
Kodali Nani Comments on Viveka Case
Kodali Nani : సీబీఐ అనే దర్యాప్తు సంస్థతో సీఎం జగన్ ని టార్చర్ పెట్టడానికి చంద్రబాబు అండ్ కో ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇటీవల మీడియా సమావేశంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో సంచలనం రేపుతున్నాయి. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కు సంబంధించి ఇటీవల సీబీఐ దర్యాప్తు సంస్థ కీలక వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న కామెంట్లను ఖండిస్తూ కొడాలి నాని గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో పాదయాత్రలో లోకేష్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. సీబీఐ చెప్పక ముందే 40 కోట్ల డీల్ సెట్ అయినట్లు లోకేష్ ఎలా కామెంట్లు చేశారని ప్రశ్నించారు. జగన్ ని గ్రూప్ లో పెట్టుకోవడానికి పిచ్చి ప్రయత్నాలు చేస్తే అవి ఫలించవు.
Kodali Nani Comments on Viveka Case
ఏదేమైనా దేశంలో కోర్టులు చట్టాలు ఉన్నాయి. ఎవరో కూడా ఎవరిని అన్యాయంగా ఇరికించలేరు. జగన్మోహన్ రెడ్డి మీ చేతిలో కీలుబొమ్మగా మారాలని మీరు భావిస్తే… అది రివర్స్ ఎటాక్ కావటం తప్పదు. సీబీఐ… కేంద్రం చేతిలో కీలుబొమ్మ, మోడీ ఏది చెప్పితే ఆ సంస్థ ఆ రీతిగా నడుస్తుంది. కాబట్టి సీబీఐనీ తాను బ్యాన్ చేస్తున్నట్లు అప్పట్లో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ప్రకటించడం అందరికీ తెలిసిందే. మరలాంటప్పుడు ఇప్పుడు సీబీఐ పేరు ప్రస్తావిస్తూ చంద్రబాబు ఎలా వ్యాఖ్యలు చేస్తారని కొడాలి నాని ప్రశ్నించారు. సీబీఐలో చాలామంది చంద్రబాబు మనుషులు ఉన్నారు. ఆ సంస్థ విచారణ జరిపే కేసులకు సంబంధించి ముందుగానే లీకులు
వస్తున్నాయి అని అప్పట్లో కేంద్రంలో ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి సీబీఐలు… చంద్రబాబును పచ్చపత్రికలు రాసే రాతలు… ఎవరిని ఏమీ చేయలేవని కొడాలి నాని తెలిపారు. కన్నా లక్ష్మీనారాయణ పనికిరాడు అని చెప్పి బిజెపి పక్కన పెట్టింది. ఇప్పుడు వెళ్లి అతను టిడిపిలో జాయిన్ అయ్యాడు. వయసులో ఉన్న సమయంలో మొత్తం బలమంతా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగించాడు. ఇప్పుడు వృద్ధాప్యానికి వచ్చాడు.. బిజెపి పక్కన పెట్టేసింది.. దీంతో కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం లో జాయిన్ అయినట్లు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొడాలి నాని తెలిపారు.
T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…
Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…
Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…
Maruti Mini Brezza 2026 Review : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి Maruti Suzuki మరోసారి మార్కెట్లో…
Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…
This website uses cookies.