Categories: Newssports

Neeraj Chopra : ర‌జ‌తం సాధించిన బ‌ల్లెం వీరుడు.. ప‌త‌కం వ‌చ్చినందుకు ఆనంద‌మే కాని…!

Neeraj Chopra : పారిస్ ఒలంపిక్స్ లో ప‌త‌కాలు సాధించేందుకు భార‌త అథ్లెట్స్ చాలానే హార్డ్ వ‌ర్క్ చేస్తున్నారు. గురువారం రాత్రి జరిగిన ఫైనల్‌‌లో రజత పతకాన్ని కొల్లగొట్టాడు బ‌ల్లెం వీరుడు నీర‌జ్ చోప్రా.. 89.45 మీటర్ల త్రో విసిరి రెండవ స్థానంలో నిలిచాడు. దీంతో వరుస ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించిన తొలి భారతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా అతడు నిలిచాడు. టోక్యో ఒలింపిక్స్‌లో అతడు స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. ఇటీవల గాయాల బారిన పడినప్పటికీ కోలుకొని పారిస్ ఒలింపిక్స్‌లో ఏవిధంగా రాణించాడో నీరజ్ చోప్రా వెల్లడించాడు.

Neeraj Chopra అదొక్క‌టే బాధ‌..

త్రో విసిరినప్పుడల్లా తన దృష్టి 60-70 శాతం గాయంపైనే ఉంటుందని నీరజ్ చోప్రా వెల్లడించాడు. ‘‘ఈ రోజు నా పరుగు బాగోలేదు. వేగం కూడా తక్కువగా ఉంది. ఈ రోజు నేను ఏం చేసినా గాయం సమస్యతోనే చేశాను. శస్త్రచికిత్స చేయించుకునేందుకు నాకు సమయం లేదు. నన్ను నేను ముందుకు నెట్టుకున్నాను’’ అని నీరజ్ చోప్రా వెల్లడించాడు. నాలో చాలా సత్తా మిగిలి ఉంది. అది నేను అందుకోవాలి. అది నేను సాధించగలననే నమ్మకం ఉంది. పూర్తి స్థాయి సామర్థ్యాన్ని సాధించకపోతే నేను శాంతించలేను’’ అని వ్యాఖ్యానించాడు. కాగా నీరజ్ కొంతకాలంగా గాయాలతో బాధపడుతున్నాడు. ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి ముందు కేవలం మూడు ఈవెంట్‌లలో మాత్రమే అతడు పాల్గొన్నాడు.

Neeraj Chopra : ర‌జ‌తం సాధించిన బ‌ల్లెం వీరుడు.. ప‌త‌కం వ‌చ్చినందుకు ఆనంద‌మే కాని…!

ఒలంపిక్స్‌లో ప‌త‌కం సాధించినందుకు ఆనందంగానే ఉంది. కాక‌పోతే మ‌న జాతీయ గీతం వినిపించ‌లేకపోయినందుకు కాస్త బాధ‌గా ఉంది. భవిష్య‌త్ మ‌రోసారి సాధిస్తానంటూ నీర‌జ్ చోప్రా చెప్పాడు.ఇక నీర‌జ్ సాధించిన ఘ‌న‌త‌పై దేశ వ్యాప్తంగా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది. నీరజ్ చోప్రా రజత పతకం సాధించడంపై తండ్రి సతీష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. తన కొడుకు సాధించిన విజయం పట్ల గర్వంగా ఉందని చెప్పారు. పాక్ అథ్లెట్ స్వర్ణం గెలవడంపై స్పందిస్తూ.. ఇది పాకిస్థాన్ రోజు అని వ్యాఖ్యానించారు. నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవి స్పందిస్తూ.. తన కొడుకు రజత పతకం సాధించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తన కొడుక్కి ఇష్టమైన ఆహారం వండి పెట్టేందుకు అతడి కోసం ఎదురుచూస్తుంటానని ఆమె చెప్పారు. ఇక స్వర్ణం గెలిచిన పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ కూడా తన కొడుకు లాంటి వాడేనని వ్యాఖ్యానించారు.

Recent Posts

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

3 hours ago

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ఆందోళన .. కాకినాడ తీరంలో కల్లోలం

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…

6 hours ago

Dry Eyes | కళ్ళు పొడిబారడం వ‌ల‌న పెరుగుతున్న సమస్య .. కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు ఇవే

Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…

7 hours ago

Lemon Seeds | అవి పారేయకండి ..నిమ్మగింజల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…

10 hours ago

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

13 hours ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

1 day ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

1 day ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

1 day ago