Father Killed Son : ఈరోజుల్లో అనుమానం అనేది పెద్ద భూతంలా మారింది. దానికి కారణాలు అనేకం. అందులో ముఖ్యమైనది సెల్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత చాలామందికి అనుమానాలు పెరిగాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలకు కారణాలు అవుతున్నాయి. చిన్న చిన్న విషయాలకు కూడా కొందరు ఓవర్ రియాక్ట్ అవుతుంటారు. ఏదో జరిగిపోయింది అని టెన్షన్ పడుతుంటారు. దాంపత్య జీవితంలో అడ్జెస్ట్ కారు. అలాంటి వాళ్లు తమను తాము చంపుకుంటారు. లేదంటే తమ ఫ్యామిలీని కూడా చంపేసి తామూ చనిపోతుంటారు.
అలాంటి ఘటనలు మనం ఇప్పటి వరకు చాలా చూశాం. ఇలాంటి ఘటనే ఒకటి ఏపీలోని కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి ఉన్మాదిలా మారిపోయాడు. తన కుటుంబాన్నే ఛిద్రం చేయబోయాడు. ఈ ఘటన బనగానపల్లి మండలం పెద్దరాజుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రాజు అనే వ్యక్తికి, అనిత అనే మహిళతో 14 ఏళ్ల కింద పెళ్లి అయింది. వాళ్లది ప్రేమ వివాహం. వాళ్లకు ఇద్దరు కొడుకులు జన్మించారు. అయితే.. ఈ మధ్య భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో తన ఇద్దరు కొడుకులను తీసుకొని అనిత తన పుట్టింటికి వెళ్లింది.
తన పుట్టింటికి వచ్చి అక్కడే ప్రైవేట్ టీచర్ గా పని చేస్తూ పిల్లలను పోషించుకుంటోంది. అయితే.. ఇంతలో సడెన్ గా ఓ రోజు తన చేతుల్లో వేటకొడవలితో భర్త తన ఇంటికి వచ్చాడు. మరో చేతిలో పురుగుల మందు డబ్బా కూడా ఉంది. భార్య ఇంటికి వచ్చి హడావుడి చేశాడు. దీంతో ఇంట్లో వాళ్లంతా భయపడ్డారు. అక్కడే తన చిన్నకొడుకు ఉజ్వల్ కనిపించడంతో వెంటనే ఆ బాలుడికి పురుగుల మందు తాగించారు. గట్టిగా అరుస్తూ బయటికి వచ్చి పురుగుల మందు తాగి అక్కడే కింద పడిపోయాడు. ఇదంతా గమనించిన స్థానికులు వెంటనే ఆ పిల్లాడిని, అతడిని ఇద్దరినీ ఆసుపత్రికి తీసుకెళ్లినా కాసేపటికే ఇద్దరూ మృతిచెందారు. అలా భార్య మీద కోపంతో తన ప్రాణం తీసుకోవడమే కాకుండా.. అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాలను కూడా తీశాడు ఆ కసాయి తండ్రి.
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.