
Rahul Gandhi Unhappy on Revanth reddy
తెలంగాణలో కాంగ్రెస్కు కొత్త ఉత్సాహం తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇందుకోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. గిరిజన, దళిత దండోరా సభల పేరుతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత మేర నూతనోత్సాహం తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఇదే ఊపును కొనసాగించాలని భావించిన రేవంత్ రెడ్డి.. బీజేపీ, టీఆర్ఎస్కు ధీటుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కొనసాగించాలని ప్లాన్ చేశారు.
ఈ కార్యక్రమాలకు తమ పార్టీ జాతీయ నాయకులను.. అందులోనూ రాహుల్ గాంధీని తీసుకురావాలని గట్టిగానే ప్రయత్నించారు. నిజానికి తెలంగాణ విమోచన దినోత్సవమైన సెప్టెంబర్ 17న వరంగల్లో దళిత, గిరిజన దండోరా సభను ఏర్పాటు చేసి.. ఆ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించాలని రేవంత్ రెడ్డి అండ్ టీమ్ భావించింది. ఇందుకు సంబంధించి ఆయన సమయాన్ని కూడా కోరింది. ఆ రోజు తెలంగాణలో బీజేపీ పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తుందని.. వాటికి ధీటుగా కాంగ్రెస్ కూడా భారీ సభను ఏర్పాటు చేస్తే బాగుంటుందని రేవంత్ రెడ్డి భావించారు.
Rahul Gandhi Unhappy on Revanth reddy
ఇందుకు సంబంధించి ప్రతిపాదనలను కూడా కాంగ్రెస్ హైకమాండ్కు పంపారు. రాహుల్ గాంధీతో సభను ఏర్పాటు చేయించాలని యోచించారు. కానీ ఈ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీంతో సెప్టెంబర్ 17న గజ్వేల్లో కాంగ్రెస్ సారథ్యంలోని నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే వచ్చేలా ఏర్పాట్లు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. నిజానికి తెలంగాణలో బీజేపీకి చెక్ చెప్పేలా కాంగ్రెస్ కార్యక్రమాలు ఉండాలని రేవంత్ రెడ్డి భావించారు. తెలంగాణపై బీజేపీ గట్టిగా ఫోకస్ చేయడంతో.. అంతేస్థాయిలో కాంగ్రెస్ కూడా దూకుడుగా ముందుకు సాగాలని భావించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని రాహుల్ గాంధీ పర్యటించాలని భావించారు.
malkajgiri congress mp revanth reddy
రాహుల్ వస్తే, జోష్..రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తే.. కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరుగుతుందని రేవంత్ రెడ్డి అండ్ టీమ్ అంచనా వేసింది. అదే సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ కూడా తెలంగాణపై సీరియస్గా దృష్టి పెట్టిందనే సంకేతాలు ప్రజల్లోకి వెళతాయని భావించింది. కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఈ విషయంలో ఏ రకంగా ఆలోచిస్తోందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. కాంగ్రెస్ సంగతి ఇలా ఉంటే.. సెప్టెంబర్ 17న బీజేపీ నిర్మల్లో తలపెట్టిన సభకు ఆ పార్టీ ముఖ్యనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఆయన సభలో కీలక ప్రకటన చేస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి రాహుల్ గాంధీని రాష్ట్రానికి తీసుకొచ్చి భారీ సభ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసిన రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించనట్టే కనిపిస్తోంది.
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
This website uses cookies.