Home » News » People Flouts Social Distancing Rules In Old City Hyderabad
News

Hyderabad : లాక్ డౌన్ అని తెలియగానే.. రోడ్ల మీదికి గుంపులుగా వచ్చి..?

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: May 12, 2021, 10:00 am
Advertisement

Hyderabad : తెలంగాణలో ఈరోజు నుంచి అంటే మే 12 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఏ ఒక్కరూ ఉదయం 10 దాటితే బయటికి వెళ్లడానికి లేదు. ఒకవేళ అత్యవసర పరిస్థితి వస్తే తప్ప.. బయటికి వెళ్లకూడదు. లాక్ డౌన్ ను 10 రోజుల పాటు అమలు చేయనున్నారు. ఉదయం 6 నుంచి ఉదయం 10 గంటల వరకు మాత్రమే లాక్ డౌన్ సడలింపు ఉంటుంది. మిగితా 20 గంటలు లాక్ డౌన్ అమలులో ఉండనుంది. ఉదయం 6 నుంచి ఉదయం 10 వరకు మాత్రమే.. నిత్యావసర సరుకులు, ఇతర పనులను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఉదయం 10 దాటితే షాపులు అన్నీ మూతపడనున్నాయి.

Advertisement

people flouts social distancing rules in old city hyderabad

తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధిస్తున్నాం అని ప్రకటించిందో లేదో.. హైదరాబాద్ పాతబస్తీలో ఇదీ పరిస్థితి. గుంపులు గుంపులుగా పాతబస్తీ వాసులు రోడ్ల మీదికి వచ్చారు. మార్కెట్ కి వచ్చి తమకు కావాల్సినవి కొనుక్కొని వెళ్లారు. అయితే.. ఏమాత్రం కూడా సోషల్ డిస్టెన్స్ పాటించకుండా.. ఏమాత్రం కరోనా భయం లేకుండా పాతబస్తీ వాసులు రోడ్ల మీదికి ఇలా గుంపులు గుంపులుగా రావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.

Advertisement

people flouts social distancing rules in old city hyderabad

Hyderabad : ప్రజలు ఏమాత్రం కరోనా నియంత్రణకు సహకరించడం లేదు

ఓవైపు కరోనా ఇంతలా భయపెడుతుంటే.. రోజురోజుకూ కరోనా విపరీతంగా పెరిగిపోతుంటే.. ప్రజలు మాత్రం కరోనాను చాలా లైట్ తీసుకుంటున్నారు అనడానికి ఈ ఘటనే ఉదాహరణ. చార్మినార్ ప్రాంతంలో పాతబస్తీలో ప్రజలు ఒక్కసారిగా రోడ్ల మీదికి గుంపులు గుంపులుగా వచ్చి షాపింగ్ చేశారు. లాక్ డౌన్ ఉంటుంది అనగానే.. ఇలా గుంపులు గుంపులుగా రోడ్ల మీదికి వస్తే.. కరోనా పెరగకుండా ఇంకా తగ్గుతుందా? అని నిపుణులు ఆవేదన వ్యక్తం చేశారు. లాక్ డౌన్ ఉన్నా.. ఉదయం 6 నుంచి 10 వరకు సడలింపు ఉంటుందని..  ఆసమయంలో కావాల్సిన వస్తువులు కొనుక్కోవాలి కానీ.. ఇలా ఒక్కసారిగా రోడ్ల మీద గుంపులు గుంపులుగా తిరిగితే.. కరోనా ఎలా తగ్గుతుంది.. అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

people flouts social distancing rules in old city hyderabad

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి