Pawan Kalyan : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు చాలా విచిత్రంగా మారాయి. కేవలం వైసీపీ పార్టీని ఢీకొట్టేందుకు మిగితా పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయి. ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నాయి ప్రధాన పార్టీలు. అందులో భాగంగానే ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయి. అధికార వైసీపీని ఢీకొట్టడం కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన విషయం తెలిసిందే. ఇద్దరి భేటీ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లోనే చర్చనీయాంశం అయింది. నిజానికి.. 2014 ఎన్నికల్లోనే చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇచ్చారు. కేవలం పవన్ సపోర్ట్ తోనే చంద్రబాబు గెలిచారు.
కానీ.. గెలిచిన తర్వాత చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ను పక్కన పెట్టేశారు. దీంతో పవన్ కు కూడా అసలు రాజకీయాలు ఎలా ఉంటాయో అర్థం అయింది. ఆ తర్వాత ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా సొంతంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లోనూ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు పవన్ కళ్యాణ్. కానీ.. ఆ తర్వాత బీజేపీతో పొత్తు అన్నారు. కానీ.. ఏనాడూ బీజేపీతో కలిసి నడవలేదు. ఇప్పుడు చూస్తే ఏకంగా చంద్రబాబుతో కలిసి తిరుగుతున్నారు. టీడీపీ, జనసేన పొత్తుపై వైసీపీ బహిరంగంగానే విమర్శలు చేస్తోంది. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయారంటూ ఆరోపణలు చేస్తోంది. ఎన్ని పార్టీలు కలిసినా.. ఎంత మంది కలిసి పోటీ చేసినా సింహం సింగిల్ గానే బరిలోకి దిగుతుంది
అంటూ జగన్ ను ఉద్దేశించి వైసీపీ నేతలు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. వీళ్ల భేటీపై వైసీపీ మంత్రి విడదల రజిని కూడా షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఇద్దరూ ఒక్కటే కానీ మనుషులు మాత్రమే వేరు అంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కందుకూరులో, గుంటూరులో జరిగిన ఘటనలపై ఏమాత్రం స్పందించని పవన్ కళ్యాణ్.. చనిపోయిన వారి కుటుంబాలను కనీసం పరామర్శించని పవన్ కళ్యాణ్.. ఇప్పుడు చంద్రబాబును కలవడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబును గెలిపించడం కోసమే పవన్ కళ్యాణ్ తాపత్రయపడుతున్నాడని విడదల రజిని ఆరోపించారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా.. సీఎం జగన్ వెంట ప్రజలు ఉన్నారని ఆమె తేల్చి చెప్పారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.