Trs kranthi kiran chanti sensational comments on congress bjp
TRS : స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆందోళ్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నాయి. ఇంతకీ ఎమ్మెల్యే ఏం మాట్లాడారంటే..స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆందోళ్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తమ పార్టీ ప్రజా ప్రతినిధులతో మాట్లాడారు. ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని జోస్యం చెప్పారు.
తాము ఓడిపోతామని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పోటీలో నిలపడం సిగ్గుచేటని విమర్శించారు. ఇకపోతే కాంగ్రెస్ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా ఉన్న దామోదర్ మాటలను కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అస్సలు నమ్మొద్దని అన్నారు. కాంగ్రెస్ నేతలు అధికార టీఆర్ఎస్లో చేరాలన్నారు.ఈ క్రమంలోనే దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమిపై ఎమ్మెల్యే క్రాంతి సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ను ఓడించడమే లక్ష్యంగా ఈ మూడు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని బీజేపీతో కుస్తీ పడుతూ, రాష్ట్రంలోని బీజేపీతో దోస్తీ చేస్తోందని విమర్శించారు.
Trs kranthi kiran chanti sensational comments on congress bjp
కేంద్రప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టం చేయాలని కోరారు.కాంగ్రెస్, బీజేపీ చేసుకున్న లోపాయికారి ఒప్పందం వల్లే తాము ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని చెప్పారు. బీజేపీని నమ్ముకునే కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని, కాంగ్రెస్, బీజేపీలది అక్రమ సంబంధమని తీవ్రమైన ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని, తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ వెంటనే ఉన్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.