Pattabhi Ram ఏపీ రాజకీయాలు మొన్నటి దాకా ఎంతలా అతలాకుతలం అయిపోయాయో చూశాం. ఏకంగా పరస్పర దాడుల దాకా వెళ్లాయి. అయితే అక్కడితో ఆగకుండా రాష్ట్రపతి పాలన అంటూ చంద్రబాబు ఏకంగా ప్రెసిడెంట్ను కలిసే వరకు ఏపీ పంచాయితీ వెల్లింది. కాగా అప్పటి దాకా కాస్త సైలెంట్ గా సాగిన రాజకీయాల్లో ఒక్క పదం పెను ప్రకంపనలు సృష్టించింది. ఆయనెవరో కాదు టీడీపీ నేత పట్టాభి మాట్లాడుతూ సీఎం జగన్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాలు ఇప్పటికీ అట్టుడుకుతూనే ఉన్నాయి.
కాగా ఈ విధమైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పట్టాభిరామ్ పై కేసులు నమోదు చేసిన విషయం కూడా విదితమే. ఆయన్ను రిమాండ్కు కూడా తరలించారు. కానీ కోర్టునుంచి బెయిల్ వచ్చిన తర్వాత అసలు పట్టాభి ఎక్కడున్నారనే వాదన మొదలైంద.ఇ శనివారం సాయంత్రం పట్టాభిరామ్ బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత నేరుగా హనుమాన్ జంక్షన్ వద్దకు వెళ్లి అక్కడే ఉన్న ఆంజనేయస్వామి విగ్రహానికి పూజలు చేసి వేడుకున్నారు. ఆ తర్వాత విజయవాడకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
ఇక ఇంటికి చేరుకోకపోవడంతో పోలీసులు మరోసారి పట్టాభిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అయ్యాయి. కానీ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయలేదని తెలుస్తోంది. ఆయనే మళ్లీ అరెస్టు చేస్తారనే భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలుస్తోంది. ఇందుకు నిదర్శనం పట్టాభి మాల్దీవులకు వెల్తుండగా ఎయిర్ పోర్టు వద్ద కనిపించిన ఫొటోలు ఉన్నాయి. అలాగే ఆయన విమానంలో కూర్చున్నట్టు కొన్ని ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ఆయన మాల్దీవ్స్ వెళ్లారని క్లియర్గా స్పష్టం అవుతోంది. మరి ఆయన ఎందుకు రహస్యంగా వెళ్తున్నారనేది క్లియర్గా తెలీదు. అయితే ఆయన ఇలా సడెన్ టూర్ వెనక ఏదో ఒక బలైమన కారణం ఉండే ఉంటుందని భావిస్తున్నారు అంతా కూడా. చూడాలి మరి మున్ముందు ఏం జరుగుతుందో.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.