Kodali Nani Comments on Viveka Case
Kodali Nani : సీబీఐ అనే దర్యాప్తు సంస్థతో సీఎం జగన్ ని టార్చర్ పెట్టడానికి చంద్రబాబు అండ్ కో ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇటీవల మీడియా సమావేశంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో సంచలనం రేపుతున్నాయి. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కు సంబంధించి ఇటీవల సీబీఐ దర్యాప్తు సంస్థ కీలక వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న కామెంట్లను ఖండిస్తూ కొడాలి నాని గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో పాదయాత్రలో లోకేష్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. సీబీఐ చెప్పక ముందే 40 కోట్ల డీల్ సెట్ అయినట్లు లోకేష్ ఎలా కామెంట్లు చేశారని ప్రశ్నించారు. జగన్ ని గ్రూప్ లో పెట్టుకోవడానికి పిచ్చి ప్రయత్నాలు చేస్తే అవి ఫలించవు.
Kodali Nani Comments on Viveka Case
ఏదేమైనా దేశంలో కోర్టులు చట్టాలు ఉన్నాయి. ఎవరో కూడా ఎవరిని అన్యాయంగా ఇరికించలేరు. జగన్మోహన్ రెడ్డి మీ చేతిలో కీలుబొమ్మగా మారాలని మీరు భావిస్తే… అది రివర్స్ ఎటాక్ కావటం తప్పదు. సీబీఐ… కేంద్రం చేతిలో కీలుబొమ్మ, మోడీ ఏది చెప్పితే ఆ సంస్థ ఆ రీతిగా నడుస్తుంది. కాబట్టి సీబీఐనీ తాను బ్యాన్ చేస్తున్నట్లు అప్పట్లో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ప్రకటించడం అందరికీ తెలిసిందే. మరలాంటప్పుడు ఇప్పుడు సీబీఐ పేరు ప్రస్తావిస్తూ చంద్రబాబు ఎలా వ్యాఖ్యలు చేస్తారని కొడాలి నాని ప్రశ్నించారు. సీబీఐలో చాలామంది చంద్రబాబు మనుషులు ఉన్నారు. ఆ సంస్థ విచారణ జరిపే కేసులకు సంబంధించి ముందుగానే లీకులు
వస్తున్నాయి అని అప్పట్లో కేంద్రంలో ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి సీబీఐలు… చంద్రబాబును పచ్చపత్రికలు రాసే రాతలు… ఎవరిని ఏమీ చేయలేవని కొడాలి నాని తెలిపారు. కన్నా లక్ష్మీనారాయణ పనికిరాడు అని చెప్పి బిజెపి పక్కన పెట్టింది. ఇప్పుడు వెళ్లి అతను టిడిపిలో జాయిన్ అయ్యాడు. వయసులో ఉన్న సమయంలో మొత్తం బలమంతా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగించాడు. ఇప్పుడు వృద్ధాప్యానికి వచ్చాడు.. బిజెపి పక్కన పెట్టేసింది.. దీంతో కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం లో జాయిన్ అయినట్లు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొడాలి నాని తెలిపారు.
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
This website uses cookies.