Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. రేపే మీ ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు
Rythu Bharosa : తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్తను అందించింది. రైతులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవాలనే ఉద్దేశంతో, రైతు భరోసా పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం భారీ సన్నాహాలు చేసింది. గతేడాది తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా చూసేందుకు ఈసారి ఏకంగా రూ.10 వేల కోట్ల నిధులను సిద్ధం చేసింది. ఇవాళ ఆదివారం కావడంతో నిధుల విడుదల జరగనప్పటికీ, సోమవారం నుంచే రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేయనున్నట్టు సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా 1.30 కోట్ల ఎకరాల్లో సాగు జరుగుతున్న నేపథ్యంలో రైతులకు ఒక్కో ఎకరానికి రూ.6,000 చొప్పున ప్రభుత్వం నేరుగా డబ్బులు పంపించనుంది. ముందుగా నాలుగు ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకు డబ్బులు జమ చేయనున్నారు. అంటే గరిష్టంగా ఒక్క రైతుకు రూ.24,000 వరకు లభించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం రైతులతో ప్రత్యక్షంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని 1500 రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అదే సమయంలో నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభం కానుంది.
Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. రేపే మీ ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు
గతంలో నాలుగు ఎకరాల లోపు రైతులకు తొలి విడతగా నిధులు విడుదల చేయగా, ఈసారి కూడా అదే విధానాన్ని అనుసరించే అవకాశం ఉంది. అలాగే, కొత్తగా పాస్బుక్ తీసుకున్న రైతులను కూడా లబ్దిదారుల జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకున్నారు. ఇప్పటివరకు రైతులకు అందుతున్న సమాచారం ప్రకారం, సోమవారం నాటికి డబ్బులు ఖాతాల్లోకి చేరే అవకాశం ఉంది. ఈ నిధులతో రైతులు వానాకాలం పంటల సాగుకు అవసరమైన ఖర్చులు చేసుకునేందుకు సహాయపడుతుంది. రైతులపై ఆర్థిక భారం తగ్గిస్తూ వ్యవసాయం అభివృద్ధి దిశగా సాగిపోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
This website uses cookies.