
romours on prashanth kishore and telangana cm kcr tie up
kcr : ప్రశాంత్ కిషోర్ దేశ రాజాకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నారు. తను ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం తనదే అన్న రీతిలో ఇప్పటికే దేశ వ్యాప్తంగా అతని పేరు మారుమోగుతోంది. పీకే రాజకీయ వ్యూహకర్తగా సేవలందించిన ప్రతి పార్టీ… అధికారంలోకి వస్తూ ఉండటంతో ఆయనకు డిమాండ్ భారీ స్థాయిలో పెరుగుతూ వస్తోంది. ప్రశాంత్ కిషోర్ ను నమ్మి… ఆయనను అనుసరిస్తే తప్పకుండా అధికారంలోకి వస్తామనే అభిప్రాయం అన్ని రాజకీయ పార్టీలలోనూ నెలకొంది. ఏపీ లో జగన్ తో కలిసి తెలుగు దేశం పార్టీని చావుదెబ్బ కొట్టి వైసీపీ కి గ్రాండ్ విక్టరీని అప్పగించిన ఘనత కూడా ప్రశాంత్ కిషోర్ దే. మొన్నటికి మొన్న పశ్చిమ బెంగాల్ లో మోడీతో ఢీ కొట్టిన దిదీ చెంత చేరి ఆమెకు కూడా విజయాన్ని కట్ట బెట్టిన తీరు అద్భుతమనే చెప్పాలి. అయితే ఇప్పుడు మనం ఇంతలా పీకే గురించి ఎందుకు చర్చించుకోవాల్సి వచ్చిందంటే… తెలంగాణ సీఏం కేసీఅర్ కూడా ఇప్పుడు పీకే తో చేతులు కలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
romours on prashanth kishore and telangana cm kcr tie up
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ తో కలవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఈ మేరకు ఇరువురి మధ్య ఒప్పందం కూడా జరిగినట్లు సమాచారం. భాజపా వ్యతిరేక పార్టీలకు మద్దతుగా రాజకీయ వ్యూహాలు అందించేందుకు ఆసక్తిగా ఉండే పీకే కూడా కేసీఆర్ తో దోస్తికి చేతులు కలిపారని పలువురు రాజకీయ ప్రముఖులు అంటున్నారు. తెరాసకు అనుకూలంగా పీకే బృందం పని చేయబోతోందని గతంలో ఒకటి రెండు సార్లు ప్రచారం జరిగింది. మళ్ళీ ఇటీవల ఢిల్లీ పర్యటనల్లో కూడా కేసీఆర్ ప్రశాంత్ తో భేటీ అయ్యారని భాజపా నేతలు అంటున్నారు. ఆయన సలహాలతోనే సీఏం విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా తిట్ల రాజకీయం చేస్తున్నారని భాజపా ఎమ్మెల్యే రఘునందనరావు ఆరోపిస్తున్నారు.
తమిళనాడులో స్టాలిన్ కు సైతం విజయం అందించిన ప్రశాంత్.. ఏపీలో కూడా వైసీపీకి అండగా నిలుస్తున్నారు. అక్కడ ప్రతిపక్షం ఎంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటుందో చూస్తూనే ఉన్నాం. కేసిఆర్ కూడా పీకే మార్క్ రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారన్న విషయం తెలంగాణ రాజకీయాల్లో సహజంగానే వ్యక్తమవుతోంది. ఏదీ ఏమైనప్పటికీ అన్ని పక్కన పెడితే ఏపీలో ఎదురైనట్టే తెలంగాణలోనూ రాజకీయాలు మరింత దిగజారిపోతాయా అన్న అనుమానం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
CM Revanth Reddy Uppal : హైదరాబాద్ నగర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం మరింత వేగం పెంచుతోంది. ముఖ్యంగా నగర…
Miyapur : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సోమవారం మియాపూర్లో పలు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపన…
Gachibowli : హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో చోటుచేసుకున్న యువతి మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కో-లివింగ్ హాస్టల్లో నివసిస్తున్న…
Hanuman Nagar Colony Association : ఉప్పల్ జూన్ 7 : హనుమాన్ నగర్ కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ…
Farmers : వ్యవసాయం అంటే చాలా మందికి ఇప్పటికీ వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి వంటి సంప్రదాయ పంటలే గుర్తుకు…
LPG Gas Cylinder : దేశవ్యాప్తంగా ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ సామాన్య ప్రజలపై భారం మోపుతున్న తరుణంలో,…
Bigg Boss Telugu 10 : తెలుగు బుల్లితెరపై అత్యధిక ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో ‘బిగ్ బాస్ తెలుగు’…
Pawan Kalyan NDA : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న వేళ,…
41st Wedding Anniversary : సాధారణంగా ఉపాధిహామీ పనుల ప్రదేశాల్లో కూలీలు ఎండను తట్టుకుంటూ కష్టపడి పనిచేస్తుంటారు. రోజువారీ శ్రమ…
OnePlus 11 5G : ప్రీమియం స్మార్ట్ఫోన్ కొనాలని ఆలోచిస్తున్న వారికి ఇది నిజంగా శుభవార్తే. ఫ్లాగ్షిప్ ఫీచర్లతో మార్కెట్లో…
Ration Card : దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ప్రాధాన్యత సంతరించుకుంటున్న వేళ, రేషన్…
Peddi Box Office Collection Day 3 : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం…
This website uses cookies.