
Somu Veerraju placed is replaced by a new leader
AP BJP : ఏపీ బీజేపీ సారథిని మారుస్తారా ? సోము వీర్రాజు స్థానంలో కొత్త నేతకు పట్టం కడతారా? ఏపీలో బీజేపీని పరుగులు పెట్టించే నాయకుడి కోసం.. పార్టీ అధిష్టానం అడుగులు వేస్తోందా ? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఏపీ సారథిగా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు పగ్గాలు చేపట్టి ఏడాది దాటిపోయింది. ఈ ఏడాది కాలంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. కార్పొరేషన్ ఎన్నికలు కూడా వచ్చాయి. అయితే.. ఏ ఎన్నికలోనూ.. బీజేపీ పుంజుకున్న పరిస్థితి లేదు. అదే సమయంలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికను బీజేపీపెద్దలు సీరియస్గా తీసుకున్నారు.
Somu Veerraju placed is replaced by a new leader
ఈ క్రమంలో మాజీ ఐఏఎస్ రత్నప్రభను రంగంలోకి దింపారు. ఉప పోరుకు దాదాపు మూడు మాసాల ముందు నుంచి బీజేపీ నేతలంతా తిరుపతిలో మకాం వేసి.. గెలుపు గుర్రం ఎక్కేందుకు ప్రయత్నించింది. అయితే.. ఆ ఉప ఎన్నికలో కనీసం మార్కులు కూడా సంపాదించలేక పోయారు. ఇక, స్థానికంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో సోము వీర్రాజు నాయకత్వంపై, పార్టీ భవితపై కొన్నాళ్లుగా చర్చ సాగుతోంది. అదే సమయంలో సోము వీర్రాజు.. ప్రభుత్వాన్ని టార్గెట్ చేయకుండా.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీని టార్గెట్ చేయడం వల్ల.. అప్పటి వరకు క్షత్రియ, కమ్మ సామాజిక వర్గాల్లో బీజేపీపై ఉన్న సానుభూతి పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిందనే వాదన కూడా తెరమీదికి వచ్చింది. ఈ క్రమంలో సోము వీర్రాజు తన సొంత సామాజిక వర్గాన్నయినా.. బీజేపీవైపు మళ్లించారా ? ఈ విషయంలో అయినా సక్సెస్ అయ్యారా ? అంటే.. అది కూడా కనిపించడం లేదు.
ఒకటి రెండు సందర్భాల్లో రాష్ట్ర స్థాయి ఉద్యమానికి పిలుపు ఇచ్చినా.. నాయకులను ముందుండి నడిపించడంలోను, బలమైన వైసీపీకి చెక్ పెట్టేలా వ్యూహాలను అమలు చేయడంలోనూ బీజేపీ చతికిల పడిందనే వాదన ఉంది. ఇక, సోము వీర్రాజు ఏ నినాదం అందుకున్నా.. ఆయనను అనుసరించేవారు కూడా ఇటీవల కాలంలో తగ్గిపోయారు. దీంతో ఇక, సోము వీర్రాజును పక్కన పెట్టడం తప్ప బీజేపీ అధిష్టానం ముందు మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. దీంతో మరో ఆరేడు నెలల్లోనే సోము వీర్రాజును పక్కన పెట్టి.. కీలక నేతకు పగ్గాలు అప్పగించాలని బీజేపీ పెద్దలు ఆలోచన చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. గతంలో కమ్మ సామాజిక వర్గానికి, ఆ తర్వాత .. 2సార్లు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలకు బీజేపీ అధిష్టానం ఏపీలో పగ్గాలు అప్పగించింది.
అయితే.. కమ్మ నేత కంభంపాటి హరిబాబు.. పార్టీ చీఫ్గా ఉన్న సమయంలో ఒకింత మెరుగైన ఫలితాలే సాధించారు. కానీ, కాపు నాయకత్వం తెరమీదికి రావడంతో .. కమ్మ నేతలు పార్టీకి దూరమయ్యారు. ఇక, రెడ్డి సామాజిక వర్గం అంటీముట్టనట్టు ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు వర్గాలకు ప్రాధాన్యత ఇస్తే తప్ప.. తమ ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదని భావిస్తున్న బీజేపీ త్వరలోనే రాష్ట్ర పార్టీ పగ్గాలను రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు అప్పగించే వ్యూహంతో ఉన్నట్టు తెలుస్తోంది.
Ajit Doval : రష్యా ఉప ప్రధానమంత్రి డెన్నిస్ మాంట్రువ్ ఇటీవల భారత పర్యటనకు రావడం అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద…
Rahul Gandhi : ఎన్నికల రాజకీయం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. అధికారమే పరమావధిగా రాజకీయ పార్టీలు చేసే…
Modi : భారత్ మరియు ఇరాన్ దేశాల మధ్య ప్రస్తుతం నడుస్తున్న చమురు మరియు గ్యాస్ సరఫరా వ్యవహారం అంతర్జాతీయంగా…
Revanth Reddy : తెలంగాణ Telangana State రాష్ట్రంలో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే…
Summer Business Idea : వేసవి కాలం వచ్చేసింది.. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇలాంటి ఎండల్లో…
PM Kisan 23rd installment : దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక కష్టాలను తీర్చడానికి, పెట్టుబడి సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం…
Gold Silver Rate April 6th 2026 : గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న పసిడి ధరలకు…
Karthika Deepam 2 April 6th 2026 Episode : స్టార్ మా Star Maa ఛానెల్లో ప్రసారం అవుతూ,…
Summer Buttermilk : ఎండలు మండిపోతున్న వేళ శరీరాన్ని చల్లబరచడానికి మజ్జిగను మించిన పానీయం మరొకటి లేదు. సాధారణంగా మజ్జిగ…
Mango : వేసవి కాలం రాగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది మామిడి పండు. అయితే పచ్చి మామిడికాయ మరియు…
Iced Tea Iced Coffee : వేసవి కాలంలో చల్లటి పానీయాలు తాగడం అందరికీ ఇష్టమే కానీ బరువు తగ్గాలని…
Pakistan Iran : గల్ఫ్ యుద్ధం వల్ల చమురు సరఫరా ఆగిపోవడం పాకిస్తాన్ పాలిట పెద్ద శాపంగా మారింది. ఇప్పటికే…
This website uses cookies.