దేశంలో సుదీర్ఘ కాలం పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం గడ్డు కాలం కొనసాగుతోంది. 2014 లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి దేశంలో మరింతగా దిగజారింది. కాంగ్రెస్ పార్టీని దేశంలో లేకుండా చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మరియు అమిత్ షా లు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం ప్రతి ఒక్కరికి తెల్సిందే. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీని లేదా బీజేపీ మిత్రపక్షాలను అధికారంలోకి తీసుకు వచ్చేందుకు వీరిద్దరు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. ఏడు సంవత్సరాలుగా కాంగ్రెస్ కు సంతృప్తికరమైన ఎన్నికల ఫలితాలు రాలేదు.
దేశంలో కాంగ్రెస్ ఎదుర్కొంటున్న పరిస్థితి మరే పార్టీకి లేదేమో అనిపిస్తుంది. ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మరియు ఉప ఎన్నికల్లో మళ్లీ చేదు అనుభవమే ఎదురైంది. తమిళనాట డీఎంకే తో కలిసి పోటీ చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ దక్కించుకున్న ఘనత ఏమీ లేదు. మొత్తం క్రెడిట్ అంతా డీఎంకే అధినేత స్టాలిన్ కు వెళ్లింది అనడంలో సందేహం లేదు. ఏపీ ని విడగొట్టిన పాపం మరియు వైకాపా అధినేత వైఎస్ జగన్ ను జైలు పాలు చేయడం వల్లే కాంగ్రెస్ కు ఈ గతి పట్టిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దూకుడుగా దూసుకు పోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు సోనియా గాంధీ కి అర్థం అయ్యి ఉంటుంది. ఆ సమయంలో అనవసరంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పార్టీకి దూరం చేయడం జరిగింది. ఒక వేళ సీఎం గా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎంపిక చేసి ఉంటే తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు తిరుగు ఉండేది కాదు. అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గా ఉండేది అంటూ కాంగ్రెస్ వర్గాల వారు అంటున్నారు. జగన్ మోహన్ రెడ్డిని అలా చేయడం వల్లే కాంగ్రెస్ కు ఈ పరిస్థితి అంటూ చాలా మంది వైకాపా నాయకులు ఎద్దేవ చేస్తున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.