మానవత్వం మంటగలిసింది. అభం శుభం తెలియని చిన్నారిపై హత్యాచారం జరిగినా, కనీసం స్పందించలేని దుస్థితి. ఘటన వివరాలు తెలిపి, తమ డ్యూటీ చేశామని విర్రవీగుతోన్న జర్నలిజం పెద్దలకు .. కనీసం నిందితుడ్ని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ చేయాలన్న తలంపు కూడా రాకపోవడాన్ని ఏమనాలి.. అదే సమయంలో నటుడు సాయి థరమ్ తేజ్ ప్రమాదాన్ని చిలువలుపలువలుగా వర్ణించి, దానిపై గంటకో హెల్త్ బులెటిన్లు ఇస్తోన్న మీడియా తీరు సర్వత్రా మరోసారి చర్చకు కారణమవుతోంది. రేటింగ్స్ .. వ్యూవర్ షిప్ కోసం ఏంచేసేందుకైనా వెనకాడని మీడియాకు ..
shame-on-media
పాలుగారే పసిపాప .. కన్నీటి వేదన కనిపించకపోవడం శోచనీయం.. కనీసంలో కనీసంగానైనా నిందితుల్ని పట్టుకుని, శిక్షించాలని డిమాండ్ చేయకపోవడం.. కన్నా దారుణం మరొకటి ఉంటుందా.. సమాజంలో పెల్లుబికుతున్న ఇటువంటి వక్రపోకడల్ని తమ గళం ద్వారా అడ్డుకట్ట వేయాల్సిన సమాచార సంస్థలు.. మూగనోము పట్టడం దేనికి సంకేతమన్న ప్రశ్న వెల్లువెత్తుతోంది. సమాజ బాధ్యతల్ని తన భుజాలపై ఎత్తుకున్నమీడియా ..ఇప్పుడెందుకు సైలెంట్ అవుతోంది. ఏమీ తెలియని పసిమొగ్గ జీవితాన్ని చిదిమేసిన కంటకుడ్ని బహిరంగంగా ఉరి తియ్యాలని నినదించాల్సిన మీడియా.. మౌనవ్రతానికి కారణాలేమిటి.. ఈ సమస్య మీడియా పెద్దలదా.. లేక కనీసం సామాజిక స్పృహ లేకుండా, జీతం డబ్బులకు పనిచేసే వారిదా..
గతంలో ఇటువంటి ఘటనలపై ఏకతాటిపై నినదించిన మీడియా .. రేటింగుల బాట పట్టడం ఎంతవరకు సమంజసం.. కనీసపు విలువల్ని కూడా సమాచార సంస్థలు పాటించలేనంత దుస్థితి తలెత్తిందా.. ముక్కుపచ్చలారని పసిపాప.. నరకయాతన కనిపించడం లేదా.. సమాజంలో మీడియాకు ఉన్న గౌరవం.. అప్పనంగా ఇచ్చింది కాదన్న విషయాన్ని ముందు మీడియా పెద్దలు గుర్తించాలి.. చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే, గన్ను కన్నా పెన్ను ఎంత గొప్పదో అర్థమవుతుంది. స్వాతంత్ర్య పోరాటంలో మహామహులకు ఆలంబనగా మారిన మీడియా .. ఇప్పుడు కనీస స్పందన లేకుండా పోవడం .. ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. సమాజ హితానికి పాటుపడుతూ, సమాజ శ్రేయస్సే తమ పరమావధిగా బతికిన మీడియా ఇప్పుడు కనీస విలువలు కోల్పోతోందన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది.
మానవత్వాన్నిపాదుకొల్పేలా.. సాగిన కథనాలు.. ఎందుకు మూగనోము పడుతున్నాయి..? సమస్యల్ని వెలికితీస్తూ, మానవీయ కోణంలో వీక్షించే దృష్టిని మీడియా కోల్పోయిందా..? సమాజంలో జరుగుతోన్న ఘటనల్ని నిత్యం అందించే మీడియా.. కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించడంపై సర్వత్రా నిరసనలు రేగుతున్నాయి.. సెలబ్రెటీల వార్తలే ప్రామాణికంగా.. సామాన్యుల ప్రాణాలు తృణప్రాయంగా భావించే మీడియా తీరుపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జర్నలిజం పోకడలు మారుతున్నాయి.. లేటెస్ట్ టెక్నాలజీలు వస్తున్నాయి.. కానీ కనీసపు విలువల్ని మాత్రం కోల్పోకూడదన్న వాదన గళమెత్తే రోజు రానుంది..
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
This website uses cookies.