
Taraka Ratna participated in campaign for suhasini
Tarakaratna- Suhasini : నందమూరి తారకరత్న ఇక లేరు. ఆయన లేరనే విషయాన్ని నందమూరి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తారకరత్న 23 రోజుల పాటు పోరాడి చివరకు తుదిశ్వాస విడిచారు. విదేశాల నుంచి వచ్చిన వైద్య బృందం ఎంత ప్రయత్నించినా ఆయన ప్రాణాలు మాత్రం దక్కలేదు. 40 ఏళ్ల వయసులోనే తారకరత్న ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. దీంతో సినీ లోకం ఒక్కసారిగా మూగబోయింది. తారకరత్న తెలుగు సినిమాకు చేసిన సేవలను ఈసందర్భంగా గుర్తు చేసుకుంటోంది. నిజానికి.. తారకరత్న సినిమా ఎంట్రీ గ్రాండ్ గానే జరిగింది. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో తారకరత్న హిట్ కొట్టాడు కానీ..
ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలు అంతగా ఆడలేదు. దీంతో హీరో పాత్రలు కాకుండా విలన్ గానూ ఆయన మెప్పించారు. 2002 లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తారకరత్న ఆ తర్వాత ఒకేసారి చాలాసినిమాలకు సైన్ చేసినా ఏ సినిమా అంతగా ఆడలేదు. అయితే.. తారకరత్నకు అమరావతి అనే సినిమాతో నంది అవార్డు వచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో విలన్ గానే నటించారు. ఇటీవల వెబ్ సిరీస్ లోనూ నటించారు. ఆయన రాజకీయ విషయాల గురించి చెప్పుకుంటే.. ఆయన టీడీపీకి మద్దతుగా ఉండేవారు. టీడీపీకి మద్దతు ఇస్తూ ఉండేవారు.
Taraka Ratna participated in campaign for suhasini
నారా లోకేష్, చంద్రబాబుతో మంచిగా ఉండేవారు. 2018 ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ తరుపున ప్రచారం చేశారు తారకరత్న. 2018 లో కూకట్ పల్లి నుంచి నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని పోటీ చేశారు. అప్పుడు తన సొంత సోదరులు జూనియర్ ఎన్టీఆర్ కానీ.. కళ్యాణ్ రామ్ కానీ ప్రచారంలో పాల్గొనలేదు. కానీ.. తారకరత్న మాత్రం ఇంటింటికి తిరిగి సుహాసిని తరుపున పోటీ చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్టుగా కూడా ప్రకటించారు తారకరత్న. నారా లోకేష్ పాదయాత్రలోనూ అందుకే పాల్గొన్నారు. కానీ.. ఆ రోజే ఆయనకు గుండె పోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. 23 రోజులు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి చివరకు ఓడిపోయారు.
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్లో న్యూజిలాండ్తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…
Youth Kidnap : రాజస్థాన్లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న కీలక పథకాలలో అన్నదాత…
CBN warning to YS Jagan : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో…
This website uses cookies.