Sidhu Moose Wala : చచ్చిపోయాక కూడా కోట్లలో సంపాదిస్తున్నాడు..!!
Sidhu Moose Wala : గతేడాది మే 29న పాపులర్ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా దుండగుల చేతుల్లో దారుణంగా చంపబడ్డాడు. అయితే ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన పాటలు బాగా పాపులర్ అవుతున్నాయి. అయితే తాజాగా ఏప్రిల్ 7న సిద్దు కొత్త పాట విడుదలైంది యూట్యూబ్ లో విడుదలైన ఈ పాట ఐదు గంటల్లోనే ఐదున్నర మిలియన్ల పైగా వ్యూస్ పొందింది. 29 ఏళ్ల వయసులోనే సిద్దు మరణించినప్పటికీ ఆయన తన ఫ్యాన్ ఫాలోయింగ్ ద్వారా యూట్యూబ్ డీల్ రాయల్టీల ద్వారా కోట్లు సంపాదించగలిగాడు. ఇక ఆయన ఆస్తులు అన్నింటిని తమ కుటుంబ సభ్యులకు బదిలీ చేశారు.
Sidhu Moose Wala earn crores of money after demise
సిద్దు చనిపోయే నాటికి ఆస్తుల విలువ దాదాపుగా 100 కోట్ల కన్నా ఎక్కువగా ఉంటుంది. లగ్జరీ కార్లు, ఇతర ఖరీదైన వస్తువులు ఉన్నట్లు తెలుస్తోంది. సిద్ధూ మూసేవాలా లైవ్ షో, కచేరి లాంటి వాటికి దాదాపుగా 20 లక్షలు, పబ్లిక్ షోకు రెండు లక్షల వరకు తీసుకుంటాడని సమాచారం. చిన్న వయసులోనే గాయకుడిగా ప్రసిద్ధి చెందిన మూసేవాలా ఆయన చనిపోయిన తర్వాత యూట్యూబ్ ఛానల్ సంపాదిస్తుంది. యూట్యూబ్లో ఒక వీడియో లేదా ఒక పాటకు మిలియన్ లలో వ్యూస్ వస్తే యూట్యూబ్ దానికి వెయ్యి డాలర్లు ఇస్తుంది.
