Ind Vs Aus : ఆసీస్ గడ్డపై ఆధిపత్యం చూపిస్తున్న భారత్.. 20 ఏళ్ల తర్వాత తొలి సెంచరీ భాగస్వామ్యం
Ind Vs Aus 1st Test Match : పెర్త్ వేదికగా భారత్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు 150 పరుగులకి ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా 51.2 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా (5/30) అయిదు వికెట్లతో విజృంభించగా, ఆయనకి తోడుగా హర్షిత్ రాణా (3/48) మూడు, మహ్మద్ సిరాజ్ (2/20) రెండు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాని చాలా ఇబ్బంది పెట్టారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో మిచెల్ స్టార్క్ (26; 112 బంతుల్లో, 2 ఫోర్లు) టాప్ స్కోరర్.స్టార్క్ మినహా అలెక్స్ కేరీ (21; 31 బంతుల్లో, 3 ఫోర్లు), ట్రావిస్ హెడ్ (11; 13 బంతుల్లో, 2 ఫోర్లు), మెక్స్వీని (10; 13 బంతుల్లో, 2 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు.
Ind Vs Aus : ఆసీస్ గడ్డపై ఆధిపత్యం చూపిస్తున్న భారత్.. 20 ఏళ్ల తర్వాత తొలి సెంచరీ భాగస్వామ్యం
తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు 46 పరుగలు ఆధిక్యం లభించింది. అయితే 67/7 ఓవర్నైట్ స్కోరుతో శనివారం ఆట ఆరంభించిన ఆస్ట్రేలియా 100 పరుగుల మార్క్ను అందుకుందంటే అది స్టార్క్ పోరాటంతోనే. రెండో రోజు ఆటలో బుమ్రా తన తొలి బంతికే అలెక్స్ కేరీని పెవిలియన్కు చేర్చాడు బుమ్రా. ఆ తర్వాత వికెట్స్ వెంటవెంటనే పడగా, చిరవలో స్టార్క్-హేజిల్వుడ్ కలిసి ఏకంగా 110 బంతులు ఎదుర్కొన్నారు.ఇక రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తున్న భారత్ ధీటుగా ఆడతుంది. తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన జైస్వాల్ రెండో ఇన్నింగ్స్లో 60 నాటౌట్గా ఉన్నారు.
ఇక కేఎల్ రాహుల్ వివాదాస్పద డీఆర్ఎస్ తో తన వికెట్ను కోల్పోయాడు. 26 పరుగులు చేసి వెనుదిరగాల్సి వచ్చింది. తొలి ఇన్నింగ్స్లో విఫలమైన ఈ ఇద్దరు రెండోవ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా బౌలర్లకు ఏమాత్రం భయపడుకుండా ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లారు. టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ 229 బంతుల్లోనే ఈ ఘనత సాధించారు. డౌన్అండర్లో తొలి వికెట్కు 100 పరుగుల మార్కును దాటిన ఆరో భారత జోడీగా వీరు రికార్డు సృష్టించారు. యశస్వి జైస్వాల్ తన అర్ధ సెంచరీని సాధించగా, ఆరంభం నుంచి క్రీజులో ఎంతో సౌకర్యవంతంగా కనిపించిన రాహుల్ 4 ఫోర్లు బాది 50 పరుగులు చేశాడు
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
This website uses cookies.