
Family Politics: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పుడు వైఎస్ రాజశేఖర్రెడ్డి కుటుంబ రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. ఆ ఇంట్లో ఏ చిన్న పరిణామం చోటుచేసుకున్నా దాని వెనుక ఏదో రాజకీయ కోణం ఉందనే ప్రచారం జరుగుతున్నది. ఆ ఇంట్లో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు వాటిపై జరుగుతున్న ప్రచారమే అందుకు ఉదాహరణ. తాజాగా జగన్ మాతృమూర్తి వైఎస్ విజయమ్మ తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతున్నది.
ఇతర ధనవంతుల కుటుంబాల్లోలా కాకుండా జగన్ కుటుంబంలో సభ్యుల మధ్య ఆప్యాయత, అనురాగాలు మెండుగా ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో అవి సన్నగిల్లుతున్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. ఒకప్పుడు అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతిరూపంగా ఉండేవారు ఏపీ సీఎం జగన్, ఆయన సోదరి షర్మిల. కానీ గత కొంతకాలంగా ఇద్దరి మధ్య విబేధాలు మొదలయ్యాయి. అన్న వదిలిన బాణంగా చెప్పుకునే షర్మిల.. ఇప్పుడు తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టారు.
అంతేకాదు నేరుగా తన సోదరుడు జగన్ పైనే విమర్శలు చేశారు. తండ్రి వైఎస్ జయంతి నాడు జగన్-షర్మిల ఒకరికొకరు ఎదురుపడటానికి కూడా ఇష్టపడలేదు. పోనీ ఇద్దరి మధ్య విబేధాలు ఎలా ఉన్నా కచ్చితంగా రాఖీ పండుగ రోజైనా కలుస్తారని వైఎస్ఆర్ అభిమానులు ఆశించారు. కానీ ఆ రోజు కూడా షర్మిల జగన్కు నేరుగా రాఖీ కట్టలేదు. కేవలం సోషల్ మీడియా వేదికగా రాఖీపండుగ శుభాకాంక్షలు చెప్పారు.
దాంతో అన్నా చెల్లెళ్ల మధ్య విబేధాలున్నట్లు జరుగుతున్న ప్రచారం నిజమేనని రుజువయ్యింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ విజయమ్మ తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయమ్మ.. తన భర్త రాజశేఖర్ రెడ్డి వర్థంతి రోజైన సెప్టెంబర్ 2న హైదరాబాద్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి నాడు తన భర్త క్యాబెనెట్లో మంత్రులుగా పనిచేసిన వారిని, ఆయనతో కలిసి నడిచిన వారిని ఆహ్వానించారు.
అయితే, పార్టీలకు అతీతంగా తాను ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు విజయమ్మ చెబుతున్నారట. మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్కుమార్, తెలంగాణకు చెందిన డి శ్రీనివాస్తోపాటు పలువురికి ఆహ్వానాలు చేరాయి. అయితే, వైఎస్ మరణించి 12 సంవత్సరాలు పూర్తయినా విజయమ్మ ఏ వర్థంతికి కూడా ఆయనతో కలిసి పనిచేసిన నేతలను ఆహ్వానించలేదు. కానీ, తొలిసారిగా ఇప్పుడు ఆమె వైఎస్తో కలిసి పనిచేసిన నేతలకు ఆహ్వానాలు పంపడం ఊహాగానాలకు తెరతీసింది.
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
This website uses cookies.