Donate | వాస్తు నిపుణుల హెచ్చరిక..ఈ 5 వస్తువులను ఎప్పుడూ దానం చేయొద్దు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Donate | వాస్తు నిపుణుల హెచ్చరిక..ఈ 5 వస్తువులను ఎప్పుడూ దానం చేయొద్దు

 Authored By sandeep | The Telugu News | Updated on :3 October 2025,6:00 am

Donate | హిందూ సంప్రదాయంలో పండుగలు, ఉపవాసాల అనంతరం దానం చేయడం ద్వారా పుణ్యం పొందతామని నమ్మకం ఉంది. కానీ, వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల పుణ్యానికి బదులు పాపం వచ్చే అవకాశమూ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వాస్తు నిపుణులు చెబుతున్న ప్రకారం, కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం వల్ల ఆర్థిక నష్టాలు, కుటుంబ కలహాలు, అనారోగ్యం వంటి ప్రతికూల పరిణామాలు ఏర్పడే ప్రమాదం ఉంది. కనుక, ఈ ఐదు ముఖ్యమైన వస్తువులను దానం చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

#image_title

1. నూనె – ఉప్పు

పండుగల తర్వాత ఉపవాసం ముగిసినప్పుడు నూనె లేదా ఉప్పును దానం చేయడం వాస్తు ప్రకారం శుభం కాదు. దీని వల్ల ఉపవాసం ద్వారా పొందే పుణ్యం నష్టమవుతుందని నమ్మకం. ఇది ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాన్ని తేవచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

2. మిగిలిపోయిన ఆహారం

పాడైన లేదా మిగిలిపోయిన ఆహారాన్ని దానం చేయడం కూడా శ్రేయస్కరం కాదట. ఇది ఇంటిలో పేదరికాన్ని తీసుకువస్తుందని, సంపదను దూరం చేస్తుందని అంటున్నారు. దానం చేసేది ఎప్పుడూ తాజా, పరిశుభ్రమైన ఆహారమే కావాలని సూచిస్తున్నారు.

3. చీపురు

చీపురు లక్ష్మీదేవి యొక్క చిహ్నంగా పరిగణించబడుతుంది. దానిని దానం చేయడం వలన ఇంటి అదృష్టం, సంపద దూరమవుతుందని నమ్మకం. వాస్తు ప్రకారం, ఇది ఆర్థిక సమస్యలకు దారి తీస్తుంది.

4. మత గ్రంథాలు / పుస్తకాలు

భక్తి గ్రంథాలు లేదా మతపరమైన పుస్తకాలను ఇతరులకు ఇవ్వడం వల్ల, అవి గౌరవంతో ఎదుర్కొనకపోతే దాతకు పాపం వచ్చే అవకాశం ఉందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

5. పదునైన వస్తువులు

కత్తెరలు, కత్తులు, ఉక్కు పాత్రలు వంటి పదునైన వస్తువులను దానం చేయడం కుటుంబ శాంతి మరియు అభివృద్ధిని దెబ్బతీయవచ్చని చెబుతున్నారు. ఇది కుటుంబ ఆదాయ మార్గాలు అడ్డుకుంటుందని వాస్తు నిపుణుల హెచ్చరిక.

sandeep

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి