Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఐదు దశల్లో ఓటింగ్

Authored By Sam C | The Telugu News | Updated on : 29 September 2025, 2:00 pm

Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC) రాణికుముదిని తాజాగా ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ ప్రకారం, పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఐదు దశల్లో జరగనున్నాయి.రాష్ట్రంలోని 565 మండలాల్లోని మొత్తం 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిని రెండు విడతల్లో నిర్వహించనున్నారు.

#image_title

మొదటి విడత:

నోటిఫికేషన్ విడుదల – అక్టోబర్ 9

పోలింగ్ తేదీ – అక్టోబర్ 23

కౌంటింగ్ – నవంబర్ 11

రెండో విడత:

నోటిఫికేషన్ – అక్టోబర్ 13

పోలింగ్ – అక్టోబర్ 27

కౌంటింగ్ – నవంబర్ 11

మూడు దశల్లో గ్రామ పంచాయతీ, వార్డుల ఎన్నికలు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,733 గ్రామ పంచాయతీలు మరియు 1,12,288 వార్డులకు ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనున్నారు:

మూడో దశ:

నోటిఫికేషన్ – అక్టోబర్ 17

పోలింగ్ & కౌంటింగ్ – అక్టోబర్ 31

నాలుగో దశ:

నోటిఫికేషన్ – అక్టోబర్ 21

పోలింగ్ & కౌంటింగ్ – నవంబర్ 4

ఐదో దశ:

నోటిఫికేషన్ – అక్టోబర్ 25

పోలింగ్ & కౌంటింగ్ – నవంబర్ 8

ఓటర్ల వివరాలు:

మొత్తం ఓటర్లు: 1,67,03,168

పురుషులు: 81,65,894

మహిళలు: 85,36,770

ఇతరులు: 504

ఈ షెడ్యూల్ విడుదలతో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా తెలంగాణలో రాజకీయ వేడి మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రజలు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp