Modi : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. కోవిడ్ 19 కారణంగా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ పొందలేకపోయిన వారికి మరో అవకాశాన్ని కల్పించింది. పిల్లల రిజల్ట్ లేదా రిపోర్ట్ కార్డ్ లేదా ఫీజు చెల్లింపు ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ వంటి వాటిని ప్రింట్ తీసుకొని సమర్పిచడం ద్వారా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది.
అయితే ఇది మార్చి 2020 నుంచి మార్చి 2021 వరకు అకడమిక్ ఇయర్కు మాత్రమే వర్తిస్తుంది. ఇక దీని ద్వారా 7వ వేతన సంఘం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నెలకు రూ.2,250 చిల్ట్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ పొందే అవకాశం ఉంది. గరిష్టంగా ఇద్దరు పిల్లలకు ఈ బెనిఫిట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. దానిపై రూ.4,500 వరకు పొందే అవకాశం ఉంది. పిల్లల చదువు కోసం కేంద్రం.. తన ఉద్యోగులకు అలవెన్స్ అందిస్తోంది.
అయితే గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఉద్యోగులు… చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది. స్కూళ్ళు మూత పడటంతో అందుకు సంబంధించిన సర్టిఫికేట్ రాక పోవడంతో అలవెన్స్ ను క్లెయిమ్ చేసుకోవడం చాలా ఇబ్బంది అయింది. కేంద్రం తాజా ప్రకటనతో ఇప్పుడు ఆయా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఊరట కలిగిందనే చెప్పాలి.
Pitru Paksha : హిందూ సనాతన ధర్మంలో ఏడాదిలోని ఒక నిర్దిష్ట కాలాన్ని పూర్వికులకు అంకితం చేయబడింది. ఈ కాలాన్ని…
Canara Bank : కెనరా బ్యాంక్ 3,000 అప్రెంటిస్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ…
Anjeer Juice : అంజీర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే సాధారణంగా మనం అంజీర్…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
This website uses cookies.