YSRCP : ఎలక్షన్ ముందు చంద్రబాబుకు ఎదురు దెబ్బ... జగన్ వ్యూహం అదుర్స్...!
TDP – YSRCP : తెలుగుదేశం పార్టీ మొన్నీమధ్యనే మహానాడు నిర్వహించింది. ఇప్పుడు వైసీపీ ప్లీనరీ జరుగుతోంది. అధికారంలోకి వచ్చాక తొలిసారి ప్లీనరీ సమావేశాల్ని నిర్వహిస్తున్న వైసీపీ, ఈ ప్లీనరీ సమావేశాల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహంచడంలో వింతేముంది.?
ప్లీనరీ సమావేశం ఏ రాజకీయ పార్టీకి అయినా అత్యంత కీలకం. కీలక నిర్ణయాలన్నీ ఇలాంటి వేదికల మీదనే తీసుకుంటారు. మహానాడు సైతం అంతే. టీడీపీ నిర్వహించిన మహానాడులో, పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయాలు ఏంటి.? అంటే సమాధానం చెప్పేంత సీన్ టీడీపీలో ఎవరికీ లేదు.
సో, టీడీపీ నేతలకు వైసీపీ ప్లీనరీని విమర్శించే నైతిక హక్కు లేదు. నిజానికి, టీడీపీ మహానాడులో పూర్తిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడానికే టీడీపీ నేతలు పోటీ పడ్డారు. బూతులు మాట్లాడారు కొందరు టీడీపీ నేతలు. వాటికి సమాధానం ఇవ్వాలని వైసీపీ నేతలు అనుకుంటే, వైసీపీ ప్లీనరీ ఇంకోలా వుంటుంది. వైసీపీ ప్లీనరీ వేదికగా, వైఎస్ విజయమ్మ.. పార్టీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. వైసీపీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్ జగన్తోపాటు వేదిక పంచుకున్నారు. పార్టీకి దూరమవుతున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దగ్గరగానే వుంటానన్నారు.
TDP Mahanadu Vs YSRCP Plenary
తల్లిగా ఎప్పుడూ వైఎస్ జగన్ వెంట వుంటాననీ చెప్పుకొచ్చారు. వైఎస్ కుటుంబంలో చిచ్చు.. అంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో, ఆ విమర్శలకు ప్లీనరీ వేదికగా విజయమ్మ తగిన సమాధానం చెప్పకనే చెప్పారు. ఇక, టీడీపీ మీద వైసీపీ నేతల విమర్శల విషయానికొస్తే, ఇవి నిజానికి చాలా చాలా తక్కువే. తొలి రోజు నాలుగు కీలక తీర్మానాలు జరిగాయి. ఈ రోజు మరికొన్ని తీర్మానాలు జరుగుతాయి. ప్లీనరీ అనేది పార్టీ అంతర్గత వ్యవహారం. టీడీపీ మహానాడు జరిగిన వైనం, వైసీపీ ప్లీనరీ జరుగుతున్న వైనం పోల్చి చూస్తే.. అసలు మహానాడు అనేది పచ్చ బూటకం అని ఇట్టే అర్థమవుతుంది.
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
This website uses cookies.