
why there is no rahul gandhi bharat jodo yatra in gujarat
Ys Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో తెలుగు సినిమా పరిశ్రమ కు చెందిన ప్రముఖులు ఈ నెల పదవ తారీఖున భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ జోరుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ అతి త్వరలోనే ఇండస్ట్రీ నుండి ఏపీకి వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అవ్వబోతున్నారు. ఈ సమయంలోనే చిరంజీవి తో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖ హీరోలు కూడా ఈ భేటీకి హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ మీడియా లో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా ప్రభాస్, ఎన్టీఆర్ మరియు మహేష్ బాబు కూడా ఈ భేటీకి హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జోరుగా జరుగుతోంది.ఇప్పటి వరకు ఇలాంటి భేటీ కి కానీ..
ఇలాంటి చర్చలకు కానీ మహేష్, ఎన్టీఆర్ మరియు ప్రభాస్ వెళ్లడం జరగలేదు. ఈసారి కూడా వెళ్తారని నమ్మకం ఏ ఒక్కరిలో లేదు. సాధారణంగా ఇలాంటి విషయాలకు దూరంగా ఉండే మహేష్ బాబు ఇప్పుడు ఈ భేటీకి వెళ్తాడు అనుకోవడం పొరపాటు అవుతుంది. అందుకే మహేష్ వెళ్తాడు అనే వార్తలో ఎలాంటి నిజం లేదు. ఇక ప్రభాస్ ఇలాంటి వ్యవహారాలకు చాలా దూరంగా ఉంటాడు. కనుక ఆయన అమరావతి వెళ్తాడు అనుకోవడం పొరపాటు అవుతుంది. ఇక ఎన్టీఆర్ ఇలాంటి వ్యవహారాలకు దగ్గరగా ఉన్నట్లుగా అనిపించినా కూడా ఇతర హీరోలు వెళ్ళనప్పుడు ఆయన కూడా వెళ్లడం అనుమానమే. కనుక ఇంతకు ముందు మాదిరిగానే చిరంజీవి నాగార్జున ఇతర ప్రముఖ నిర్మాతలు మాత్రమే వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం టికెట్ల విషయం లో ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.టికెట్ల రేట్ల విషయంలో ప్రభుత్వం నియమించిన కమిటీ సభ్యులు ఒక నివేదికను తయారు చేసి మంత్రికి ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
Ntr prabhas mahesh babu going to meet ys jagan mohan reddy
ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన తర్వాత ఆ నివేదికను బయటికి వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి తో ఇండస్ట్రీ ప్రముఖల భేటీ తర్వాత టికెట్ల రేట్లు విషయంలో క్లారిటీ వస్తుంది అంటూ గత వారం పది రోజుల నుండి ప్రచారం జరుగుతోంది. తాజాగా మంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు నిదర్శనంగా ఉన్నాయి. కనుక కచ్చితంగా అతి త్వరలోనే ఏపీ ప్రభుత్వం నుండి ఒక గుడ్ న్యూస్ టాలీవుడ్ కు వినిపించే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో టికెట్ల రేట్లు పెంచితే ఈ నెల నుంచే సినిమాల జోరు కొనసాగే అవకాశం ఉంది. అక్కడ టికెట్ల రేట్లు తక్కువగా ఉన్నాయని ఉద్దేశంతో చాలా మంది తమ సినిమాలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. టికెట్ల రేట్ల పెంపుతో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వచ్చే అవకాశం ఉంది.
India Post GDS Jobs : ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ GDS రిక్రూట్మెంట్ 2026 ప్రక్రియకు సంబంధించి…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు పూర్వవైభవం తీసుకువచ్చేలా 16వ ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వానికి భారీ…
ICC T20 World Cup 2026 : ఏ ఐసీసీ టోర్నమెంట్ అయినా సరే భారత జట్టు పాల్గొనే మ్యాచ్లే…
Government Jobs : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాంచీ IIITR ప్రతిష్ఠాత్మక కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థ Central…
Illicit Relationship : దేశ వ్యాప్తంగా అక్రమ సంబంధాలు రోజు రోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ అక్రమ సంబంధాల…
Redmi Note 13 Pro+ 5G Review: ఫ్లాగ్షిప్ ఫోన్లకు ఏమాత్రం తీసిపోని ఫీచర్లతో, సామాన్యుడికి అందుబాటులో ఉండే ధరతో…
Jio AC Launch : జియో ఏసీ ( Jio AC ) : వేసవి తాపం, కరెంట్ బిల్లుల…
Lakhpati Didi Loan Scheme: ప్రస్తుత కాలంలో మహిళలు ఇంటి బాధ్యతలతో పాటు ఆర్థికంగా కూడా రాణిస్తున్నారు. స్వయం ఉపాధి…
This website uses cookies.