
chandrababu
Chandrababu : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మున్సిపల్ ఎన్నికలు గట్టి షాక్ ఇచ్చాయనే చెప్పొచ్చు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఒకే ఒక్క మున్సిపాలిటీ తప్ప మిగతా అన్ని చోట్ల సత్తా చూపలేకపోయింది. ఇక అధికార వైసీపీ ఈ ఎన్నికల్లో హవా చూపింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ విజయ కేతనం ఎగురవేసింది. తన సొంత నియోజకవర్గంలో పట్టు నిలుపుకోలేకపోయిన చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీకి పూర్వ వైభవం తీసుకురాగలడా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి పట్ల చంద్రబాబు కాని టీడీపీ శ్రేణులు కాని అధికార వైసీపీపైన ఆరోపణలు చేయొచ్చు.
chandrababu
కాని, పార్టీ అధినేత చంద్రబాబు నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీలోనే టీడీపీ ఓటమి పాలవడం పట్ట పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ ఎంత అనేది చర్చనీయాంశమవుతున్నది. టీడీపీ అధినేత చంద్రబాబు కాని నేతలు కాని ప్రతీ సారి రాజారెడ్డి రాజ్యాంగం అంటూ ఆరోపణలు చేస్తున్నారు. కానీ, నిజానికి టీడీపీ ప్రజల్లో ఉందా అనే విషయం ఆత్మ పరిశీలన చేసుకోవాలని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు. జనంలోకి వెళ్లకుండా కేవలం పార్టీ కార్యాలయల్లో దీక్షలు చేసో లేదా విమర్శలు చేయడం వలన పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకుంటే పొరపాటే అవుతుందని అంటున్నారు.
అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించొచ్చు. కానీ, ఏడు సార్లు కుప్పం నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే అక్కడ కూడా పట్టు నిలుపోలేకపోవడం ద్వారా పార్టీ పరిస్థితి, ప్రభావం తగ్గిందని అంచనా వేసుకోవచ్చు. మిగిలిన మున్సిపాలిటీల్లో టీడీపీ అంతో ఇంతో ఫైట్ ఇచ్చినప్పటికీ కుప్పంలో ఫైట్ ఇవ్వకపోవడం పట్ల ఆ పార్టీ శ్రేణులూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయట. అధినాయకత్వ లోపం ఉందా అని అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు పర నింద చేసే ముందర ఆత్మ పరిశీలన చేసుకోవాలనే పలువురు సూచిస్తున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావాల్సి ఉంటుందని కొందరు హెచ్చరిస్తున్నారు.
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్లకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
This website uses cookies.