KCR : టీఆర్‌ఎస్‌ కు ఆయుదం.. ఏపీ, తెలంగాణ మళ్లీ కలిపేస్తారు

KCR : తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టే విధంగా బిజెపి వ్యూహాలు పన్నుతోంది. కేంద్రం నుండి మంత్రులు కూడా వచ్చి రాష్ట్రంలో మీటింగ్ నిర్వహించి అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ ప్రజల్లో టీఆర్‌ఎస్‌ కు నష్టం కలిగించే విధంగా మాట్లాడుతున్నారు. దాంతో టీఆర్ఎస్ నాయకులు కూడా ప్రతి దాడికి సిద్ధమయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ పై సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం కోసం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. ఆ సమయంలో తీవ్ర స్థాయిలో మోడీ గురించి కేసీఆర్‌ మాట్లాడిన విషయం కూడా అందరికి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ పై కేసీఆర్ మాట్లాడిన తర్వాత రెండు పార్టీల మధ్య దూరం మరింత పెరిగింది అంటూ క్లారిటీ వచ్చేసింది.ఈ సమయంలో పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఏపీకి అన్యాయం జరిగింది.

తెలంగాణ నుండి విడిపోవడం ద్వారా ఏపీ చాలా నష్టపోయింది అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు ఏపీ లో బీజేపీకి సానుభూతి కలిగించేలా ఉన్నాయి. ఏపీలో బీజేపీ మళ్లీ పావులు కదిపే విధంగా ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలోనే మోడీ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కేసీఆర్ అండ్ పార్టీ వర్గాల వారు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా కేటీఆర్ ఒక మీటింగ్ లో మాట్లాడుతూ బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే కచ్చితంగా మళ్లీ తెలంగాణ ని తీసుకువెళ్లి ఏపీ లో విలీనం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏపీకి అన్యాయం జరిగిపోయింది అంటూ తెగ బాధ పడుతున్న బీజేపీ నాయకులు అవకాశం వస్తే తెలంగాణను వాళ్లు అమ్మేస్తారంటూ కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు.ఒక నాలుగు రోజులు బీజేపీకి తెలంగాణలో అధికారమిస్తే

minister ktr comments on bjp and modi stand on ap

మొత్తం పరిస్థితి మళ్లీ పాత రోజుల్లోకి మారే అవకాశం ఉందని అన్నారు. బిజెపి చేస్తున్న లొల్లికి యువత బెండ్ అయ్యి ఆలోచన చేస్తే రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవుతుందని.. రాష్ట్రం మొత్తం మళ్లీ ఆగమవుతుందని కేటీఆర్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆంధ్రాలో తెలంగాణను కలుపుతారు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఆ పాయింట్ తెలంగాన జనాల్లో కూడా ఆలోచన కలిగించే విధంగా ఉంది. అందుకే అజెండాతోనే బిజెపి పై పోరాటానికి టిఆర్ఎస్ కార్యకర్తలు సన్నద్ధం కావాలని పార్టీ నాయకులు సూచిస్తున్నారు. బిజెపి మరియు టిఆర్ఎస్ ల మధ్య దూరం మరింత పెరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెసు దానిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Recent Posts

Tamarind Benefits : చింతపండు పుల్లగా ఉందని దూరం పెడుతున్నారా… అయితే,దీని ప్రయోజనాలు కోల్పోతున్నట్లే…?

Tamarind Benefits : నేటి కాలంలో ప్రతి ఒక్కరు కూడా చింతపండు తినాలంటే భయపడుతున్నారు. వంకాలలో కూడా దీన్ని వాడడమే…

23 minutes ago

NRSC Recruitment : ఎన్‌ఆర్‌ఎస్‌సీలో ఉద్యోగావ‌కాశాలు.. నెల‌కు వేతనం రూ.1,77,500

NRSC Recruitment : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌. ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) హైదరాబాద్‌లోని ప్రధాన కేంద్రం…

1 hour ago

Green Tea Side Effects : గ్రీన్ టీ, ఈ విధంగా తాగారంటే… ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే… డేంజర్ లో పడతారు..?

Green Tea Side Effects : ప్రస్తుతం చాలామంది ఆరోగ్య ప్రయోజనాల కోసం,కొన్ని రకాల టీలను అలవాటు లేకపోయినా రుచిగా…

2 hours ago

Mahaabhaaratam : మహాభారతంలో 3 కథలు చాలా ఆసక్తికరమైనవి… దీని గురించి మీకు తెలుసా…?

Mahaabhaaratam : మహాభారతం Mahaabhaaratam అంటే మనకు గుర్తొచ్చేది శ్రీకృష్ణుని లీలలు. మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పే మంచి మాటలే మహాభారతం.…

3 hours ago

New Villain : టాలీవుడ్‌కి కొత్త విల‌న్.. ఎవ‌రు ఈ ర‌ఘువ‌రన్..!

New Villain : ఈ మ‌ధ్య సినీ పరిశ్ర‌మ‌కి కొత్త న‌టీన‌టులు ప‌రిచ‌యం అవుతున్నారు. కుబేర‌ లో న‌టించిన విల‌న్…

12 hours ago

Surveyor Tejeshwar : వీడి మోజులో పడే కట్టుకున్న బంగారం లాంటి భర్తను చంపిన ఐశ్వర్య..!

Surveyor Tejeshwar : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సర్వేయర్‌గా పనిచేస్తున్న గంటా తేజేశ్వర్ హత్య కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం…

13 hours ago

Neelima : “నిత్య పెళ్లికూతురు” ప్రచారంలో అసలు నిజమే లేదు.. 12 పెళ్లిళ్ల పై నీలిమ క్లారిటీ ..! వీడియో

Neelima  : అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురానికి చెందిన బేతి వీర దుర్గా నీలిమ పై సోషల్ మీడియాలో “…

14 hours ago

Neelima : రెండేళ్లలో 12 పెళ్లిళ్లు చేసుకున్న నీలిమ.. విడాకులు తీసుకున్న వారే టార్గెట్..!

Neelima : రామచంద్రపురం పట్టణంలో ఒక మహిళ 12 పెళ్లిళ్లు చేసిన వార్త స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. నీలిమ…

15 hours ago