
Rahul Gandhi Unhappy on Revanth reddy
తెలంగాణలో కాంగ్రెస్కు కొత్త ఉత్సాహం తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇందుకోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. గిరిజన, దళిత దండోరా సభల పేరుతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత మేర నూతనోత్సాహం తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఇదే ఊపును కొనసాగించాలని భావించిన రేవంత్ రెడ్డి.. బీజేపీ, టీఆర్ఎస్కు ధీటుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కొనసాగించాలని ప్లాన్ చేశారు.
ఈ కార్యక్రమాలకు తమ పార్టీ జాతీయ నాయకులను.. అందులోనూ రాహుల్ గాంధీని తీసుకురావాలని గట్టిగానే ప్రయత్నించారు. నిజానికి తెలంగాణ విమోచన దినోత్సవమైన సెప్టెంబర్ 17న వరంగల్లో దళిత, గిరిజన దండోరా సభను ఏర్పాటు చేసి.. ఆ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించాలని రేవంత్ రెడ్డి అండ్ టీమ్ భావించింది. ఇందుకు సంబంధించి ఆయన సమయాన్ని కూడా కోరింది. ఆ రోజు తెలంగాణలో బీజేపీ పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తుందని.. వాటికి ధీటుగా కాంగ్రెస్ కూడా భారీ సభను ఏర్పాటు చేస్తే బాగుంటుందని రేవంత్ రెడ్డి భావించారు.
Rahul Gandhi Unhappy on Revanth reddy
ఇందుకు సంబంధించి ప్రతిపాదనలను కూడా కాంగ్రెస్ హైకమాండ్కు పంపారు. రాహుల్ గాంధీతో సభను ఏర్పాటు చేయించాలని యోచించారు. కానీ ఈ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీంతో సెప్టెంబర్ 17న గజ్వేల్లో కాంగ్రెస్ సారథ్యంలోని నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే వచ్చేలా ఏర్పాట్లు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. నిజానికి తెలంగాణలో బీజేపీకి చెక్ చెప్పేలా కాంగ్రెస్ కార్యక్రమాలు ఉండాలని రేవంత్ రెడ్డి భావించారు. తెలంగాణపై బీజేపీ గట్టిగా ఫోకస్ చేయడంతో.. అంతేస్థాయిలో కాంగ్రెస్ కూడా దూకుడుగా ముందుకు సాగాలని భావించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని రాహుల్ గాంధీ పర్యటించాలని భావించారు.
malkajgiri congress mp revanth reddy
రాహుల్ వస్తే, జోష్..రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తే.. కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరుగుతుందని రేవంత్ రెడ్డి అండ్ టీమ్ అంచనా వేసింది. అదే సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ కూడా తెలంగాణపై సీరియస్గా దృష్టి పెట్టిందనే సంకేతాలు ప్రజల్లోకి వెళతాయని భావించింది. కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఈ విషయంలో ఏ రకంగా ఆలోచిస్తోందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. కాంగ్రెస్ సంగతి ఇలా ఉంటే.. సెప్టెంబర్ 17న బీజేపీ నిర్మల్లో తలపెట్టిన సభకు ఆ పార్టీ ముఖ్యనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఆయన సభలో కీలక ప్రకటన చేస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి రాహుల్ గాంధీని రాష్ట్రానికి తీసుకొచ్చి భారీ సభ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసిన రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించనట్టే కనిపిస్తోంది.
Ananya Nagalla : అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న మూవీ "లీసా". ఈ చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ),…
High Court : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. రాష్ట్ర హైకోర్టులో వివిధ…
Students : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం మరొక ముఖ్యమైన అడుగు వేసింది. ఇప్పటికే విద్యార్థుల విద్య, ఆరోగ్యం,…
YSR : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతున్నాయి. ఒకవైపు యుద్ధాలు మరోవైపు పెరిగిపోతున్న ధరల వల్ల సామాన్యుడు గ్యాస్…
Summer Drinks : ఎండలు రోజురోజుకూ తీవ్రంగా మారుతున్న ఈ కాలంలో ప్రజలు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపుతున్నారు.…
Ajwain Water : మన వంటింట్లో ఉండే సాధారణ పోపు దినుసుల్లో వాముకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పూర్వం నుంచి…
Curry Leaves : మన వంటగదిలో కరివేపాకు లేకుండా వంట పూర్తి కావడం కష్టం. ప్రతి కూరలోనూ, పప్పులోనూ ఇది…
Supreme Court : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యం…
Dhurandar-2 : ధురంధర్ ది రివేంజ్ చిత్రం విడుదలైన నాలుగు వారాలు పూర్తవుతున్నా కూడా బాక్సాఫీస్ వద్ద అదే జోష్…
Ys Jagan Modi : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న…
El Nino Summer : ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా వచ్చే వేసవి కాలం వేరు, కానీ ఇప్పుడు మనం…
Chanikiya Niti : హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి జరగబోయే సన్రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్…
This website uses cookies.