Marriage : డబ్బు మనిషిని ఎలా మార్చగలదో మనం చూస్తున్నాం. డబ్బులు కోసం గడ్డి తినేవాళ్లు ఎందరో. అయితే డబ్బుఉల వస్తాయన్న ఆశతో అన్నా చెల్లెలు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఇదే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అణగారిన వర్గాలకు చెందిన ప్రజలు పెళ్లిళ్లు చేసుకుంటే ప్రభుత్వం.. ఆర్థిక సాయం అందిస్తుందని అన్నా చెల్లెలు.. డబ్బుల కోసం పెళ్లి చేసుకున్నారు. సమాజం సిగ్గుతో తల దించుకునే ఈ సంఘటన ఉత్తర్ప్రదేశ్లో చోటు చేసుకుంది.ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారు పెళ్లి చేసుకుంటే ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం.. ముఖ్యమంత్రి సామూహిక్ వివాహ్ యోజన కింద.. ఆర్థిక సహాయం అందిస్తూ ఉంటుంది.
అతి తక్కువ ఆదాయాలు కలిగిన వారికి పెళ్లి చేసుకునేందుకు ఆర్థిక సాయం కోసం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఈ పథకాన్ని తీసుకువచ్చింది. అయితే హత్రాస్ జిల్లాలో ఈ ముఖ్యమంత్రి సామూహిక్ వివాహ్ యోజనను దుర్వినియోగం చేశారు. ఇద్దరు అన్నా చెల్లెలు పెళ్లి చేసుకుని ప్రభుత్వ సొమ్ముని కాజేయాలని చూడగా.. అధికారులు వారిని పట్టుకున్నారు. అన్నా చెల్లెలు పెళ్లి చేసుకున్న విషయాన్ని స్థానికులు.. అధికారుల దృష్టికి తీసుకురావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హత్రాస్ జిల్లాలోని సికిందరావు గ్రామంలో జరిగిన ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించగా అసలు విషయం బయటకు వచ్చింది.
సామూహిక్ వివాహ్ యోజన కింద పెళ్లి చేసుకున్న యువతికి రూ.35 వేల నగదు, రూ.10వేల విలువైన నిత్యావసర వస్తువులు, పెళ్లి ఖర్చుల కింద మరో రూ.6 వేలు ప్రభుత్వం అందిస్తోంది. అయితే స్థానిక వర్గాలు వెల్లడించిన ప్రకారం.. ఈ పథకం కింద పెళ్లి చేసుకుని అన్నా చెల్లెలు ప్రభుత్వ డబ్బును కొట్టేయాలనే ప్రయత్నాలను అధికారులు పసిగట్టారు. ఇక ఇప్పటికే పెళ్లి అయిన మరో రెండు జంటలు కూడా మళ్లీ డబ్బుల కోసం వివాహం చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్రట్ర వేద్ సింగ్ చౌహాన్.. ప్రభుత్వ ఖజానాకు గండికొట్టాలని చూసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని తేల్చి చెప్పారు.
Eatala Rajender : మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ లోక్సభ జాయింట్ కమిటీ ఆన్ ఆఫీసేస్ ఆఫ్ ప్రాఫిట్…
pawan kalyan : పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ రాజకీయాలలో సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారాడు.ఆయన పది సంవత్సరాలుగా అధికారం…
Vijayasai Reddy : ఇటీవల ప్రతి రాష్ట్రంలో కూడా ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారాయి. తెలంగాణ, ఏపీ ఎన్నికలు రంజుగా…
Divvala Madhuri : టెక్కలి వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురీ ఈ మధ్య ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నారు.…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వంలో త్వరలోనే ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తుంది. జనసేన అధినేత,…
ITBP Recruitment : ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) 545 ఖాళీలతో కానిస్టేబుల్ (డ్రైవర్) కోసం రిక్రూట్మెంట్ను ప్రకటించింది. ఆసక్తి…
Modi : కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో సానుకూలంగా ఏవి పెద్దగా కనిపించలేదు. కేంద్రం నుండి ఏపీకి వచ్చిన…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ఇప్పుడు మరింత ఇంట్రెస్టింగ్గా మారుతుంది. వైల్డ్…
This website uses cookies.