తల్లిదండ్రులు లేకపోవడంతో తన ప్రియుడిని ఇంటికి పిలిచిన ఓ యువతి తన ప్రియుడితో కలిసి అసభ్యకర భంగిమలో ఉండడం తన చెల్లెళ్లు చూశారు. ఈ విషయాన్ని తన చెల్లెళ్లు ఎక్కడ తల్లిదండ్రులకు చెబుతారో అని ప్రియుడితో కలిసి చెల్లెళ్లను హతమార్చింది. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు తన చెల్లెళ్లను ఎవరో చంపేశారు అని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ చివరకు పోలీసులకు చిక్కింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. బల్వాయి స్టేషన్ పరిధిలోని జోలాపూర్ అనే గ్రామానికి చెందిన అంజలి అనే యువతి స్థానికంగా ఉండే ఓ యువకుడిని ప్రేమిస్తుంది. ఇటీవల తన తల్లిదండ్రులు బయటికి వెళ్లిపోవడంతో ప్రియుడిని నేరుగా ఇంటికి పిలిపించుకుంది.
అతడితో సన్నిహితంగా ఉండగా 6, 4 సంవత్సరాల వయసున్న చెల్లెళ్లు చూశారు. దీంతో విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పేస్తారు అనే భయంతో ఇద్దరినీ పదునైన ఆయుధంతో హత్య చేసింది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు చెల్లెళ్లను ఎవరో చంపేశారు అని నమ్మించే ప్రయత్నం చేసింది. దీనిపై పోలీసులు విచారణ చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో అంజలి దుస్తులపై రక్తపు మరకలు ఉండడంతో పోలీసులు గుర్తించి ఆమెను ప్రశ్నించగా అసలు విషయాన్ని వెల్లడించింది. ఆమెకు సహకరించిన ప్రియుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అంజలిని అరెస్టు చేసి జైలుకు పంపారు.
తన ప్రియుడితో సుఖం కోసం ఏకంగా తన తోబుట్టువులను హతమార్చిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఇంతటి దారుణానికి వడిగట్టిన అంజలికి జీవిత ఖైదీ శిక్ష వేసిన సరిపోదు అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వాళ్లను ఏం చేసినా తప్పు లేదు అని సీరియస్ గా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కొంతమంది తమ స్వార్థం, సుఖం కోసం ఇలాంటి పనులు చేస్తూ సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నారు.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.