
Somu Veerraju placed is replaced by a new leader
AP BJP : ఏపీ బీజేపీ సారథిని మారుస్తారా ? సోము వీర్రాజు స్థానంలో కొత్త నేతకు పట్టం కడతారా? ఏపీలో బీజేపీని పరుగులు పెట్టించే నాయకుడి కోసం.. పార్టీ అధిష్టానం అడుగులు వేస్తోందా ? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఏపీ సారథిగా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు పగ్గాలు చేపట్టి ఏడాది దాటిపోయింది. ఈ ఏడాది కాలంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. కార్పొరేషన్ ఎన్నికలు కూడా వచ్చాయి. అయితే.. ఏ ఎన్నికలోనూ.. బీజేపీ పుంజుకున్న పరిస్థితి లేదు. అదే సమయంలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికను బీజేపీపెద్దలు సీరియస్గా తీసుకున్నారు.
Somu Veerraju placed is replaced by a new leader
ఈ క్రమంలో మాజీ ఐఏఎస్ రత్నప్రభను రంగంలోకి దింపారు. ఉప పోరుకు దాదాపు మూడు మాసాల ముందు నుంచి బీజేపీ నేతలంతా తిరుపతిలో మకాం వేసి.. గెలుపు గుర్రం ఎక్కేందుకు ప్రయత్నించింది. అయితే.. ఆ ఉప ఎన్నికలో కనీసం మార్కులు కూడా సంపాదించలేక పోయారు. ఇక, స్థానికంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో సోము వీర్రాజు నాయకత్వంపై, పార్టీ భవితపై కొన్నాళ్లుగా చర్చ సాగుతోంది. అదే సమయంలో సోము వీర్రాజు.. ప్రభుత్వాన్ని టార్గెట్ చేయకుండా.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీని టార్గెట్ చేయడం వల్ల.. అప్పటి వరకు క్షత్రియ, కమ్మ సామాజిక వర్గాల్లో బీజేపీపై ఉన్న సానుభూతి పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిందనే వాదన కూడా తెరమీదికి వచ్చింది. ఈ క్రమంలో సోము వీర్రాజు తన సొంత సామాజిక వర్గాన్నయినా.. బీజేపీవైపు మళ్లించారా ? ఈ విషయంలో అయినా సక్సెస్ అయ్యారా ? అంటే.. అది కూడా కనిపించడం లేదు.
ఒకటి రెండు సందర్భాల్లో రాష్ట్ర స్థాయి ఉద్యమానికి పిలుపు ఇచ్చినా.. నాయకులను ముందుండి నడిపించడంలోను, బలమైన వైసీపీకి చెక్ పెట్టేలా వ్యూహాలను అమలు చేయడంలోనూ బీజేపీ చతికిల పడిందనే వాదన ఉంది. ఇక, సోము వీర్రాజు ఏ నినాదం అందుకున్నా.. ఆయనను అనుసరించేవారు కూడా ఇటీవల కాలంలో తగ్గిపోయారు. దీంతో ఇక, సోము వీర్రాజును పక్కన పెట్టడం తప్ప బీజేపీ అధిష్టానం ముందు మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. దీంతో మరో ఆరేడు నెలల్లోనే సోము వీర్రాజును పక్కన పెట్టి.. కీలక నేతకు పగ్గాలు అప్పగించాలని బీజేపీ పెద్దలు ఆలోచన చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. గతంలో కమ్మ సామాజిక వర్గానికి, ఆ తర్వాత .. 2సార్లు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలకు బీజేపీ అధిష్టానం ఏపీలో పగ్గాలు అప్పగించింది.
అయితే.. కమ్మ నేత కంభంపాటి హరిబాబు.. పార్టీ చీఫ్గా ఉన్న సమయంలో ఒకింత మెరుగైన ఫలితాలే సాధించారు. కానీ, కాపు నాయకత్వం తెరమీదికి రావడంతో .. కమ్మ నేతలు పార్టీకి దూరమయ్యారు. ఇక, రెడ్డి సామాజిక వర్గం అంటీముట్టనట్టు ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు వర్గాలకు ప్రాధాన్యత ఇస్తే తప్ప.. తమ ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదని భావిస్తున్న బీజేపీ త్వరలోనే రాష్ట్ర పార్టీ పగ్గాలను రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు అప్పగించే వ్యూహంతో ఉన్నట్టు తెలుస్తోంది.
Vivo V70 Series 5G : చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం Vivo తన కొత్త V70 సిరీస్ 5Gను ఈరోజు…
Good News to Telangana Farmers : తెలంగాణలోని అన్నదాతలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. సన్న…
India Vs Pakistan : టీ20 ప్రపంచ కప్ టోర్నీ ఉత్కంఠభరిత దశలోకి అడుగుపెట్టింది. లీగ్ మ్యాచ్లు ముగియడంతో సూపర్…
Good News to Farmers : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని కేంద్రబిందువుగా చేసుకుని వరుస కీలక నిర్ణయాలను అమలు…
Gold and Silver Rates 19 Feb 2026 Today : పసిడి ప్రియులకు, ఆభరణాలు కొనుగోలు చేయాలని భావిస్తున్న…
Brahmamudi Today 19 Feb 2026 Episode : స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న టాప్ రేటెడ్ సీరియల్ 'బ్రహ్మముడి'…
Karthika Deepam 2 Today 19 Feb 2026 Episode : స్టార్ మాలో ప్రసారమవుతున్న టాప్ రేటెడ్ సీరియల్…
Google Pixel 10a Review : ఎప్పటి నుంచో టెక్ ప్రియులు ఎదురుచూస్తున్న Google Pixel 10a ఎట్టకేలకు భారత…
Avocado health benefits Telugu : ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారి డైట్లో ఇప్పుడు 'అవకాడో' Avocado తప్పనిసరిగా ఉంటోంది. దీనిని…
Green Tea for Hair Growth : ఈ రోజుల్లో చిన్న వయసులోనే జుట్టు రాలిపోవడం Hair Fall, బట్టతల…
T20 World Cup 2026: ICC T20 World Cup 2026లో భారత జట్టు Team India తన ఆధిపత్యాన్ని…
T20 World Cup 2026 : క్రికెట్ టోర్నీలో అత్యంత కీలకమైన సూపర్-8 దశకు తెరలేచింది. గ్రూప్-1లో టీమిండియా తన…
This website uses cookies.