
tirupati by elections gurumurthy surly win as mp
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు రంగం సిద్దం అయ్యింది. ప్రధాన పార్టీలు అయిన వైకాపా, తెలుగు దేశం పార్టీ, బీజేపీలు హోరా హోరీగా ప్రచారం అయితే చేశాయి. ఎస్సీ సామాజిక వర్గంకు ఆ నియోజక వర్గం కేటాయించడం జరిగింది. కనుక పోటీ చేసిన అభ్యర్థుల్లో గురుమూర్తి, పనబాక లక్ష్మి మరియు చింత మోహన్ లు మాల సామాజిక వర్గం వారు కాగా బీజేపీ అభ్యర్థి రత్నప్రభ మాత్రమే మాదిక సామాజిక వర్గంకు చెందిన వారు. సామాన్యంగా ఇలాంటి ఎన్నికల్లో కులాలు మరియు మతాల ప్రాతిపధికన ఓట్లు పడ్డా కూడా గెలుపు ఓటములు డిసైడ్ అయ్యే అవకాశం తక్కువ. ఈ సారి కూడా మాదిగల సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నా కూడా గెలిచేది మాత్రం మాల సామాజిక వర్గంకు చెందిన అభ్యర్థి అంటూ బలమైన విశ్లేషణ వినిపిస్తుంది.
వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి నుండే చాలా ప్లాన్ చేసి ఈ నియోజక వర్గం నుండి గురుమూర్తిని రంగంలోకి దించాడు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండానే గురుమూర్తి విజయంను ఖాయం చేశాడు అంటూ ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా వైకాపానే ఈ ఎన్నికల్లో గెలుపొందుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. గురుమూర్తి పార్టీ నాయకత్వం పెట్టుకున్న నమ్మకంను నిలిపే విధంగా ఘన విజయం సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.
tirupati by elections gurumurthy surly win as mp
తిరుపతి ఉప ఎన్నికల్లో మాదిగ మాల సామాజిక వర్గాలకు చెందిన ఓట్లు కీలకంగా మారాయి. మాల సామాజిక వర్గంకు చెందిన వారు పోటీలో ఎక్కువగా ఉండటం వల్ల అటుగా ఓట్లు చీలే అవకాశం ఉంది. ఇక మాదిక సామాజిక వర్గంకు చెందిన వారు ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉండటం వల్ల వారు వైకాపాకు ఓట్లు వేసే అవకాశాలు కూడా లేకపోలేదు అంటున్నారు. మొత్తంగా మాదిక సామాజిక వర్గం నుండి పడే ఓట్లతో వైకాపా గెలుపు ఖాయం అని అది కూడా భారీ మెజార్టీతో అంటూ రాజకీయ వర్గాల వారు అంటున్నారు.
Kavitha : తెలంగాణ రాజకీయాలు మున్సిపల్ ఎన్నికలతో మరింత వేడెక్కుతున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీల సరసన,…
Chintakayala Vijay : టీడీపీ నాయకుడు చింతకాయల విజయ్ ఇటీవల తన సొంత పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన హెచ్చరికలు…
Anasuya : వివాదాస్పద అంశాలపై మౌనం వహించకుండా తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పే యాంకర్ అనసూయ మరోసారి సోషల్ మీడియాలో…
Train Ticket Booking : భారతీయ రైల్వే తన ప్రీమియం సర్వీసులైన వందే భారత్ స్లీపర్ మరియు అమృత్ భారత్…
Post Office Franchise 2026 : సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి, ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో ప్రభుత్వ మద్దతు కోరుకునే…
ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో 'రేంజ్' (మైలేజీ) అనేది ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. ఆ సమస్యకు పరిష్కారంగా కొమాకి సంస్థ…
Aadabidda Nidhi Scheme : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 'సక్సెస్' అనే పదానికి పర్యాయపదంగా మారారు దర్శకుడు అనిల్ రావిపూడి. అపజయమెరుగని దర్శకుడిగా పదేళ్ల ప్రస్థానాన్ని…
This website uses cookies.