shame-on-media
మానవత్వం మంటగలిసింది. అభం శుభం తెలియని చిన్నారిపై హత్యాచారం జరిగినా, కనీసం స్పందించలేని దుస్థితి. ఘటన వివరాలు తెలిపి, తమ డ్యూటీ చేశామని విర్రవీగుతోన్న జర్నలిజం పెద్దలకు .. కనీసం నిందితుడ్ని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ చేయాలన్న తలంపు కూడా రాకపోవడాన్ని ఏమనాలి.. అదే సమయంలో నటుడు సాయి థరమ్ తేజ్ ప్రమాదాన్ని చిలువలుపలువలుగా వర్ణించి, దానిపై గంటకో హెల్త్ బులెటిన్లు ఇస్తోన్న మీడియా తీరు సర్వత్రా మరోసారి చర్చకు కారణమవుతోంది. రేటింగ్స్ .. వ్యూవర్ షిప్ కోసం ఏంచేసేందుకైనా వెనకాడని మీడియాకు ..
shame-on-media
పాలుగారే పసిపాప .. కన్నీటి వేదన కనిపించకపోవడం శోచనీయం.. కనీసంలో కనీసంగానైనా నిందితుల్ని పట్టుకుని, శిక్షించాలని డిమాండ్ చేయకపోవడం.. కన్నా దారుణం మరొకటి ఉంటుందా.. సమాజంలో పెల్లుబికుతున్న ఇటువంటి వక్రపోకడల్ని తమ గళం ద్వారా అడ్డుకట్ట వేయాల్సిన సమాచార సంస్థలు.. మూగనోము పట్టడం దేనికి సంకేతమన్న ప్రశ్న వెల్లువెత్తుతోంది. సమాజ బాధ్యతల్ని తన భుజాలపై ఎత్తుకున్నమీడియా ..ఇప్పుడెందుకు సైలెంట్ అవుతోంది. ఏమీ తెలియని పసిమొగ్గ జీవితాన్ని చిదిమేసిన కంటకుడ్ని బహిరంగంగా ఉరి తియ్యాలని నినదించాల్సిన మీడియా.. మౌనవ్రతానికి కారణాలేమిటి.. ఈ సమస్య మీడియా పెద్దలదా.. లేక కనీసం సామాజిక స్పృహ లేకుండా, జీతం డబ్బులకు పనిచేసే వారిదా..
shame-on-media
గతంలో ఇటువంటి ఘటనలపై ఏకతాటిపై నినదించిన మీడియా .. రేటింగుల బాట పట్టడం ఎంతవరకు సమంజసం.. కనీసపు విలువల్ని కూడా సమాచార సంస్థలు పాటించలేనంత దుస్థితి తలెత్తిందా.. ముక్కుపచ్చలారని పసిపాప.. నరకయాతన కనిపించడం లేదా.. సమాజంలో మీడియాకు ఉన్న గౌరవం.. అప్పనంగా ఇచ్చింది కాదన్న విషయాన్ని ముందు మీడియా పెద్దలు గుర్తించాలి.. చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే, గన్ను కన్నా పెన్ను ఎంత గొప్పదో అర్థమవుతుంది. స్వాతంత్ర్య పోరాటంలో మహామహులకు ఆలంబనగా మారిన మీడియా .. ఇప్పుడు కనీస స్పందన లేకుండా పోవడం .. ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. సమాజ హితానికి పాటుపడుతూ, సమాజ శ్రేయస్సే తమ పరమావధిగా బతికిన మీడియా ఇప్పుడు కనీస విలువలు కోల్పోతోందన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది.
shame-on-media
మానవత్వాన్నిపాదుకొల్పేలా.. సాగిన కథనాలు.. ఎందుకు మూగనోము పడుతున్నాయి..? సమస్యల్ని వెలికితీస్తూ, మానవీయ కోణంలో వీక్షించే దృష్టిని మీడియా కోల్పోయిందా..? సమాజంలో జరుగుతోన్న ఘటనల్ని నిత్యం అందించే మీడియా.. కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించడంపై సర్వత్రా నిరసనలు రేగుతున్నాయి.. సెలబ్రెటీల వార్తలే ప్రామాణికంగా.. సామాన్యుల ప్రాణాలు తృణప్రాయంగా భావించే మీడియా తీరుపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జర్నలిజం పోకడలు మారుతున్నాయి.. లేటెస్ట్ టెక్నాలజీలు వస్తున్నాయి.. కానీ కనీసపు విలువల్ని మాత్రం కోల్పోకూడదన్న వాదన గళమెత్తే రోజు రానుంది..
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.