
Bhatti Vikramarka:తెలంగాణ ఆస్తుల పరిరక్షణే లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Bhatti Vikramarka : ప్రజాభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు సహజ వనరులను కాపాడటం తన జీవిత లక్ష్యమని స్పష్టం చేశారు. ఆస్తుల సంపాదన కోసమో వ్యాపారాలను విస్తరించుకోవడానికో తాను రాజకీయాల్లోకి రాలేదని ఆయన తేల్చిచెప్పారు. ప్రజల ఆస్తులను గద్దలు, దోపిడీదారులు, వ్యవస్థీకృత నేరగాళ్ల నుంచి రక్షించడమే తన ప్రధాన బాధ్యత అని అన్నారు. సింగరేణి వంటి ప్రభుత్వ సంస్థలు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకలని వాటి పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
Bhatti Vikramarka : తెలంగాణ ఆస్తుల పరిరక్షణే లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సింగరేణి సంస్థ నైనీ బొగ్గు బ్లాక్లకు టెండర్లు పిలవడంపై ఇటీవల ఓ పత్రికలో వచ్చిన కథనాలను భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. అవి కట్టుకథలు, పిట్టకథలతో ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే టెండర్లు పిలవాలని సింగరేణి సంస్థకు సూచించామని తెలిపారు. టెండర్ల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని అందులో మంత్రుల జోక్యం లేదని స్పష్టం చేశారు. టెండర్లు పిలిచింది సింగరేణి సంస్థే తప్ప మంత్రి కాదని గుర్తుచేశారు. క్లిష్టమైన ప్రాంతాల్లో గనులు ఉన్నందున ఫీల్డ్ విజిట్ నిబంధన తప్పనిసరి అని ఇలాంటి నిబంధనలు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోనూ అమలులో ఉన్నాయని వివరించారు.
తాను వైఎస్ రాజశేఖర్రెడ్డికి సన్నిహితుడిని కావడమే తనపై కక్ష సాధింపులకు కారణమవుతోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆయనపై ఉన్న కోపాన్ని తనపై చూపిస్తూ కొన్ని మీడియా సంస్థలు రాజకీయ ఉద్దేశాలతో కథనాలు రాస్తున్నాయని విమర్శించారు. ఒకరి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా కథనాలు రాసే అధికారం ఎవరికీ లేదని హెచ్చరించారు. నాయకుల మధ్య విభేదాలు సృష్టించేందుకు కావాలనే అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి ప్రచారాలకు భయపడే వ్యక్తిని కాదని నిజం ఎప్పటికైనా బయటకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓ టీవీ ఛానల్ కథనంలో తన పేరును అనవసరంగా లాగడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. మీడియా సంస్థల మధ్య ఉన్న అంశాల్లోకి ప్రజాప్రతినిధులను లాగొద్దని వ్యక్తిగత వ్యవహారాల జోలికి వెళ్లడం సరికాదని హితవు పలికారు. పదవుల కోసం కాకుండా ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని మరోసారి స్పష్టం చేసిన భట్టి విక్రమార్క సింగరేణి ప్రజల ఆస్తి బొగ్గుగనులు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవమని అన్నారు. రాష్ట్ర వనరులను సంరక్షించి పేదలకు సమానంగా పంచడమే తన సంకల్పమని ఈ దిశగా ఎలాంటి ఒత్తిడులకైనా తలవంచేది లేదని డిప్యూటీ సీఎం తేల్చిచెప్పారు.
Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు…
Palapandlu : ఎండాకాలం రాగానే మార్కెట్లో కొన్ని ప్రత్యేకమైన అడవి పండ్లు ఎక్కువగా కనిపిస్తాయి. వాటిలో ముఖ్యంగా “పాల పండ్లు”…
Lemon Juice : ఎండాకాలం ప్రారంభమైతే చాలు దాహం వేధించడం మొదలవుతుంది. అలాంటి వేళలో మనకు వెంటనే గుర్తొచ్చేది చల్లని…
Coconut Water : దేశవ్యాప్తంగా ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మధ్యాహ్నం వేళ…
AP Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి. అధికారం ఎవరిది అన్న విషయంపై ఎప్పుడూ ఉత్కంఠ కొనసాగుతూనే…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన లండన్ ప్రయాణం అవుతుండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో…
Telangana BJP : తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ బలం పుంజుకోలేకపోవడానికి ప్రధాన కారణం గతంలో జరిగిన నియోజకవర్గాల…
Mahasena Rajesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకటే పేరు మారుమోగిపోతోంది. అదే మహాసేన రాజేష్. సోషల్ మీడియాలో తనదైన…
Modi : మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో వీగిపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఎన్డీఏ ప్రభుత్వం…
Viral video : తెలుగు బుల్లితెర ప్రపంచంలో ప్రేక్షకులను అలరించేందుకు ఛానెళ్లు కొత్త కాన్సెప్ట్లతో ముందుకు వస్తున్నాయి. కామెడీ, కుకింగ్,…
Dwakra Group : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి పలు సంక్షేమ పథకాలను అమలు…
Red Banana : అరటిపండు అనేది ప్రతి ఇంట్లో కనిపించే సాధారణ పండు అయినప్పటికీ దాని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణంగా…
This website uses cookies.