man killed his son because he suspected his wife in kurnool
Father Killed Son : ఈరోజుల్లో అనుమానం అనేది పెద్ద భూతంలా మారింది. దానికి కారణాలు అనేకం. అందులో ముఖ్యమైనది సెల్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత చాలామందికి అనుమానాలు పెరిగాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలకు కారణాలు అవుతున్నాయి. చిన్న చిన్న విషయాలకు కూడా కొందరు ఓవర్ రియాక్ట్ అవుతుంటారు. ఏదో జరిగిపోయింది అని టెన్షన్ పడుతుంటారు. దాంపత్య జీవితంలో అడ్జెస్ట్ కారు. అలాంటి వాళ్లు తమను తాము చంపుకుంటారు. లేదంటే తమ ఫ్యామిలీని కూడా చంపేసి తామూ చనిపోతుంటారు.
అలాంటి ఘటనలు మనం ఇప్పటి వరకు చాలా చూశాం. ఇలాంటి ఘటనే ఒకటి ఏపీలోని కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి ఉన్మాదిలా మారిపోయాడు. తన కుటుంబాన్నే ఛిద్రం చేయబోయాడు. ఈ ఘటన బనగానపల్లి మండలం పెద్దరాజుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రాజు అనే వ్యక్తికి, అనిత అనే మహిళతో 14 ఏళ్ల కింద పెళ్లి అయింది. వాళ్లది ప్రేమ వివాహం. వాళ్లకు ఇద్దరు కొడుకులు జన్మించారు. అయితే.. ఈ మధ్య భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో తన ఇద్దరు కొడుకులను తీసుకొని అనిత తన పుట్టింటికి వెళ్లింది.
man killed his son because he suspected his wife in kurnool
తన పుట్టింటికి వచ్చి అక్కడే ప్రైవేట్ టీచర్ గా పని చేస్తూ పిల్లలను పోషించుకుంటోంది. అయితే.. ఇంతలో సడెన్ గా ఓ రోజు తన చేతుల్లో వేటకొడవలితో భర్త తన ఇంటికి వచ్చాడు. మరో చేతిలో పురుగుల మందు డబ్బా కూడా ఉంది. భార్య ఇంటికి వచ్చి హడావుడి చేశాడు. దీంతో ఇంట్లో వాళ్లంతా భయపడ్డారు. అక్కడే తన చిన్నకొడుకు ఉజ్వల్ కనిపించడంతో వెంటనే ఆ బాలుడికి పురుగుల మందు తాగించారు. గట్టిగా అరుస్తూ బయటికి వచ్చి పురుగుల మందు తాగి అక్కడే కింద పడిపోయాడు. ఇదంతా గమనించిన స్థానికులు వెంటనే ఆ పిల్లాడిని, అతడిని ఇద్దరినీ ఆసుపత్రికి తీసుకెళ్లినా కాసేపటికే ఇద్దరూ మృతిచెందారు. అలా భార్య మీద కోపంతో తన ప్రాణం తీసుకోవడమే కాకుండా.. అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాలను కూడా తీశాడు ఆ కసాయి తండ్రి.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.