Ram Charan : అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ బాలీవుడ్లో తన సత్తా చాటి ఇప్పుడు టాలీవుడ్లో అడుగుపెట్టింది. ముందుగా ఎన్టీఆర్తో కలిసి దేవర అనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత రామ్ చరణ్ మూవీకి కూడా సైన్ చేసింది. ప్రస్తుతం దేవరలో నటిస్తున్న జాన్వీ త్వరలో చరణ్తో కలిసి బుచ్చిబాబు సన దర్శకత్వంలో క్రేజీ పాత్ర చేయనుందట. అయితే అప్పట్లో చిరంజీవి- శ్రీదేవి కలిసి జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రం చేయగా, అది సూపర్ హిట్ అయింది. ఇప్పుడు వారి పిల్లలు రామ్ చరణ్- జాన్వీ కపూర్ కలిసి చేయనున్న చిత్రం కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు. మరోవైపు చరణ్, జాన్వీ కలిసి జగదేకవీరుడు అతిలోక సుందరి పార్ట్2 చేస్తే మాత్రం బాక్సాఫీస్ బద్దలు అయిపోతాయని అంటున్నారు. అయితే దీనిపై తాజాగా చిరు స్పందించారు.
సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో పాల్గొన్న చిరంజీవిన బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ రాజీవ్ మసంద్ ఆయన్ని ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మాస్ కమర్షియల్ చిత్రాలలో అభిమానులు నన్ను చూడడానికి ఎంతో ఇష్టపడతారు. రుద్రవీణ మూవీ వలన నాకు మంచి పేరొచ్చింది. కానీ నిర్మాతగా ఉన్న నా తమ్ముడు నాగబాబు మాత్రం చాలా నష్టపోయాడు అని చిరంజీవి చెప్పారు. ఇక ఎస్పీ బాలసుబ్రమణ్యం ఒకసారి నాకు దంగల్ వంటి చిత్రాలు చేయవచ్చుగా అని సలహా ఇచ్చారు. అప్పుడు నేను నిర్మాతలు నష్టపోతారని చెప్పాను. మాస్ కమర్షియల్ చిత్రాలు మాత్రమే నా నుండి కోరుకుంటున్నారు. డాన్సులు, ఫైట్స్, ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయని చిరు స్పష్టం చేశారు.
ఇక జాన్వీ కపూర్-చరణ్ జగదేకవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 చేస్తే చూడాలని ఉందనే కోరిక కూడా బయటపెట్టాడు చిరంజీవి.ఇటీవల జాన్వీని చూసిన వెంటనే శ్రీదేవి గుర్తుకు వచ్చింది. భావోద్వేగానికి గురయ్యాను. శ్రీదేవి లాంటి మంచి నటిని సినిమా పరిశ్రమ కోల్పోవడం విషాదకరం. అయితే రామ్ చరణ్- జాన్వీ కపూర్ జగదేకవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 చేస్తే చూడాలని ఉంది. అది నా కోరిక… అంటూ చిరంజీవి మనసులోని మాటని బయటపెట్టారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.