కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల దగ్గరలోని ఇల్లంతకుంటలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మంత్ర KTR పై బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన బీజేపీ నాయకులు.. ఆయన చిత్రపటాన్ని విచిత్రంగా రూపుదిద్దారు. మంత్రి కేటీఆర్.. ఇల్లంతకుంటలో 30 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని గతంలో హామీ ఇచ్చారు.
ఆ హామీని ఇఫ్పటి వరకు నెరవేర్చలేదని.. హామీ ఇచ్చి కూడా 3 ఏళ్లు దాటిపోయిందని స్థానిక బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం.. కేటీఆర్ చిత్రపటాన్ని తీసుకొని.. దానికి 38 గాజులను తగిలించారు. ఆ తర్వాత కేటీఆర్ ముఖానికి బొట్టు పెట్టి.. చేతులకు గాజులను తగిలించి.. నినాదాలు చేశారు.
ఇకనైనా మంత్రి కేటీఆర్.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని.. వెంటనే ఇల్లంతకుంటలో 30 పడకల ఆసుపత్రిని నిర్మించాలని వాళ్లు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇల్లంతకుంటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాత్రమే ఉంది. దాన్ని బాగు చేసి.. 30 పడకల ఆసుపత్రిని చేస్తే.. మండల ప్రజలు చికిత్స కోసం వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం రాదు. అందుకే.. అక్కడి స్థానిక బీజేపీ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. ఇచ్చిన హామీలను ఇప్పటికైనా నిలబెట్టుకోవాలని వాళ్లు డిమాండ్ చేశారు.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
This website uses cookies.