Home » Andhra Pradesh » Mla Kethireddy Warning To Student
andhra pradesh

MLA Kethireddy : కరెంట్ వైర్ లతో ఉయ్యాల ఊగుతావా అంటూ స్కూల్ పిల్లోడికి కేతిరెడ్డి వార్నింగ్ వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: February 25, 2023, 6:39 pm
Advertisement

MLA Kethireddy : ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రజా సమస్యల విషయంలో స్పందించే తీరు చాలా విభిన్నంగా ఉంటుంది. తన నియోజకవర్గంలో ప్రజా సమస్యలను పరిష్కరించడానికి “గుడ్ మార్నింగ్ ధర్మవరం” అనే కార్యక్రమం… ఏపీ రాజకీయాల్లోనే సంచలనం సృష్టించింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి… తన దృష్టికి వచ్చే ప్రతి సమస్య విషయంలో ఆయన స్పందించే తీరు ఎంతో ఆదర్శంగా ఉంటుంది. నిజమైన రాజకీయ నాయకుడు అంటే ఆయన లాగే ఉండాలని చాలామంది సోషల్ మీడియాలో… ఆయన వీడియోలకు స్పందిస్తూ కామెంట్లు చేస్తూ ఉంటారు.

Advertisement

MLA Kethireddy Warning to Student

స్కూల్లో చదివే పెళ్ళాడు మొదలుకొని అన్ని వయసుల వారిని పెద్దవారిని పలకరిస్తూ సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొన్ని సమస్యల విషయంలో ఆయన స్పందించే తీరు సోషల్ మీడియాలో హైలైట్ అవుతూ ఉంటాయి. ఈ రకంగానే నియోజకవర్గంలో ఓ ప్రాంతంలో పర్యటిస్తూ తండ్రి కోల్పోయి స్కూల్ చదువు మానేసి మూడు సంవత్సరాలు ఖాళీగా ఇంట్లోనే ఉంటున్న పిల్లాడు ఎమ్మెల్యే కేతిరెడ్డికి ఎదురు కావడం జరిగింది. ఎక్కడ చదువుతున్నావ్ అన్ని హారతీగ తను చదవటం లేదని…

Advertisement

తండ్రి కోల్పోవడంతో తాను ఇంటి దగ్గరే ఉంటున్నట్లు చదువు మానేసినట్లు తెలిపారు. ఇంత వెంటనే ప్రభుత్వ అధికారులను అలెర్ట్ చేసి సదరు పిల్లోడు మళ్ళీ స్కూలుకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అయితే కుర్రోడు ఇంటిదగ్గర కరెంటు తీగలకు దగ్గరగా మరో తీగ ఉయ్యాల రూపంలో ఉండటం ఎమ్మెల్యే గమనించటం జరిగింది. కరెంటు వైర్లతో ఉయ్యాల ఊపితే మాడిపోతావ్ అంటూ సదరు పిల్లోడిని హెచ్చరించారు. ఇదే సమయంలో కరెంట్ అధికారులను అలర్ట్ చేసి వెంటనే ఆ వైర్లను పైకి కట్టాలని హెచ్చరించారు. ఈ ఘటనకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి