Kodali Nani : సీబీఐ అనే దర్యాప్తు సంస్థతో సీఎం జగన్ ని టార్చర్ పెట్టడానికి చంద్రబాబు అండ్ కో ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇటీవల మీడియా సమావేశంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో సంచలనం రేపుతున్నాయి. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కు సంబంధించి ఇటీవల సీబీఐ దర్యాప్తు సంస్థ కీలక వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న కామెంట్లను ఖండిస్తూ కొడాలి నాని గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో పాదయాత్రలో లోకేష్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. సీబీఐ చెప్పక ముందే 40 కోట్ల డీల్ సెట్ అయినట్లు లోకేష్ ఎలా కామెంట్లు చేశారని ప్రశ్నించారు. జగన్ ని గ్రూప్ లో పెట్టుకోవడానికి పిచ్చి ప్రయత్నాలు చేస్తే అవి ఫలించవు.
ఏదేమైనా దేశంలో కోర్టులు చట్టాలు ఉన్నాయి. ఎవరో కూడా ఎవరిని అన్యాయంగా ఇరికించలేరు. జగన్మోహన్ రెడ్డి మీ చేతిలో కీలుబొమ్మగా మారాలని మీరు భావిస్తే… అది రివర్స్ ఎటాక్ కావటం తప్పదు. సీబీఐ… కేంద్రం చేతిలో కీలుబొమ్మ, మోడీ ఏది చెప్పితే ఆ సంస్థ ఆ రీతిగా నడుస్తుంది. కాబట్టి సీబీఐనీ తాను బ్యాన్ చేస్తున్నట్లు అప్పట్లో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ప్రకటించడం అందరికీ తెలిసిందే. మరలాంటప్పుడు ఇప్పుడు సీబీఐ పేరు ప్రస్తావిస్తూ చంద్రబాబు ఎలా వ్యాఖ్యలు చేస్తారని కొడాలి నాని ప్రశ్నించారు. సీబీఐలో చాలామంది చంద్రబాబు మనుషులు ఉన్నారు. ఆ సంస్థ విచారణ జరిపే కేసులకు సంబంధించి ముందుగానే లీకులు
వస్తున్నాయి అని అప్పట్లో కేంద్రంలో ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి సీబీఐలు… చంద్రబాబును పచ్చపత్రికలు రాసే రాతలు… ఎవరిని ఏమీ చేయలేవని కొడాలి నాని తెలిపారు. కన్నా లక్ష్మీనారాయణ పనికిరాడు అని చెప్పి బిజెపి పక్కన పెట్టింది. ఇప్పుడు వెళ్లి అతను టిడిపిలో జాయిన్ అయ్యాడు. వయసులో ఉన్న సమయంలో మొత్తం బలమంతా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగించాడు. ఇప్పుడు వృద్ధాప్యానికి వచ్చాడు.. బిజెపి పక్కన పెట్టేసింది.. దీంతో కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం లో జాయిన్ అయినట్లు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొడాలి నాని తెలిపారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.