YS Jagan : ఇది అసలే టెక్నాలజీ యుగం. ఈయుగంలో కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతికతను మనం అంది పుచ్చుకోవాలి. ఎక్కడ చూసినా స్మార్ట్ ఫోన్లు. అరచేతిలో ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం అంటే దానికి కారణం టెక్నాలజీ. ఆ టెక్నాలజీ లేకపోతే మన జీవనమే లేదు. అంతలా టెక్నాలజీకి అలవాటు పడిపోయాం. అందుకే… ఇంటర్నెట్ కు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం కరోనా వల్ల చాలామంది ఉద్యోగులు ఇంట్లో నుంచే పని చేస్తున్నారు. ఇంట్లో నుంచి పని చేయాలంటే ఖచ్చితంగా ఇంటర్నెట్ సౌకర్యం ఉండాల్సిందే. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని…. ఏపీలోని ప్రతి గ్రామంలో ఇంటర్నెట్ కనెక్షన్ కోసం, అమ్మఒడి పథకంలో భాగంగా… ఆప్షన్ గా ల్యాప్ టాప్ పంపిణీపై సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు.
ఈసందర్భంగా మాట్లాడిన సీఎం జగన్.. ఏపీలోని ప్రతి గ్రామంలో ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు.. అలాగే… అన్ని గ్రామాల్లో అన్ని సదుపాయాలతో కూడిన డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేయాలన్నారు. సొంత గ్రామంలోనే ఉండి… వర్క్ ఫ్రం హోమ్ పని చేసుకునే విధంగా కావాల్సిన సదుపాయాలను అందజేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. వాటికి సంబంధించిన అన్ని పనులు త్వరగా పూర్తి కావాలని అధకారులను ఆదేశించారు.
అలాగే… 2023 మార్చి లోగా… ఏపీలోని మారుమూల పల్లెకు కూడా అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలని…. అది హైస్పీడ్ ఇంటర్నెట్ డేటా రావాలని దాని కోసం అన్ని పనులు పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వచ్చే సంవత్సరం జనవరి 9న అమ్మఒడి పథకం అమలు కానుంది. అప్పుడే అందరికీ ల్యాప్ టాప్ లు అందజేస్తాం. అమ్మఒడి పథకంలో భాగంగా… 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ల్యాప్ టాప్ అందిస్తాం. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ కేబుల్స్ వాడాలి.. అని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.