Categories: ExclusiveNews

Heat Waves : విల‌విలలాడుతున్న జనం.. 2 గంటల్లోనే 16 మంది మృతి !

Heat Waves : జ‌నాలు ఎండ‌ల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.రాష్ట్రంలో అగ్ని నక్షత్రం ఎండలు పరిసమాప్తమైనా మరో మూడు రోజులు ఎండలు విపరీతంగా ఉంటాయని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది వేసవి ప్రభావం పెద్దగా లేదని జనం సంతోష పడుతుండగానే మళ్లీ వడగాలులు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొని ఉంది. పగటి ఉష్ణోగ్రతలలో పెరుగుదల ఉంది. ఎండ వేడి, ఉక్కపోతలతో జనం అల్లాడిపోతున్నారు.  బీహార్‌లో ఎండలకు వడదెబ్బతో ఒక్క రెండు గంటల్లోనే 16 మంది మృతి చెందారు. . రాత్రి సమయాల్లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం లేదు.రుతుపవనాల రాష్ట్రాన్ని తాకే వరకు ఇదే పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ సూచిస్తోంది.

Heat Waves భ‌య‌పెట్టిస్తున్న వ‌డ‌గాలులు..

రోహిణి కార్తె ప్రభావంతో ఎండ తీవ్రత పెరిగింది. మరో మూడు రోజుల పాటు ఇదే రకమైన వాతవరణం ఉంటుందని ఐఎండి అంచనా వేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం ఎండ ప్రభావం చూపనున్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.

Heat Waves : విల‌విలలాడుతున్న జనం.. ఠారెత్తిస్తున్న ఎండ‌లు ఎప్ప‌టి వ‌ర‌కు అంటే..!

ఇప్పటికే ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికి రానున్న రెండు రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, వడగాల్పుల ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ చెప్పింది. తెలంగాణలో గురువారం పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా బీమారంలో 47.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేంద్రంలో 46.8డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో 46.7డిగ్రీలు, ఆసిఫాబాద్‌ జిల్లా కుంచవెల్లిలో 46.6డిగ్రీలు, కాగజ్‌నగర్‌, ఖమ్మం జిల్లా పమ్మిలో 46.5డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా ముత్తారం, కొత్తగూడెం జిల్లా ఏడూళ్లబయ్యారంలో 46.4డిగ్రీల ఉష్ణోగ్రతలు నమొదయ్యాయి. వికారాబాద్‌ జిల్లా బంగంపల్లిలో చంద్రయ్య, సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలో జనార్థన్, కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్‌పల్లిలో ఎల్లయ్య వడగాల్పులకు మృతి చెందారు.

Recent Posts

Tea |టీ తాగుతూ సిగ‌రెట్ కాలిస్తే ఇక అంతే.. ఈ విష‌యాలు త‌ప్ప‌క తెలుసుకోండి.

Tea | కొంతమంది కొంచెం "స్టైల్" కోసం, మరికొందరు అలవాటుగా... సిగరెట్ కాలుస్తూ, ఒక చేతిలో టీ కప్పుతో ఎంతో…

26 minutes ago

Health Tips | యాలకులు .. కేవలం రుచి కోసమే కాదు, ఆరోగ్యానికి కూడా ఓ అద్భుత ఔషధం!

Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…

1 hour ago

Hanuman phal | ఈ పండు గురించి మీకు తెలుసా.. ఇది తింటే స‌మస్య‌ల‌న్నీ మాయం

Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…

2 hours ago

Vinayaka | వినాయక చవితి నాడు గ‌ణ‌పతికి ప్రియ‌మైన ఆకు కూర ఏంటంటే..!

Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…

3 hours ago

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

12 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

13 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

14 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

16 hours ago