈ విగ్రహనిర్మాణ సాకారంలో అవిరళ కృషిచేసి సాధించిన వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, కార్యదర్శి రావు కల్వాల, కార్యవర్గ సభ్యులందరినీ ప్రశంసిస్తూ ఇది ప్రవాసభారతీయులు ఐకమత్యానికి చిహ్నం అన్నారు. ప్రవాస భారతీయుడుగాఉన్న గాంధీ దక్షిణఆఫ్రికా దేశంనుండి మాతృదేశానికి తిరిగివచ్చి భారతదేశపు స్వాతంత్ర్య సముపార్జనలో దశాబ్దాలగా సాగించిన శాంతియుత పోరాటం చరిత్ర మరువలేని సత్యం అన్నారు.

అమెరికాపర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్.ఆర్.ఐ సాధికారత, సంబంధాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ వారి పర్యటనలో భాగంగాఉన్న ప్రవాస తెలుగుదేశంపార్టీ నాయకులు జయరాం కోమటి, సతీష్ వేమన, సినీ నిర్మాత ఎం.ఎల్ కుమార్ చౌదరి, ప్రముఖ వ్యాపారవేత్త రాం గుళ్ళపల్లి,  మహాత్మాగాంధీ స్మారకస్థలిని సందర్శించి పుష్పాంజలి ఘటించారు.

Dallas : డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద “గాంధీ శాంతి నడక – 2024”

ఈ వేడుకలలో – ఎం.జి.ఎం.ఎన్.టి వవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, బోర్డ్ సభ్యులు రావు కల్వాల, మురళి వెన్నం, రాజీవ్ కామత్, కమల్ కౌశల్, బి.ఎన్ రావు, షబ్నం మాడ్గిల్, కుంతేష్, గాంధీ మెమోరియల్ గవర్నెన్స్ బోర్డ్ సభ్యులు రాంకీ చేబ్రోలు, రాజేంద్ర వంకావాల, వినోద్ ఉప్పు, లోకేష్ నాయుడు వివిధ సంఘాల ప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు.

Advertisement

Recent Posts

Husband : లంచ‌గొండి భార్య‌ని రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టించిన భ‌ర్త‌…!

Husband : ఈ మ‌ధ్య లంచ‌గొండిల భ‌ర‌తం ప‌డుతున్నారు పోలీసులు. ప‌క్కా స‌మాచారంతో రైడ్ చేయ‌డంతో ల‌క్ష‌లు, కోట్లు కూడా…

50 mins ago

Ratan Tata : దాతృత్వానికి మ‌రో రూపం ర‌త‌న్ టాటా.. ఆయ‌న ప‌ట్టింద‌ల్లా బంగార‌మే..!

Ratan Tata : ర‌త‌న్ టాటా మంచి విజ‌న్ ఉన్న వ్యాపార వేత్త‌. రతన్ టాటా అనేక విజయాలకు కేరాఫ్…

2 hours ago

Zodiac Signs : బుధ సంచారం కారణంగా ఈ రాశుల వారికి ధన నష్టం… ఈ పరిహారాలు తప్పక పాట్టించండి…!

Zodiac Signs : అక్టోబర్ 10వ తేదీ ఉదయం 11:09 నిమిషాలకు బుధుడు తులా రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇక…

3 hours ago

Ratan Tata : దిగ్గ‌జ పారిశ్రామిక వేత్త ర‌త‌న్ టాటా క‌న్నుమూత‌.. ఆయ‌న నికర ఆస్తి విలువ ఎంతో తెలుసా?

Ratan Tata : ప్రముఖ వ్యాపారవేత్త, టాటా గ్రూప్ ఛైర్మన్‌ రతన్‌ టాటా (86) వ‌యోభారంతో క‌న్నుమూసారు. కొద్ది రోజులుగా…

4 hours ago

Ink Stains : డ్రస్సులపై పడ్డ ఇంకు మరకలను ఎలా వదిలించుకోవాలో అర్థం కావట్లేదా… ఈ చిట్కాలు పాటించండి…!

Ink Stains : పిల్లలు స్కూల్ కి వెళ్లారంటే చాలు వాళ్ళ డ్రస్ ల మీద ఎన్నో మరకలు పడుతూ…

5 hours ago

Flowers In Hair : ఆడవాళ్లు తలలో పూలు పెట్టుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా… తప్పక తెలుసుకోండి…!

Flowers In Hair : సహజంగానే అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. ఇక వారి అందానికి తలలో పూలు పెడితే…

6 hours ago

Tea Powder : టీ తాగినాక టీ పొడిని పారేస్తున్నారా… దీనిలో బోలెడు లాభాలు ఉన్నాయి తెలుసా…!

Tea Powder : ప్రస్తుత కాలంలో చాలా మందికి టీ తాగనిదే రోజు మొదలవదు. ప్రతి ఒక్కరి ఇంట్లో అందరూ…

7 hours ago

Crow Shouts : ఇంటి ముఖ ద్వారం వద్ద కాకి అరిస్తే ఏం జరుగుతుంది… ఇది దేనికి సంకేతం…!

Crow Shouts : మన దేశం యొక్క సంస్కృతిలో జంతువులు మరియు పక్షులతో మనుషులకు సంబంధం అనేది ఉంటుంది. వాటి యొక్క…

8 hours ago

This website uses cookies.