Trump Tariffs India : ట్రంప్ సర్కార్ కు జైశంకర్ కౌంటర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Trump Tariffs India : ట్రంప్ సర్కార్ కు జైశంకర్ కౌంటర్

 Authored By sudheer | The Telugu News | Updated on :23 August 2025,8:00 pm

Jaishankar counter to Trump government : భారత్‌పై టారిఫ్‌లు విధిస్తున్న అమెరికా, యూరప్‌లపై కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్‌. జైశంకర్ కౌంటర్ ఇచ్చారు. ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరమ్ 2025లో మాట్లాడిన ఆయన, “ఎవరూ బలవంతం చేయడం లేదు. భారత్‌ నుంచి ఆయిల్ లేదా రిఫైన్డ్ ప్రోడక్ట్స్ కొనాలనుకుంటే కొనండి, లేకుంటే వద్దు. యూరప్ కొనుగోలు చేస్తోంది, అమెరికా కూడా కొనుగోలు చేస్తోంది. ఇష్టం లేకపోతే కొనొద్దు” అని వ్యాఖ్యానించారు. ప్రో-బిజినెస్ అని చెప్పుకునే అమెరికా ప్రభుత్వం వ్యాపారంపై ఆరోపణలు చేయడం విడ్డూరమని జైశంకర్ తెలిపారు.

Jaishankar counter to Trump government

Jaishankar counter to Trump government


అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం చేశానన్న వ్యాఖ్యలపై కూడా జైశంకర్ స్పందించారు. భారత్‌ పొరుగు దేశం విషయంలో ఎలాంటి మధ్యవర్తిత్వాన్ని అంగీకరించదని ఆయన స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలు, వ్యూహాత్మక స్వావలంబన వంటి అంశాల్లో ప్రభుత్వం స్పష్టమైన ధోరణి కలిగి ఉందని ఆయన తెలిపారు. “మేము మా జాతీయ ప్రయోజనాలను రక్షించేందుకు కట్టుబడి ఉంటాం. ఎవరికైనా అభ్యంతరం ఉంటే, రైతుల ప్రయోజనాలను కాపాడబోమని ప్రజలకు చెప్పాలి” అని జైశంకర్ అన్నారు.

ప్రస్తుతం భారత్‌, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. ట్రంప్ ప్రభుత్వం భారత ఉత్పత్తులపై 50 శాతం టారిఫ్‌లు విధించగా, రష్యా నుంచి భారత్ పెంచుకున్న ఆయిల్ కొనుగోళ్లకు అదనంగా 25 శాతం శిక్షా టారిఫ్‌లు పెట్టారు. కానీ రష్యా ఆయిల్ అత్యధికంగా కొనుగోలు చేస్తున్న చైనాపై మాత్రం ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం భారత్‌ను నిరాశపరిచింది. ఈ నిర్ణయాన్ని అసమంజసం, అన్యాయం, అంగీకారయోగ్యం కానిదిగా భారత్ ఖండించింది. ఇదే సమయంలో అమెరికా వాణిజ్య ప్రతినిధుల ఢిల్లీ పర్యటనను రద్దు చేయడం, రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచింది.

Tags :

    sudheer

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది