Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఐదు దశల్లో ఓటింగ్
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC) రాణికుముదిని తాజాగా ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ ప్రకారం, పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఐదు దశల్లో జరగనున్నాయి.రాష్ట్రంలోని 565 మండలాల్లోని మొత్తం 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిని రెండు విడతల్లో నిర్వహించనున్నారు.

#image_title
మొదటి విడత:
నోటిఫికేషన్ విడుదల – అక్టోబర్ 9
పోలింగ్ తేదీ – అక్టోబర్ 23
కౌంటింగ్ – నవంబర్ 11
రెండో విడత:
నోటిఫికేషన్ – అక్టోబర్ 13
పోలింగ్ – అక్టోబర్ 27
కౌంటింగ్ – నవంబర్ 11
మూడు దశల్లో గ్రామ పంచాయతీ, వార్డుల ఎన్నికలు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,733 గ్రామ పంచాయతీలు మరియు 1,12,288 వార్డులకు ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనున్నారు:
మూడో దశ:
నోటిఫికేషన్ – అక్టోబర్ 17
పోలింగ్ & కౌంటింగ్ – అక్టోబర్ 31
నాలుగో దశ:
నోటిఫికేషన్ – అక్టోబర్ 21
పోలింగ్ & కౌంటింగ్ – నవంబర్ 4
ఐదో దశ:
నోటిఫికేషన్ – అక్టోబర్ 25
పోలింగ్ & కౌంటింగ్ – నవంబర్ 8
ఓటర్ల వివరాలు:
మొత్తం ఓటర్లు: 1,67,03,168
పురుషులు: 81,65,894
మహిళలు: 85,36,770
ఇతరులు: 504
ఈ షెడ్యూల్ విడుదలతో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా తెలంగాణలో రాజకీయ వేడి మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రజలు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది