Supreme Court : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తన పదవీకాలం ఈరోజుతో పూర్తి కావడంతో జస్టిస్ ఎన్వీ రమణ ఇవాళ చివరి రోజు విచారణలో ఉన్న కేసులన్నింటినీ ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆ తర్వాత ఆయన పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణకు ఇవాళ చివరి రోజు కావడంతో పెండింగ్ లో ఉన్న చాలా కేసులను ఆయన ఇవాళ పరిష్కరించారు.
అయితే.. దేశంలో, పలు రాష్ట్రాల్లో అందించే ఉచిత పథకాలపై ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఉచిత పథకం సంక్షేమ పథకమే అని ఎలా తేల్చాలి అని సుప్రీం ప్రశ్నించిన విషయం తెలిసిందే. హామీలను గుప్పించకుండా రాజకీయ పార్టీలను, ప్రభుత్వాలను నియంత్రించలేమని ఎన్వీ రమణ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఉచిత విద్య, ఉచిత తాగునీరు లాంటి పథకాలన్నీ ఉచితాలే కదా అని ఆయన ప్రశ్నించిన విషయం తెలిసిందే.
సుప్రీం కోర్టు 2013 లోనే ప్రజలకు ఇచ్చే ఉచితాలపై తీర్పును వెలువరించింది. దానిపై సీజేఐ రమణ నేతృత్వంలోని ధర్మాసనం రాజకీయ నాయకులు ఉచిత హామీలపై వాదనలను విన్నది. ఎన్నికలకు ముందు ఉచితాల పేరుతో హామీలను ఇచ్చే రాజకీయ పార్టీలను రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు అయిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన ముఖ్యమైన ఉత్తర్వులను సీజేఐ వెలువరించారు. అయితే.. రాజకీయ పార్టీలకు చెందిన ఇలాంటి అంశంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశానికి కేంద్రం ఎందుకు రాజకీయ పార్టీలను పిలవలేదంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
ఉచితాలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయని రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉంటే తప్ప.. ఏం జరగదు అని సుప్రీం వెల్లడించింది. ఉచితాలపై ఖచ్చితంగా చర్చ జరగాలి. ఇది తీవ్రమైన సమస్య. దీనిలో ఎటువంటి సందేహం లేదు. కానీ.. అసలు ప్రశ్న ఏంటంటే.. అన్ని రాజకీయ పార్టీలు ఈ సమస్యపై ఎందుకు ఏకాభిప్రాయంతో ఉండకూడదు. ఎందుకు ఈ సమస్యపై పార్టీలన్నీ కలిసి నిర్ణయం తీసుకోకూడదు. కేంద్రం కూడా ఈ సమస్యపై అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి కలిసి నిర్ణయం తీసుకోవాలని సుప్రీం తెలిపింది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.