గల్లా జయదేవ్.. టీడీపీ పార్లమెంట్ సభ్యుడిగా, గల్లా అరుణ కుమారి వారసుడిగా అందరికీ సుపరిచితమే.. ఇప్పుడు గల్లా జయదేవ్ కు స్థానచలనం తప్పేలా లేదన్నదే హాట్ టాపిక్ గా మారింది. గల్లా జయదేవ్ రెండుసార్లు వరుసగా గెలిచినా, స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని సమాచారం. అయితే ఆయన గెలుపుకు మాత్రం ఎటువంటి ఢోకా లేదని టాక్. దీంతో ఓవైపు పారిశ్రామికవేత్తగా, మరోవైపు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ కు .. వచ్చే ఎన్నికల్లో సీటు కన్ఫర్మ్ అయినా, స్థాన చలనం తప్పడం లేదని తెలుస్తోంది.
అమరావతి ఉద్యమంలోనూ గల్లా జయదేవ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారన్న విషయాన్ని గమనంలో ఉంచుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు గల్లా జయదేవ్ ను ప్లేస్ మార్చి, పోటీకి దించాలని భావిస్తున్నారన్న వార్త ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో గల్లా జయదేవ్ ను వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి షిఫ్ట్ చేసి, మరీ బరిలోకి దింపనున్నారని కేడర్ చర్చించుకుంటోంది. అయితే ఈ నిర్ణయంపై ఇంకా పూర్తిస్థాయి చర్చ జరగాల్సి ఉందని, కొద్దిరోజుల్లోనే క్లారిటీ వచ్చేస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.
ఈ దఫా ఎన్నికల్లో నిలబెట్టే పార్లమెంట్ స్థానాల అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు ఆచితూచి అడుగులు వేయనున్నారు. ఎంపీలుగా సరైన అభ్యర్థుల్ని రంగంలోకి దించితే, అసెంబ్లీ సీట్లు సైతం గణనీయంగా పెరుగుతున్నాయని చంద్రబాబు యోచిస్తున్నారు. అందుకే ఎంపీ అభ్యర్థుల విషయంలో చంద్రబాబు తొందరపడి, నిర్ణయాలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఇందులో భాగంగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పై స్థానికంగా అసంతృప్తి వెల్లువెత్తుతున్నా, గెలిచే సత్తా ఉన్న నేత అని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే గల్లా జయదేవ్ ను గుంటూరు నుంచి తరలించాలని బాబు ప్లాన్ చేస్తున్నారు.
అయితే గల్లా జయదేవ్ .. వాస్తవానికి చిత్తూరుకు చెందిన రాజకీయ వారసుడు. కానీ గుంటూరు నుంచి బరిలోకి దింపి, చంద్రబాబు గెలిపించారు. ఇక్కడ స్థానికంగా ఉన్న రాయపాటి కుటుంబాన్ని కాదని .. చంద్రబాబు గల్లా జయదేవ్ ను పోటీ చేయించారు. 2014, 2019 ఎన్నికల్లో గల్లా జయదేవ్ విజయం సాధించారు. అయితే గల్లా జయదేవ్ పై పార్టీలోనే అసంతృప్తి ఉంది. పనితీరు సరిగా లేదని, క్యాడర్ కు కూడా అందుబాటులో ఉండరని ఫిర్యాదులు ఉన్నాయి.
గల్లా జయదేవ్ దృష్టి ఎక్కువగా వ్యాపారాలపై ఉందని, అమరావతి ఉద్యమం విషయంలోనూ సరిగ్గా స్పందించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గల్లా జయదేవ్ ను గుంటూరు నుంచి పోటీ చేయిస్తే, కష్టమేనన్నటాక్ పార్టీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. మరోవైపు బెజవాడ ఎంపీ కేశినేని నానిపై పార్టీ నేతల్లో అసంతృప్తి ఉంది. దీంతో గల్లా జయదేవ్ ను ఈసారి బెజవాడ పార్లమెంటుకు పోటీ చేయించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. కేశినేని నానిని వీలైతే, గుంటూరుకు లేదంటే, పక్కన పెట్టేయాలన్నదే చంద్రబాబు నిర్ణయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై కేశినేని నాని .. వైఖరి ఏమిటన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే కేశినేని నాని పట్ల వ్యతిరేకత వెల్లువలా మారుతోంది. గత స్థానిక సమరంలోనే నేతల మధ్య విబేధాలు హాట్ టాపిక్ గా మారాయి. దీంతో ఇక కేశినేని నానికి చెక్ తప్పదన్న టాక్ అప్పట్లోనే వినిపించింది. ఈ వ్యవహారంపై నోరు మెదపని బాబు.. ఇప్పుడు చెక్ పెట్టనున్నారని తెలుస్తోంది. ఈ స్థానం నుంచి కేశినేని నానిని తప్పించి, గల్లా జయదేవ్ ను బరిలోకి దింపాలని యోచిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద గల్లా జయదేవ్ విజయవాడ పార్లమెంటుకు ఈసారి పోటీ చేస్తారన్న టాక్ బలంగా వినిపిస్తోంది..
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.