Great Women : ఒక్క రూపాయికే దోశ.. ఎక్కడంటే? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Great Women : ఒక్క రూపాయికే దోశ.. ఎక్కడంటే?

Great Women : ప్రస్తుతం రూ.500 నోటు పట్టుకుని మార్కెట్ కు వెళ్తే మనం కొనుక్కుని ఇంటికి తీసుకొచ్చే సరుకులు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. అనగా మార్కెట్ లో నిత్యావసరాల ధరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దాంతో సామన్యుడు ఇబ్బందులు పడుతున్నాడు. కడుపు ఎలా నింపుకోవాలో అని ఆలోచిస్తున్నాడు. ఇటువంటి తరుణంలో ఓ తల్లి ఒక్క రూపాయికే టిఫన్ పెడుతోంది. ఎక్కడంటే.. ఏపీలోని అనంతపురం డిస్ట్రిక్ట్ తాడిపత్రి కాల్వగడ్డ వీధిలో సావిత్రమ్మ అనే వృద్ధురాలు ఒక్క రూపాయికే దోశ […]

 Authored By praveen | The Telugu News | Updated on :23 January 2022,2:00 pm

Great Women : ప్రస్తుతం రూ.500 నోటు పట్టుకుని మార్కెట్ కు వెళ్తే మనం కొనుక్కుని ఇంటికి తీసుకొచ్చే సరుకులు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. అనగా మార్కెట్ లో నిత్యావసరాల ధరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దాంతో సామన్యుడు ఇబ్బందులు పడుతున్నాడు. కడుపు ఎలా నింపుకోవాలో అని ఆలోచిస్తున్నాడు. ఇటువంటి తరుణంలో ఓ తల్లి ఒక్క రూపాయికే టిఫన్ పెడుతోంది. ఎక్కడంటే..

ఏపీలోని అనంతపురం డిస్ట్రిక్ట్ తాడిపత్రి కాల్వగడ్డ వీధిలో సావిత్రమ్మ అనే వృద్ధురాలు ఒక్క రూపాయికే దోశ విక్రయిస్తోంది. అలా అతి తక్కువ ధరకే టిఫిన్ అందిస్తూ జనం ఆకలి తీరుస్తోంది. స్థానికంగా ఉండే ప్రజానీకం ఈమె టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చి దోశ తిని తమ ఆకలి తీర్చుకుంటున్నారు. అలా స్థానికంగా సావిత్రమ్మ బాగా ఫేమస్ అయింది కూడా.ఇకపోతే ఈ విషయం సోషల్ మీడియాలో ప్రచారం..

great women supplying dosha for one rupee only

great women supplying dosha for one rupee only

Great Women : శభాష్.. సావిత్రమ్మ..

జరగగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దృష్టికి వెళ్లింది. దాంతో ఆయన ట్విట్టర్ వేదికగా సావిత్రమ్మను అభినందిస్తూ ట్వీట్ చేశాడు. శభాష్..సావిత్రమ్మ అని పొగిడాడు. ఈ క్రమంలోనే ప్రజల ఆకలి తీరుస్తున్న సావిత్రమ్మను త్వరలో కలుస్తానని, సావిత్రమ్మకు ఏ అవసరం వచ్చినా వైసీపీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.

Also read

Tags :

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది