Minister Roja : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో వారాహి విజయ యాత్ర లో వైసీపీ పై సీరియస్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. సీఎం జగన్ పై యధావిధిగా పవన్ మండిపడటం జరిగింది. రుషి కొండపై అక్రమంగా కట్టడాలు కట్టినట్లు.. పర్యావరణాన్ని పాడు చేస్తున్నట్లు మండిపడ్డారు. ఈ క్రమంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి రోజా తనదైన శైలిలో కౌంటర్లు ఇవ్వడం జరిగింది. వెనకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలని జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన రాజధానిగా విశాఖపట్నం ప్రకటించిన నాటి నుండి పవన్, చంద్రబాబు విశాఖ ప్రజలపై కక్ష కట్టినట్టు..
విశాఖ బ్రాండ్ ఇమేజ్ పాడు చేస్తూ.. విశాఖ క్రైమ్ సిటీగా ప్రాజెక్ట్ చేయాలనుకోవడం చాలా బాధాకరం. లక్ష పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ తాజాగా విశాఖలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే పదవ తరగతి అయినా పాస్ అయ్యాడా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే నిబంధనలు మరియు రూల్స్ అన్నిటికీ లోబడి పని చేస్తుంటే… పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకొని ఇష్టానుసారంగా విశాఖలో చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నాడని మంత్రి రోజా ఆరోపణలు చేయడం జరిగింది. రుషికొండ నిర్మాణానికి కేంద్ర అటవీశాఖ అనుమతులు ఇవ్వటం జరిగింది.
రెండు పర్మిషన్స్ కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చాయి. ఆ తర్వాతే రాష్ట్రానికి సంబంధించిన స్థానిక శాఖలు మిగతా అనుమతులు ఇవ్వటం జరిగింది. పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు తల్లకిందులు తపస్సు చేసిన..2024లో జనసేన, టీడీపీకు డిపాజిట్స్ కూడా రావు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ బాగుండాలని సంక్షేమం అందించడం మాత్రమే కాకుండా…. రాష్ట్ర అభివృద్ధి చెందాలని.. మూడు ప్రాంతాలలో మూడు రాజధానులు ప్రకటించి.. వాటి అభివృద్ధి దిశగా ఎలా ముందుకు వెళ్తున్నారు అన్ని ప్రాంతాల ప్రజలు గమనిస్తున్నారు. ఇంత పవన్ అరిచి అరుపులకు కేకలకు ప్రజలేవారు పట్టించుకోరని మంత్రి రోజా కౌంటర్లు వేయడం జరిగింది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.