Pawan Kalyan : పవన్ కల్యాణ్ కి నరాలు తెగే షాక్ ఇచ్చిన విడదల రజిని..!

Pawan Kalyan : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు చాలా విచిత్రంగా మారాయి. కేవలం వైసీపీ పార్టీని ఢీకొట్టేందుకు మిగితా పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయి. ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నాయి ప్రధాన పార్టీలు. అందులో భాగంగానే ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయి. అధికార వైసీపీని ఢీకొట్టడం కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన విషయం తెలిసిందే. ఇద్దరి భేటీ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లోనే చర్చనీయాంశం అయింది. నిజానికి.. 2014 ఎన్నికల్లోనే చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇచ్చారు. కేవలం పవన్ సపోర్ట్ తోనే చంద్రబాబు గెలిచారు.

కానీ.. గెలిచిన తర్వాత చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ను పక్కన పెట్టేశారు. దీంతో పవన్ కు కూడా అసలు రాజకీయాలు ఎలా ఉంటాయో అర్థం అయింది. ఆ తర్వాత ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా సొంతంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లోనూ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు పవన్ కళ్యాణ్. కానీ.. ఆ తర్వాత బీజేపీతో పొత్తు అన్నారు. కానీ.. ఏనాడూ బీజేపీతో కలిసి నడవలేదు. ఇప్పుడు చూస్తే ఏకంగా చంద్రబాబుతో కలిసి తిరుగుతున్నారు. టీడీపీ, జనసేన పొత్తుపై వైసీపీ బహిరంగంగానే విమర్శలు చేస్తోంది. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయారంటూ ఆరోపణలు చేస్తోంది. ఎన్ని పార్టీలు కలిసినా..  ఎంత మంది కలిసి పోటీ చేసినా సింహం సింగిల్ గానే బరిలోకి దిగుతుంది

minister vidadala rajini comments on pawan kalyan

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అమ్ముడుపోయారా?

అంటూ జగన్ ను ఉద్దేశించి వైసీపీ నేతలు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. వీళ్ల భేటీపై వైసీపీ మంత్రి విడదల రజిని కూడా షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఇద్దరూ ఒక్కటే కానీ మనుషులు మాత్రమే వేరు అంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కందుకూరులో, గుంటూరులో జరిగిన ఘటనలపై ఏమాత్రం స్పందించని పవన్ కళ్యాణ్.. చనిపోయిన వారి కుటుంబాలను కనీసం పరామర్శించని పవన్ కళ్యాణ్.. ఇప్పుడు చంద్రబాబును కలవడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబును గెలిపించడం కోసమే పవన్ కళ్యాణ్ తాపత్రయపడుతున్నాడని విడదల రజిని ఆరోపించారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా.. సీఎం జగన్ వెంట ప్రజలు ఉన్నారని ఆమె తేల్చి చెప్పారు.

Recent Posts

Arattai app | వాట్సాప్‌కి పోటీగా వ‌చ్చిన ఇండియా యాప్.. స్వదేశీ యాప్‌పై జోహో ఫోకస్

Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్‌కి భారత్‌ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…

57 minutes ago

RRB | భారతీయ రైల్వేలో 8,875 ఉద్యోగాలు.. NTPC నోటిఫికేషన్ విడుదల, సెప్టెంబర్ 23 నుంచి దరఖాస్తులు

RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…

2 hours ago

Farmers | రైతులకు విజ్ఞప్తి .. సెప్టెంబర్ 30 చివరి తేది… తక్షణమే ఈ-క్రాప్ నమోదు చేయండి!

Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్‌కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…

4 hours ago

Modi | శ్రీశైలం సందర్శించనున్న ప్రధాని మోదీ .. ఇన్నాళ్ల‌కి వాటిని బ‌య‌ట‌కు తీసారు..!

Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…

6 hours ago

Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఐదు దశల్లో ఓటింగ్

Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…

8 hours ago

Prize Money | క‌ప్ గెలిచిన టీమిండియా ప్రైజ్ మ‌నీ ఎంత‌.. ర‌న్న‌ర‌ప్ పాకిస్తాన్ ప్రైజ్ మ‌నీ ఎంత‌?

Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్‌లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…

10 hours ago

Chia Seeds | పేగు ఆరోగ్యానికి పవర్‌ఫుల్ కాంబినేషన్ .. పెరుగు, చియా సీడ్స్ మిశ్రమం ప్రయోజనాలు!

Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…

11 hours ago

TEA | మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచే భారతీయ ఆయుర్వేద టీలు.. ఏంటో తెలుసా?

TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…

12 hours ago