Sreshte Organic Farming Success Story : ఐటీ ఉద్యోగాలు వదిలి సేంద్రియ వ్యవసాయం వైపు.. ఏటా రూ.90 లక్షల టర్నోవర్తో దూసుకుపోతున్న దంపతులు..!
Sreshte Organic Farming Success Story ప్రస్తుత రోజుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం IT Job సాధించడం, కార్పొరేట్ రంగంలో స్థిరపడటం చాలామంది కల. కానీ, లక్షలు జీతం వచ్చే ఆ ఉద్యోగాలను వదిలేసి, సమాజానికి మంచి ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో సేంద్రియ వ్యవసాయం Organic Farming వైపు అడుగులు వేశారు ఓ దంపతులు. ఏకంగా ఏడాదికి రూ.90 లక్షల ఆదాయం సృష్టిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వారే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన కోటినాగ మణికంఠ, నాగ వెంకట దుర్గా పావని. వారు స్థాపించిన సంస్థే ‘శ్రేష్ఠె’ Sreshte.
Sreshte Organic Farming Success Story : ఐటీ ఉద్యోగాలు వదిలి సేంద్రియ వ్యవసాయం వైపు.. ఏటా రూ.90 లక్షల టర్నోవర్తో దూసుకుపోతున్న దంపతులు..!
Sreshte Organic Farming Success Story కార్పొరేట్ ఆఫీసుల నుంచి పొలం గట్ల వైపు..
మణికంఠ, పావని ఇద్దరూ బీటెక్ గ్రాడ్యుయేట్లు. మణికంఠ ఇన్ఫోసిస్లో, పావని యాక్సెంచర్లో మంచి జీతాలతో ఉద్యోగాలు చేసేవారు. అయితే, ఐటీ సెక్టార్లో పనిచేసే తమ తోటి ఉద్యోగులు వ్యాయామం లేని జీవనశైలి, కల్తీ ఆహారం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడటాన్ని వారు గమనించారు. ప్రజల ఆరోగ్యాల్లో మార్పు తేవాలంటే కల్తీ లేని సేంద్రియ ఆహారం అందించడమే సరైన మార్గమని వారు భావించారు. లాభాల కోసం కాకుండా, రైతులు, వినియోగదారుల శ్రేయస్సు కోసం సేంద్రియ వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు.
Sreshte Organic Farming Success Story వారాంతాల్లో శిక్షణ.. ‘శ్రేష్ఠె’కి అంకురార్పణ
వ్యవసాయంలో ఎలాంటి అనుభవం లేని ఈ దంపతులు, చెన్నైలో ఉద్యోగం చేస్తూనే వారాంతాల్లో తమ సొంత గ్రామమైన లచ్చన్నగుడిపూడి (గుంటూరు జిల్లా)కి వచ్చి ‘సుభాష్ పాలేకర్ నేచురల్ ఫార్మింగ్ SPNF’ విధానంలో శిక్షణ తీసుకున్నారు. 2017లో తమ ఐటీ కెరీర్ను పూర్తిగా వదిలేసి, రూ.17 లక్షల పెట్టుబడితో ‘శ్రేష్ఠె’ అనే ఆర్గానిక్ వెంచర్ను ప్రారంభించారు. మొదట్లో స్టోర్ లేకపోవడంతో, మణికంఠ స్వయంగా రైతుల నుంచి మామిడికాయలు, చిరుధాన్యాల పిండి, కందిపప్పు వంటి ఆర్గానిక్ ఉత్పత్తులను సేకరించి వినియోగదారుల ఇళ్లకు డెలివరీ చేసేవారు.
Sreshte Organic Farming Success Story : ఐటీ ఉద్యోగాలు వదిలి సేంద్రియ వ్యవసాయం వైపు.. ఏటా రూ.90 లక్షల టర్నోవర్తో దూసుకుపోతున్న దంపతులు..!
రైతులకు అండగా.. రెట్టింపు లాభాలు
రసాయనాలు లేని పద్ధతుల్లో పండించే రైతుల కోసం వీరు ఒక ‘బైబ్యాక్ మోడల్’ Buyback model తీసుకొచ్చారు. సాధారణ మార్కెట్ కంటే రైతులకు మంచి గిట్టుబాటు ధరను అందించారు. “గతంలో నా ఆర్గానిక్ మామిడికి మార్కెట్లో సరైన ధర రాక కేవలం రూ.2 లక్షలు మాత్రమే వచ్చేవి. కానీ శ్రేష్ఠెతో జతకట్టాక ఇప్పుడు ఒక్క సీజన్లోనే రూ.4 లక్షలు సంపాదిస్తున్నాను” అని కృష్ణా జిల్లాకు చెందిన రైతు మహా లక్ష్మణ్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వీరు 55 మంది రైతులతో కలిసి పనిచేస్తున్నారు. జీవామృతం, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి సహజ ఎరువులు వాడే ప్రభుత్వ గుర్తింపు పొందిన రైతుల ఉత్పత్తులనే వీరు కొనుగోలు చేస్తారు.
రెడీ-టు-ఈట్ ఉత్పత్తులు.. నెలకు రూ.7.5 లక్షల ఆదాయం
మణికంఠ స్వగ్రామం లచ్చన్నగుడిపూడిలో ఆయన తండ్రి సుబ్బారావు పర్యవేక్షణలో ప్రాసెసింగ్ యూనిట్ నడుస్తోంది. ప్యాకింగ్, డెలివరీలను గుంటూరులోని స్టోర్ ద్వారా ఈ దంపతులు దగ్గరుండి చూసుకుంటారు. వినియోగదారుల డిమాండ్ మేరకు ప్రస్తుతం వీరి వద్ద 160కి పైగా ఉత్పత్తులు ఉన్నాయి. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, సేంద్రియ బియ్యం, చిరుధాన్యాలతో చేసిన స్నాక్స్, బెల్లం స్వీట్లు, కప్ కేక్స్ వంటి ‘రెడీ టు ఈట్’ Ready-to-eat ఐటమ్స్ కూడా అమ్ముతున్నారు. క్వాలిటీ కోసం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా వ్యాక్యూమ్ ప్యాకింగ్ చేస్తారు.
Sreshte Organic Farming Success Story : ఐటీ ఉద్యోగాలు వదిలి సేంద్రియ వ్యవసాయం వైపు.. ఏటా రూ.90 లక్షల టర్నోవర్తో దూసుకుపోతున్న దంపతులు..!
గడిచిన ఐదేళ్లలో శ్రేష్ఠె వ్యాపారం అద్భుతంగా వృద్ధి చెందింది. నెలకు రూ.7.5 లక్షల ఆదాయంతో, ఏడాదికి రూ.90 లక్షల టర్నోవర్ సాధిస్తున్నారు. 10 మంది సిబ్బందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. కేవలం వ్యాపారంగా కాకుండా మంచి ఆహారం అందించాలన్నదే తమ లక్ష్యమని, త్వరలో ఆన్లైన్ స్టోర్ Online Store ద్వారా తమ ఉత్పత్తులను మరింత మందికి చేరువ చేస్తామని ఈ ఐటీ దంపతులు చెబుతున్నారు.