Navodaya School : నవోదయ స్కూల్లో పిల్లలను చదివించాలని అనుకుంటున్నారా.. అయితే మీకు గుడ్ న్యూస్
Navodaya School : ఏలూరు జిల్లా, పెదవేగి మండలంలోని జవహర్ నవోదయ విద్యాలయం (JNV)లో 2026–27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి శ్రీమతి ఎం. వెంకటలక్ష్మమ్మ వెల్లడించారు. దరఖాస్తు చేసుకునే గడువు జూలై 29, 2025 వరకు కొనసాగనుంది. అభ్యర్థులకు డిసెంబర్ 13, 2025న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఎంపీవోలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సమగ్ర సమాచారం అందించాలని డీఈవో సూచించారు.
నవోదయ విద్యాలయాల సమితి భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే స్వతంత్ర సంస్థగా పనిచేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ గల విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన రెసిడెన్షియల్ విద్యను అందించేందుకు ఈ పాఠశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రవేశం పూర్తిగా ప్రతిభాపరంగా ఉంటుంది. విద్యార్థుల ఆర్థిక స్థితిని పరిగణనలోకి తీసుకోకుండా, వారి విజ్ఞాన సామర్థ్యానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం నవోదయల ప్రత్యేకత. ఏడేళ్ల పాటు పూర్తిగా ఉచిత విద్య, వసతి, భోజనం, విద్యాసామగ్రి లభిస్తాయి.
Navodaya School : నవోదయ స్కూల్లో పిల్లలను చదివించాలని అనుకుంటున్నారా.. అయితే మీకు గుడ్ న్యూస్
నవోదయ విద్యాలయాల్లో విద్యనభ్యసించడం వల్ల విద్యార్థులకు ఉత్తమమైన విద్యా వాతావరణం, వ్యక్తిత్వ వికాసం, ప్రతిభను మెరుగుపరచే అవకాశాలు లభిస్తాయి. సివిల్ సర్వీసెస్, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు ఇది బలమైన పునాది అవుతుంది. గ్రామీణ విద్యార్థులు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ https://navodaya.gov.in ను సందర్శించవచ్చు లేదా సమీప ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సంప్రదించవచ్చు.
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
This website uses cookies.