తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు రంగం సిద్దం అయ్యింది. ప్రధాన పార్టీలు అయిన వైకాపా, తెలుగు దేశం పార్టీ, బీజేపీలు హోరా హోరీగా ప్రచారం అయితే చేశాయి. ఎస్సీ సామాజిక వర్గంకు ఆ నియోజక వర్గం కేటాయించడం జరిగింది. కనుక పోటీ చేసిన అభ్యర్థుల్లో గురుమూర్తి, పనబాక లక్ష్మి మరియు చింత మోహన్ లు మాల సామాజిక వర్గం వారు కాగా బీజేపీ అభ్యర్థి రత్నప్రభ మాత్రమే మాదిక సామాజిక వర్గంకు చెందిన వారు. సామాన్యంగా ఇలాంటి ఎన్నికల్లో కులాలు మరియు మతాల ప్రాతిపధికన ఓట్లు పడ్డా కూడా గెలుపు ఓటములు డిసైడ్ అయ్యే అవకాశం తక్కువ. ఈ సారి కూడా మాదిగల సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నా కూడా గెలిచేది మాత్రం మాల సామాజిక వర్గంకు చెందిన అభ్యర్థి అంటూ బలమైన విశ్లేషణ వినిపిస్తుంది.
వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి నుండే చాలా ప్లాన్ చేసి ఈ నియోజక వర్గం నుండి గురుమూర్తిని రంగంలోకి దించాడు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండానే గురుమూర్తి విజయంను ఖాయం చేశాడు అంటూ ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా వైకాపానే ఈ ఎన్నికల్లో గెలుపొందుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. గురుమూర్తి పార్టీ నాయకత్వం పెట్టుకున్న నమ్మకంను నిలిపే విధంగా ఘన విజయం సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.
తిరుపతి ఉప ఎన్నికల్లో మాదిగ మాల సామాజిక వర్గాలకు చెందిన ఓట్లు కీలకంగా మారాయి. మాల సామాజిక వర్గంకు చెందిన వారు పోటీలో ఎక్కువగా ఉండటం వల్ల అటుగా ఓట్లు చీలే అవకాశం ఉంది. ఇక మాదిక సామాజిక వర్గంకు చెందిన వారు ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉండటం వల్ల వారు వైకాపాకు ఓట్లు వేసే అవకాశాలు కూడా లేకపోలేదు అంటున్నారు. మొత్తంగా మాదిక సామాజిక వర్గం నుండి పడే ఓట్లతో వైకాపా గెలుపు ఖాయం అని అది కూడా భారీ మెజార్టీతో అంటూ రాజకీయ వర్గాల వారు అంటున్నారు.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.