Farmers : రైతు బంధు నిధుల కోసం ఎంతగానో ఎదురు చూసిన అన్నదాతలు ఇప్పుడు నిరాశకు గురవుతున్నారు. రాష్ట్రంలో రైతుబంధు నిధుల చెల్లింపులు నత్త నడకన సాగుతున్నాయి. గత డిసెంబరు 28న రైతుబంధు నగదు బదిలీ ప్రారంభం కాగా.. ఇంత వరకు ఏ జిల్లాలో కూడా చెల్లింపులు పూర్తి కాలేదు. రైతు బంధు పథకానికి నిధుల కొరత రావడంతోనే.. చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అనేక జిల్లాల ట్రెజరీలలో ఇప్పుడు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ముందుగా ఒక ఎకరం వరకు ఉన్న రైతులకు చెల్లింపులు జరిపి.. అనంతరం ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ నుంచి 17ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు సంబంధించిన బిల్లులు, వివరాలు, బ్యాంకు అకౌంట్లు సమర్పించారు. కానీ ఏడెకరాల వరకు ఉన్న రైతులకే చెల్లింపులను జరిపారు. ఆ తర్వాత ఇక 2 వారాలుగా చెల్లింపులు నిలిపివేశారు.
చెల్లింపులపై రైతుల నుంచి విమర్శలు వస్తుండటంతో.. బ్యాంకులకు సెలవులు ఉండటంతోనే రైతుబంధు చెల్లింపులకు విరామం ఇచ్చామని వారం రోజుల క్రితం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఇటీవల ప్రకటించారు. అయితే బ్యాంకులకు కేవలం 4 రోజులు మాత్రమే సెలవులు కాగా.. నిధుల కొరతే చెల్లింపుల్లో జాప్యం జరగడానికి అసలు కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి.
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.